RBI కొత్త గైడ్లైన్స్.. డిజిటల్ ఫ్రాడ్కు 85% వరకు పరిహారం..!
- డిజిటల్ మోసాల బాధితులకు RBI కొత్త ఊరట
- 85% వరకు పరిహారం.. ₹25,000 గరిష్ట పరిమితి
- పరిహారం పొందాలంటే 5 రోజుల్లో ఫిర్యాదు తప్పనిసరి
- బ్యాంక్ తప్పిదం అయితే పూర్తి రీఫండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI Draft Guidelines: డిజిటల్ ఫ్రాడ్స్ (ఆన్లైన్ మోసాలు) బారిన పడి డబ్బులు కోల్పోయిన బ్యాంక్ కస్టమర్లకు ఊరటనిచ్చేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సరికొత్త ముసాయిదా మార్గదర్శకాలను (Draft Guidelines) విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, బాధితులు కోల్పోయిన మొత్తంలో 85 శాతం వరకు లేదా గరిష్టంగా ₹25,000 పరిహారంగా పొందే అవకాశం ఉంది.
Tragedy : మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ పోసిన స్కూల్ టీచర్.. ఆపై..!
Also Read
- Rahul Gandhi: నా మాటల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పాను.. ‘ఇడియట్స్’ వ్యాఖ్యలపై రాహుల్గాంధీ క్లారిటీ
- LPG eKYC: ఎల్పీజీ కేవైసీ అప్డేట్ మెసేజ్ వచ్చిందా..? అయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి..
- Rahul Gandhi: "అమిత్ షా పోలీసులతో మాట్లాడడం నేను చూశాను".. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
- CJP: బీజేపీపై భారీ ఉద్యమం.. ఆప్, కాంగ్రెస్లపై మాత్రం కాక్రోచ్ మౌనం.
RBI కొత్త ప్రతిపాదనలు – ప్రధానాంశాలు:
పరిహారం మొత్తం: చిన్న తరహా డిజిటల్ మోసాల్లో (Small-value frauds) కస్టమర్లు కోల్పోయిన నెట్ లాస్లో 85% వరకు పరిహారం అందుతుంది. అయితే ఈ పరిహారం గరిష్టంగా ₹25,000 కు మాత్రమే పరిమితం చేయబడింది. (ఉదాహరణకు: మీరు ₹20,000 కోల్పోతే, అందులో 85% అంటే ₹17,000 పరిహారం వస్తుంది. ఒకవేళ ₹50,000 కోల్పోతే, 85% మొత్తం ₹42,500 అయినప్పటికీ, గరిష్ట పరిమితి ప్రకారం మీకు ₹25,000 మాత్రమే లభిస్తుంది).
ఎవరికి వర్తిస్తుంది? : సుమారు ₹50,000 లోపు జరిగే డిజిటల్ లావాదేవీల మోసాలకు ఇది వర్తిస్తుంది. దాదాపు 65% ఆన్లైన్ ఫ్రాడ్స్ ఈ కేటగిరీలోనే ఉంటున్నాయని RBI గుర్తించింది.
ముఖ్య నిబంధనలు:
- ఈ ప్రయోజనాన్ని ఒక కస్టమర్ తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే పొందగలరు.
- మోసం జరిగిన 5 రోజులలోపు బ్యాంక్కు , నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ (1930) కు ఫిర్యాదు చేయాలి.
- కస్టమర్ పొరపాటున OTP లేదా పాస్వర్డ్ షేర్ చేసిన సందర్భాల్లో కూడా (Unintended negligence) కొన్ని షరతులతో ఈ పరిహారం వర్తిస్తుంది.
- నిధుల సేకరణ: ఈ పరిహార మొత్తాన్ని RBI వద్ద ఉన్న ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్’ (DEAF) నుండి చెల్లిస్తారు. ఇందులో RBI వాటా 65% ఉండగా, సంబంధిత బ్యాంకులు మిగిలిన మొత్తాన్ని భరిస్తాయి.
- అమలు: ఈ నిబంధనలు జూలై 1, 2026 నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇవి ముసాయిదా దశలో ఉన్నాయి, ప్రజలు , స్టేక్ హోల్డర్స్ ఏప్రిల్ 6, 2026 వరకు తమ అభిప్రాయాలను తెలపవచ్చు.
- ఎప్పుడు సున్నా బాధ్యత (Zero Liability) ఉంటుంది?
ఒకవేళ మోసం అనేది బ్యాంక్ వైఫల్యం వల్ల లేదా థర్డ్ పార్టీ బ్రీచ్ వల్ల జరిగితే (కస్టమర్ ప్రమేయం లేకుండా), అప్పుడు కస్టమర్కు పూర్తి రీఫండ్ లభిస్తుంది. - బ్యాంక్ వైపు నుంచి భద్రతా లోపాలు ఉన్నట్లు తేలితే దానికి బ్యాంకే బాధ్యత వహించాలి.
CM Revanth Reddy : వర్గీకరణ పోరాటంలో నేనే మీ బార్బరికుడిని.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
తాజావార్తలు
-
Rahul Gandhi: నా మాటల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పాను.. ‘ఇడియట్స్’ వ్యాఖ్యలపై రాహుల్గాంధీ క్లారిటీ
-
LPG eKYC: ఎల్పీజీ కేవైసీ అప్డేట్ మెసేజ్ వచ్చిందా..? అయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి..
-
Rahul Gandhi: “అమిత్ షా పోలీసులతో మాట్లాడడం నేను చూశాను”.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
-
Honor X6e Launched: 7,500mAh బ్యాటరీ, TFT LCD స్క్రీన్, 4GB ర్యామ్+ 128GB స్టోరేజ్ రూ.16 వేలకే..
-
AP Rain Alert: ఏపీకి మరోసారి భారీ వర్షాల హెచ్చరికలు..! జిల్లాల వారీగా తాజా అంచనా
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!