Air India Incident: పీ గేట్ వివాదం.. ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షలు జరిమానా..పైలెట్పై చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Fined 30 Lakhs, Pilot’s Licence Suspended For 3 Months: గతేడాది నవంబర్ నెలలో న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియాలో ఓ ప్రయాణికులు మద్యం మత్తులో మూత్రవిసర్జన చేసిన సంఘటనలో దేశ విమానయాన రంగంపై పలు విమర్శలు వచ్చాయి. దీనిపై విమానయాన రెగ్యులేటర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. ఈ ఘటనపై ఆగ్రహంతో ఉంది. ఈ మేరకు డీజీసీఏ చర్యలు ప్రారంభించింది. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా విధించడంతో పాటు పైలెట్ నిర్లక్ష్యం కూడా ఉండటంతో అతని లైసెన్స్ ను మూడు నెలలు సస్పెండ్ చేసింది. ఎయిరిండియా డైరెక్టర్ కు రూ. 3 లక్షల జరిమానా విధించింది.
Read Also: Delhi: ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్కు వేధింపులు.. వీడియో వైరల్
Also Read
ఈ ఘటనకు పాల్పడిన శంకర్ మిశ్రాపై ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ నాలుగు నెలలు పాటు విమానయాన నిషేధాన్ని విధిస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. గతంలో ఇతడిపై 30 రోజుల పాటు నిషేధాన్ని విధించింది. ఇప్పుడు విధించిన నిషేధం దీనికి అదనం. ఇదిలా ఉంటే చాలా రోజుల పాటు తప్పించుకుని తిరిగిని నిందితుడు శంకర్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసులో తాను మూత్రవిసర్జన చేయలేదని, సదరు మహిళే మూత్రవిసర్జన చేసుకుందని ఆరోపించాడు.
ఈ వివాదంపై నవంబర్ 27న సదరు మహిళ ఎయిరిండియా కు ఫిర్యాదు చేసుకుంది. ఎయిరిండియా దీనిపై జనవరి 4న పోలీసుకు ఫిర్యాదు చేసింది. జనవరి 5న డీజీసీఏ, ఎయిరిండియాకు షాకాజ్ నోటీసులు జారీ చేసి, మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కోరింది. ఈ ఘటన తర్వాత విమానంలో వికృతంగా ప్రవర్తించే వారిపట్ల చర్యలు తీసుకోవడంపై డీజీసీఏ మార్గదర్శకాలు జారీ చేసింది. క్యాబిన్ సిబ్బంది, పైలెట్ల బాధ్యతల గురించి వివరించింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?