Air India Flight: తప్పిన పెనుప్రమాదం.. గాలిలో ఉండగా విమానం ఇంజిన్లో మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Flight: అబుదాబి నుంచి కోజికోడ్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంజన్లలో ఒకదానిలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. తిరిగి విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం తెలిపింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తెలిపింది.
విమానం టేకాఫ్ అయినప్పుడు అందులో 184 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం వెయ్యి అడుగుల ఎత్తులో ఉండగా మంటలు చెలరేగాయని, పైలట్ వెంటనే గుర్తించి అబుదాబీ ఎయిర్పోర్టుకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తెలిపింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బీ737-800 విమానం మధ్యలో మంటలు చెలరేగడంతో అబుదాబి విమానాశ్రయానికి తిరిగి వచ్చిందని డీజీసీఏ తెలిపింది.
Also Read
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
- WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
Free Flight Tickets: విమాన టిక్కెట్లు ఫ్రీగా ఇస్తాం.. మా దేశం వచ్చిపోండి
జనవరి 23న త్రివేండ్రం నుంచి మస్కట్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత తిరిగి ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 2022లో దుబాయ్కి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో పాము కనిపించింది.కాలికట్ నుండి దుబాయ్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బోయింగ్ B-737 విమానం షెడ్యూల్ ప్రకారం బయలుదేరింది. దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత, సిబ్బంది విమానంలో పాము ఉన్నట్లు నివేదించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు విమానయాన నియంత్రణ సంస్థ ఆదేశించింది.
తాజావార్తలు
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!