ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో తిరిగి ఆ దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అని ప్రపంచం మొత్తం అందోళన చెందుతున్నది. ఆఫ్ఘనిస్తాన్ చిన్నదేశమే అయినప్పటికి భారత్కు మిత్రదేశం. ఆ దేశంలో భారత్ కోట్లాది రూపాయలను పెట్టుబడిగా పెట్టి జాతీయ ప్రాజెక్టులు, రహదారులు నిర్మించింది. ఇప్పుడు తాలిబన్ల చేతిలోకి ఆఫ్ఘన్ పాలన వెళ్లడంతో దాని ప్రభావం అనేక వస్తువులపై పడే అవకాశం ఉన్నది. ఇండియా నుంచి అనేక వస్తువులను దిగుమతి చేసుకునే ఆఫ్ఘనిస్తాన్, ఇకపై ఇండియా నుంచి ఆ వస్తువులను…
2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ టవర్స్పై అల్ఖైదా ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడిలో వరల్డ్ ట్రేడ్ టవర్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు జూనియర్ బుష్ ఆఫ్ఘనిస్తాన్లోని అల్ఖైదా నాయకుడు లాడెన్ ఉన్నాడని, అతడిని తమకు అప్పటించాలని అమెరికా కోరింది. కానీ, అందుకు అప్పటి తాలిబన్ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో ఆఫ్ఘన్లోని తాలిబన్ సేనలపై అమెరికా సైనికులు దాడులు చేశారు. తాలిబన్లను తరిమికొట్టి ఆ దేశంలో ప్రజాస్యామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పారు. అప్పటి…
తాలిబన్ల పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతున్నది. లక్షలాది మంది సైనికులు, ఆధునిక ఆయుధసంపత్తి, 20 ఏళ్లుగా అమెరికా సైన్యం ఇచ్చిన ట్రైనింగ్లో రాటు తేలిన ఆఫ్ఘన్ సైనికులను రెండు వారాల వ్యవధిలోనే ఓడించి దేశాన్ని వారి చేతుల్లోకి తీసుకున్నారు. తాము లేకున్నా, ఆఫ్ఘన్ సైనికులు పోరాటం చేయగలరనే ధీమాతో ఆమెరికా అక్కడి నుంచి వైదొలిగింది. సెప్టెంబర్ 11 వరకు ఆఫ్ఘన్ నుంచి పూర్తిగా వెనక్కి వచ్చేయాలని ఆమెరికా నిర్ణయం తీసుకోవడంతో తాలిబన్లు రెచ్చిపోయారు. చాలా ప్రాంతాల్లో…
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల దాడులకు సంబంధించిన అంశంలో భారత ప్రభుత్వం స్పందించాలి. టెర్రరిస్టులు మన దేశం వైపు కూడా చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది అని సీపీఐ నారాయణ అన్నారు. ముందే మనం కూడా మేల్కొంటే.. అందరికీ మంచిది. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేయాలని చూడటం దుర్మార్గం. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీనీ అమ్మేస్తున్నారు. కోవిడ్ సమయంలోనే అదానీ, అంబానీలు వందల కోట్లు సంపాదించుకున్నారు. ప్రధాని చెప్పేవన్నీ మాటలకే పరిమితం.. చేతల్లో మాత్రం…
అనుకున్నతం పని అయిపోయింది.. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్లోని 19 రాష్ట్రాలకు సంబంధించిన రాజధానుల్లో పాగా వేసిన తాలిబన్లు.. ఇక. ఆఫ్ఘన్పై పూర్తిస్థాయిలో పట్టు సాధించేదశగా కదులుతున్నారు.. దీనిలో భాగంగా తాలిబన్ తిరుగుబాటుదారులు రాజధాని కాబూల్లోకి ప్రవేశించిరాని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్పీ ప్రకటించింది.. దేశంలోని అన్ని ప్రధాన నగరాలను ఇప్పటికే ఆక్రమించారు తాలిబన్లు.. ఇప్పుడు రాజధాని నగరాన్నీ తమ ఆధీనంలోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.. ఎందుకంటే.. ఇప్పటికే దేశ రాజధాని కాబూల్లో అడుగుపెట్టారు తాలిబన్లు.. కేపిటల్ సిటీపై పూర్తిస్థాయిలో…
తాలిబన్లు.. ఆఫ్ఘనిస్థాను స్వాధీనం చేసుకునే దిశగా ముందుకు కదులుతూనే ఉన్నారు.. ఓవైపు అరచకాలు సృష్టిస్తూ తాలిబన్లు దూసుకెళ్తుండగా.. వారిని నిలువరించలేక.. సైన్యం సైతం చేతులు ఎత్తేసింది.. చివరకు ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లోకి కూడా ఎంట్రీ అయిపోయారు తానిబన్లు.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రస్తుత యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.. ఆఫ్ఘన్లో తాలిబన్ల రాజ్యానికి తెరదించి, ఆ దేశాన్ని పునర్నిర్మించడానికి ఈ రెండు దశాబ్దాలలో…
2001 లో ట్విన్ టవర్స్పై దాడుల తరువాత అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్లో అడుగుపెట్టాయి. అప్పటి నుంచి రెండు దశాబ్దాలపాటు ఆ దేశంలోని ముష్కరులను మట్టుపెట్టడమే కాకుండా, ఆఫ్ఘనిస్తాన్కు రక్షణ కల్పిస్తూ వచ్చాయి. 20 ఏళ్ల తరువాత ఆ దేశం నుంచి తమ దళాలను వెనక్కి తరలించాలని అమెరికా నిర్ణయం తీసుకున్నది. సెప్టెంబర్ వరకు పూర్తిగా దళాలను వెనక్కి తీసుకోవాలని అనుకున్నా, ఆ ప్రక్రియను ముందుగానే పూర్తిచేసింది. ఎప్పుడైతే ఆఫ్ఘన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి తగ్గడం మొదలుపెట్టిందో…
తాలిబన్లు 75 శాతానికి పైగా ఆఫ్ఘన్ ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాబూల్ మినహా మిగతా భూభాగాలను ఇప్పటికే తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్, ఆఫ్ఘన్ ప్రభుత్వాల మధ్య సంధికి ఖతార్ ప్రయత్నాలు చేస్తున్నది. అధికారాన్ని తాలిబన్లతో కలిసి పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఇక, తాలిబన్ల ప్రభుత్వాన్ని తాము గుర్తించబోమని ఇండియాతో సహా 12 దేశాలు స్పష్టం చేశాయి. ఇక ఇదిలా ఉంటే, తాలిబన్ నేతలు ఇండియాపై ప్రశంసలు…