DGCA: ఎయిరిండియాకు డీజీసీఏ నోటీసులు.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGCA: ఎయిరిండియా విమానాల్లో తోటి ప్రయాణికులపై మూత్రవిసర్జన చేసిన ఘటనలు రెండు జరిగాయి. ఎయిరిండియా విమానంలో జరిగిన ఘటనపై డీజీసీఏ సీరియస్ అయింది. ఎయిరిండియా మేనేజర్కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. గత నెల 6న ప్యారిస్-ఢిల్లీ విమానంలో మూత్రం పోసిన ఘటనపై నిబంధనల ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోలేదని షోకాజ్ నోటీసులో ప్రస్తావించింది. ఈ కేసులో నిబంధనలు పాటించని ఎయిరిండియాపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ డీజీసీఏ ప్రశ్నించింది. వికృతి చేష్టలకు పాల్పడ్డ ప్రయాణికులపై ఎందుకు వెంటనే చర్యలు తీసుకోలేదని నోటీసులో ప్రస్తావించింది.
Viral Letter: భార్యను బుజ్జగించుకోవాలి.. లీవ్ ఇవ్వండి.. ఏఎస్పీకి కానిస్టేబుల్ లెటర్
Also Read
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
- Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
- Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్వాచ్లు అందుబాటులోకి..
న్యూయార్క్-ఢిల్లీ విమానంలో వెల్స్ ఫార్గో సంస్థ ఉపాధ్యక్షుడు శంకర్ మిశ్రా మద్యం మత్తులో ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేయడం తెలిసిందే. ఇది జరిగిన పది రోజుల తర్వాత ప్యారిస్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మద్యం మత్తులో అతడు కూడా తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. విమానంలో అనుచిత ప్రవర్తనకు పాల్పడే ప్రయాణికుల పట్ల అనుసరించాల్సిన విధివిధానాలను కూడా ఎయిరిండియా పాటించలేదని గుర్తించింది. ఈ ఘటనపై ఆలస్యంగా స్పందించడమే కాకుండా, సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని డీజీసీఏ తన నోటీసుల్లో ఆక్షేపించింది. న్యూయార్క్-ఢిల్లీ విమాన ఘటనకు సంబంధించి డీజీసీఏ ఈ నెల 5న నోటీసులు జారీ చేసింది. నాలుగు రోజుల వ్యవధిలో తాజా నోటీసులు జారీ చేసింది.
తాజావార్తలు
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్లో సమస్యలే
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్వాచ్లు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?