ఎయిర్ ఇండియా లండన్-ముంబై విమానంలో బాత్రూమ్లో ధూమపానం చేసి ఇతర ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినందుకు అమెరికా పౌరుడిపై కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు ఆదివారం తెలిపారు.
బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిని బుధవారం అధికారులు కేరళలో అరెస్ట్ చేశారు. బహ్రైన్-కోజికోడ్-కోచి సర్వీస్లో సదరు సిబ్బంది పని చేస్తున్నాడు. నిందితుడిని వయనాడ్(కేరళ)కు చెందిన షఫీగా గుర్తించారు.
Air India: ఎయిరిండియా.. దేశీయంగా మరియు అంతర్జాతీయంగా శరవేగంతో విస్తరించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొత్త విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఆ విమానాల్లో పనిచేసేందుకు కొత్తవాళ్లను నియమించుకోనుంది. ఈ ఏడాది 4 వేల 200 మందికి పైగా క్యాబిన్ సిబ్బందిని మరియు 9 వందల మంది పైలట్లను అదనంగా తీసుకోనుంది. ఏడాది కిందట టాటా గ్రూప్ సొంతమైన ఎయిరిండియా 470 విమానాలను తెప్పించుకునేందుకు బోయింగ్ మరియు ఎయిర్బస్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
Air India: ఎయిర్ ఇండియా ఈ మధ్య తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంది. ఇటీవల మూత్ర విసర్జన ఘటనలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా విమానంలో అందించే ఫుడ్ విషయమై మరోసారి వివాదాలను మూటగట్టుకుంది.
Thiruvananthapuram: కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీని విధించారు అధికారులు. కాలికట్ నుంచి సౌదీ అరేబియాలోని డమ్మామ్ వెళ్లాల్సిన విమానంలో హైడ్రాలిక్ వైఫల్యం తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విమానాన్ని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి డైవర్ట్ చేశారు.
Air India: ఎయిరిండియా అంతర్జాతీయ విమానంలో మరోసారి సాంకేతిక సమస్య ఏర్పడింది. నెవార్క్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న విమానాం స్వీడన్ లోని స్టాక్ హోమ్ కి మళ్లించారు. బోయింగ్ 777-300ఈఆర్ విమానంలోని ఒక ఇంజిన్ లో ఆయిల్ లీక్ కావడంతో సాంకేతిక సమస్య తలెత్తిందని డీజీసీఏ వెల్లడించింది.
Air India: ఎయిర్ ఇండియా డీల్ ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. ఏకంగా 470 కొత్త విమానాలకు ఆర్డర్ చేసి ప్రపంచ విమానయాన రంగంలోనే సంచలనం నమోదు చేసింది. ప్రభుత్వం నుంచి టాటా సంస్థ ఎయిరిండియాను చేజిక్కించుకున్న తర్వాత దాని రూపురేఖలే మారిపోనున్నాయి. ఎయిర్ బస్, బోయింగ్ ఈ రెండు సంస్థల నుంచి ఏకంగా 80 బిలియన్ డాలర్ల డీల్ తో ఎయిరిండియా 470 విమానాలను కొనుగోలు చేయనుంది. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.6 లక్షల కోట్లకు పైమాటే.…
Air India: వాణిజ్య విమానయాన చరిత్రలో ఎయిరిండియా సరికొత్త అధ్యాయం లిఖిస్తోంది. ఫ్రాన్స్ సంస్థ ఎయిర్బస్తోపాటు అమెరికా కంపెనీ బోయింగ్తో అతిపెద్ద ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండింటి నుంచి 500లకు పైగా కొత్త విమానాలను కొనుగోలు చేస్తోంది. తద్వారా భారతదేశ విమానయాన రంగంలో పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని ఎయిరిండియా ఆశిస్తోంది. అదే సమయంలో.. లోకల్ లో-కాస్ట్ ప్రత్యర్థి సంస్థలను మరియు ఎమిరేట్స్ వంటి పవర్ఫుల్ గల్ఫ్ ఎయిర్లైన్స్ను ధీటుగా ఢీకొట్టబోతోంది.
Air India Finalises Deal With Airbus: టాటాల చేతికి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్ తో కీలక ఒప్పందం చేసుకున్నట్లు నివేదిక చెబుతున్నాయి. అయితే అధికారికంగా ఎయిర్ ఇండియా ఎలాంటి ప్రకటన చేయలేదు.. వచ్చే వారం ఈ ఒప్పందంపై కీలక ప్రకటన చేస్తుందని
అబుదాబి నుంచి కోజికోడ్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంజన్లలో ఒకదానిలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.