టాటాల చేతికి ఎయిరిండియా.. 68 ఏళ్ల తర్వాత..!
ఎయిరిండియా బిడ్ దక్కించుకుంది టాటా సన్స్.. ఎయిరిండియాపై కాసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది… రూ.18 వేల కోట్ల ఓపెన్ బిడ్తో ఎయిరిండియాను సొంతం చేసుకుంది.. దీంతో 68 ఏళ్ల తర్వాత తిరిగి ఎయిరిండియా.. టాటాల చేతిలోకి వెళ్లింది… అయితే, టాటా సన్స్ అధినేత జహంగీర్ రతన్ జీ దాదాబాయ్ టాటా.. భారత్లో విమానయాన సర్వీసులను ప్రారంభించారు.. 1938లో విదేశాలకు కూడా విమాన సర్వీసులను విస్తరించారు.. మొదట టాటా ఎయిర్ సర్వీసెస్ గా ఉండగా.. ఆ తర్వాత టాటా ఎయిర్లైన్స్గా మార్చారు.. కొన్ని క్లిష్టమైన సమయాల్లోనూ టాటా ఎయిర్లైన్స్ బాసటగా నిలించింది.
అయితే, 1953లో టాటా సన్స్ నుంచి విమాన సర్వీసులను జాతీయకరణ చేశారు.. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత దాని పేరు ఎయిరిండియాగా మారిపోగా.. ఎయిరిండియాలో 49 శాతం వాటాను కొనుగోలు చేసింది కేంద్ర ప్రబుత్వం… ఇక, 1953లో దానిని జాతీయం చేసి టాటా సన్స్ నుంచి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకుంది.. అయితే, క్రమంగా నష్టాలను చవిచూస్తూ వచ్చింది ఎయిరిండియా.. దీంతో.. ప్రైవేట్కు అప్పగించడమే సరైనదే నిర్ణయానికి వచ్చింది సర్కార్.. సంస్థపై క్రమంగా రుణ భారం పెరిగిపోవడంతో.. కేంద్రం వ్యూహాత్మకంగా 100 శాతం వాటాల ఉపసంహరణకు 2020లో బిడ్లను ఆహ్వానించింది. ఇందులో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 100 శాతం వాటా, ఎయిర్ ఇండియా సాట్స్ 50 శాతం వాటా ఉంది. అయితే, నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేసినా.. ఫైనల్గా స్పైస్జెట్, టాటా సన్స్ చివరి వరకు పోటీ పడుతూ వచ్చాయి.. చివరకు రూ.18 వేల కోట్ల ఓపెన్ బిడ్తో ఎయిరిండియాను తిరిగి టాటా సన్స్ దక్కించుకుంది.. దీంతో.. 68 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టాటా చేతికి వెళ్లిపోయింది ఎయిరిండియా.. అయితే, ఈ ప్రక్రియ మొత్తం డిసెంబర్లో ముగిసే అవకావం ఉందని చెబుతున్నారు అధికారులు.
Also Read
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
తాజావార్తలు
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
-
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
-
Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
-
CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!