Air India: ఎయిర్బస్తో ఎయిరిండియా భారీ డీల్.. 250 కొత్త విమానాల కోసం ఒప్పందం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Finalises Deal With Airbus: టాటాల చేతికి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్ తో కీలక ఒప్పందం చేసుకున్నట్లు నివేదిక చెబుతున్నాయి. అయితే అధికారికంగా ఎయిర్ ఇండియా ఎలాంటి ప్రకటన చేయలేదు.. వచ్చే వారం ఈ ఒప్పందంపై కీలక ప్రకటన చేస్తుందని భావిస్తున్నారు. ఎయిర్బస్ తో 250 విమానాల కోసం ఆర్డర్ ఖరారు చేసిందని సమాచారం. దీంతో పాటు సుమారు 200 విమానాల కోసం బోయింగ్ తో ఎయిర్ లైన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
Read Also: Vitamin D: విటమిన్-డితో తగ్గనున్న టైప్-2 డయాబెటిస్ ముప్పు..
Also Read
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
- UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
- Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
ఎయిరిండియాను టాటా గ్రూపు యాజమాన్యం దక్కించుకున్న తర్వాత కార్యకలాపాలతో పాటు విమానాలను కూడా విస్తరించాలని చూస్తోంది. ఇటీవల ఎయిరిండియా చీఫ్ క్యాంప్ బెల్ విల్సన్ మాట్లాడుతూ.. కొత్త విమానాల కోసం తమ సంస్థ ఆర్డర్లను ఖారారు చేస్తున్నట్లు తెలిపారు. చివరిసారిగా ఎయిరిండియా 16 ఏళ్ల క్రితం కొత్త విమానాలను కొనుగోలు చేసింది. 2005 నుంచి ఒక్క విమానాన్ని కూడా కొనుగోలు చేయలేదు. చివరిసారిగా 111 విమానాల కోసం బోయింగ్ తో 68, ఎయిర్ బస్ తో 43 విమానాల కోసం 10.8 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని చేసుకుంది.
తాజాగా ఎయిర్ బస్ 250 విమానాల ఒప్పందంలో ఏ350 విమానాలు 40 ఉండే అవకాశం ఉంది. ఈ విమానాలను నిర్వహించే మొదటి భారతీయ విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా నిలిచిపోనుంది. గతంలో ఎయిరిండియా ఏ330 విమానాలను నడిపింది. ఏవియేషన్ కన్సల్టెన్సీ పీఏపీఏ ప్రకారం 2024 నాటికి భారతీయ ఎయిర్ లైన్స్ సంస్థలు 1700 విమానాల కోసం ఆర్డర్లు చేసే అవకాశం ఉంది. దీంట్లో 500 విమానాలను ఎయిర్ ఇండియానే కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపింది.
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..