Air India Finalises Deal With Airbus: టాటాల చేతికి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్ తో కీలక ఒప్పందం చేసుకున్నట్లు నివేదిక చెబుతున్నాయి. అయితే అధికారికంగా ఎయిర్ ఇండియా ఎలాంటి ప్రకటన చేయలేదు.. వచ్చే వారం ఈ ఒప్పందంపై కీలక ప్రకటన చేస్తుందని
అబుదాబి నుంచి కోజికోడ్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంజన్లలో ఒకదానిలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Air India modifies in-flight alcohol service policy: ఇటీవల ఎయిరిండియా విమానంలో జరిగిన మూత్రవిసర్జన సంఘటన దేశ ఏమియేషన్ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శంకర్ మిశ్రా అనే వ్యక్తి మద్యం సేవించి ఓ సీనియర్ మహిళా ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేశాడు. దీంతో ఈ ఘటనపై డీజీసీఏ కీలక ఆదేశాలు జారీచేసింది. విమానంలో ప్రయాణికులు వికృత చర్యలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఎయిరిండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన మరో ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 6న ప్యారిస్-ఢిల్లీ విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. తోటి మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు.
Today (23-01-23) Business Headlines: జూన్ కల్లా ‘విశాఖ’ విస్తరణ: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్.. విశాఖపట్నంలో చేపట్టిన చమురు శుద్ధి కర్మాగారం విస్తరణ పనులను జూన్ చివరికి పూర్తిచేయనుంది. ఈ రిఫైనరీ ప్రస్తుత ప్రొడక్షన్ కెపాసిటీ 83 పాయింట్ 3 లక్షల టన్నులు కాగా దాన్ని దాదాపు రెట్టింపునకు.. అంటే.. ఒకటిన్నర కోట్ల టన్నులకు చేర్చుతున్నారు. ఈ విషయాలను HPCL చైర్మన్ పుష్ప్ జోషి వెల్లడించారు.
Air India Fined 30 Lakhs, Pilot's Licence Suspended For 3 Months: గతేడాది నవంబర్ నెలలో న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియాలో ఓ ప్రయాణికులు మద్యం మత్తులో మూత్రవిసర్జన చేసిన సంఘటన దేశ విమానయాన రంగంపై పలు విమర్శలు వచ్చాయి. దీనిపై విమానయాన రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. ఈ ఘటనపై ఆగ్రహంతో ఉంది. ఈ మేరకు డీజీసీఏ చర్యలు ప్రారంభించింది. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధించడంతో పాటు…
విమానాల్లో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన ఘటనలతో విమర్శలను ఎదుర్కొంటోన్న ఎయిరిండియా తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఎయిరిండియాకు చెందిన ఓ విమానంలో ప్రయాణించిన ఓ మహిళ చేసిన భోజనంలో రాయి వచ్చింది.