RBI Draft Guidelines: డిజిటల్ ఫ్రాడ్స్ (ఆన్లైన్ మోసాలు) బారిన పడి డబ్బులు కోల్పోయిన బ్యాంక్ కస్టమర్లకు ఊరటనిచ్చేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సరికొత్త ముసాయిదా మార్గదర్శకాలను (Draft Guidelines) విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, బాధితులు కోల్పోయిన మొత్తంలో 85 శాతం వరకు లేదా గరిష్టంగా ₹25,000 పరిహారంగా పొందే అవకాశం ఉంది.
Tragedy : మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ పోసిన స్కూల్ టీచర్.. ఆపై..!
RBI కొత్త ప్రతిపాదనలు – ప్రధానాంశాలు:
పరిహారం మొత్తం: చిన్న తరహా డిజిటల్ మోసాల్లో (Small-value frauds) కస్టమర్లు కోల్పోయిన నెట్ లాస్లో 85% వరకు పరిహారం అందుతుంది. అయితే ఈ పరిహారం గరిష్టంగా ₹25,000 కు మాత్రమే పరిమితం చేయబడింది. (ఉదాహరణకు: మీరు ₹20,000 కోల్పోతే, అందులో 85% అంటే ₹17,000 పరిహారం వస్తుంది. ఒకవేళ ₹50,000 కోల్పోతే, 85% మొత్తం ₹42,500 అయినప్పటికీ, గరిష్ట పరిమితి ప్రకారం మీకు ₹25,000 మాత్రమే లభిస్తుంది).
ఎవరికి వర్తిస్తుంది? : సుమారు ₹50,000 లోపు జరిగే డిజిటల్ లావాదేవీల మోసాలకు ఇది వర్తిస్తుంది. దాదాపు 65% ఆన్లైన్ ఫ్రాడ్స్ ఈ కేటగిరీలోనే ఉంటున్నాయని RBI గుర్తించింది.
ముఖ్య నిబంధనలు:
CM Revanth Reddy : వర్గీకరణ పోరాటంలో నేనే మీ బార్బరికుడిని.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!