Indigo Flight : రోడ్లపై అయిపోయాయి.. ఇక విమానాల్లో మొదలయ్యాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indigo Flight : ఇప్పటి వరకు రోడ్లపై వెళ్తున్న మహిళలపై మందుబాబులు వేధింపులకు పాల్పడే వారు. ఇక వారి వేధింపులు విమానాల్లో మొదలుపెట్టారు. ఎయిర్ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన ఇటీవల తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మరవకముందే మరో విమానంలో ఇలాంటిదే మరొకటి జరిగింది. ఇండిగో విమానంలో ప్రయాణికులు తప్పతాగి రచ్చ రచ్చ చేశారు. ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా అడ్డొచ్చిన విమాన కెప్టెన్పై దాడి చేశారు.
Read Also: Israel Protest : అట్టుడుకుతున్న ఇజ్రాయెల్.. రోడ్లను దిగ్బంధించిన నిరసనకారులు
Also Read
- Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
ఈ ఘటన ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి పట్నా వెళ్లిన ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. పీకల దాకా తాగిన ముగ్గురు వ్యక్తులు విమానంలో వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆమెను ఇబ్బందులకు గురి చేశారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన విమాన కెప్టెన్పై దాడి చేశారు. దీంతో వీరి గురించి విమాన సిబ్బంది ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. విమానం పట్నా విమానాశ్రయంలో దిగగానే సీఐఎస్ఎఫ్ అధికారులు వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు.
Read Also: Employees Layoffs : ఇక గోల్డ్ మాన్ వంతు.. 3200ఉద్యోగాలకు కోత
ఇదిలా ఉండగా.. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో ప్రయాణికురాలిపై తాగిన మత్తులో ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటనపై టాటాసన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అన్నారు. ఈ ఘటన తనకు, తన సహోద్యోగులకు వ్యక్తిగతంగా తీవ్ర వేదన కలిగించిందన్నారు. ఈ ఘటనపై తాము మరింత వేగంగా స్పందించి ఉంటే బాగుండేదని, కానీ తాము తగిన రీతిలో స్పందించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది నవంబరు 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిరిండియా విమానంలో మద్యం మత్తులో ఉన్న శంకర్ మిశ్రా అనే వ్యక్తి తోటి ప్రయాణికురాలైన వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఢిల్లీ పోలీసులకు ఆమె తాజాగా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చి కలకలం రేపింది.
తాజావార్తలు
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!