Air India: ఎయిర్బస్తో ఎయిరిండియా భారీ డీల్.. 250 కొత్త విమానాల కోసం ఒప్పందం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Finalises Deal With Airbus: టాటాల చేతికి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్ తో కీలక ఒప్పందం చేసుకున్నట్లు నివేదిక చెబుతున్నాయి. అయితే అధికారికంగా ఎయిర్ ఇండియా ఎలాంటి ప్రకటన చేయలేదు.. వచ్చే వారం ఈ ఒప్పందంపై కీలక ప్రకటన చేస్తుందని భావిస్తున్నారు. ఎయిర్బస్ తో 250 విమానాల కోసం ఆర్డర్ ఖరారు చేసిందని సమాచారం. దీంతో పాటు సుమారు 200 విమానాల కోసం బోయింగ్ తో ఎయిర్ లైన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
Read Also: Vitamin D: విటమిన్-డితో తగ్గనున్న టైప్-2 డయాబెటిస్ ముప్పు..
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
- Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
ఎయిరిండియాను టాటా గ్రూపు యాజమాన్యం దక్కించుకున్న తర్వాత కార్యకలాపాలతో పాటు విమానాలను కూడా విస్తరించాలని చూస్తోంది. ఇటీవల ఎయిరిండియా చీఫ్ క్యాంప్ బెల్ విల్సన్ మాట్లాడుతూ.. కొత్త విమానాల కోసం తమ సంస్థ ఆర్డర్లను ఖారారు చేస్తున్నట్లు తెలిపారు. చివరిసారిగా ఎయిరిండియా 16 ఏళ్ల క్రితం కొత్త విమానాలను కొనుగోలు చేసింది. 2005 నుంచి ఒక్క విమానాన్ని కూడా కొనుగోలు చేయలేదు. చివరిసారిగా 111 విమానాల కోసం బోయింగ్ తో 68, ఎయిర్ బస్ తో 43 విమానాల కోసం 10.8 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని చేసుకుంది.
తాజాగా ఎయిర్ బస్ 250 విమానాల ఒప్పందంలో ఏ350 విమానాలు 40 ఉండే అవకాశం ఉంది. ఈ విమానాలను నిర్వహించే మొదటి భారతీయ విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా నిలిచిపోనుంది. గతంలో ఎయిరిండియా ఏ330 విమానాలను నడిపింది. ఏవియేషన్ కన్సల్టెన్సీ పీఏపీఏ ప్రకారం 2024 నాటికి భారతీయ ఎయిర్ లైన్స్ సంస్థలు 1700 విమానాల కోసం ఆర్డర్లు చేసే అవకాశం ఉంది. దీంట్లో 500 విమానాలను ఎయిర్ ఇండియానే కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపింది.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..