ఆప్ఘనిస్థాన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు తాలిబన్లు.. దేశ రాజధాని కాబూల్ సహా.. అన్ని ప్రధాన నగరాలను.. చివరకు అధ్యక్ష భవనాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు.. అక్కడ పార్టీ కూడా చేసుకున్నారు.. అయితే, ప్రజలు మాత్రం భయంతో వణికిపోతున్నారు.. కాబూల్లో ప్రధాన రహదారులు.. వాహనాలతో భారీ ట్రాఫిక్తో దర్శనమిస్తుండగా.. ఇక, ఎయిర్పోర్ట్ లో ప్రజల రద్దీ పెరిగిపోయింది.. పెద్ద ఎత్తున ప్రజలు ఎయిర్పోర్ట్లోకి దూసుకెళ్లారు.. విమానంలో ఎక్కితే చాలు అనే అతృత వారిలో కనిపిస్తోంది.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని…
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది.. చాలా దేశాలు ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి.. రాక్షస మూకల చేతుల్లోకి ఆఫ్ఘన్ వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. ఈ తరుణంలో తాలిబన్లతో స్నేహానికి తాము సిద్ధమని చైనా ప్రకటిస్తే.. ఇక, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. ఆఫ్ఘన్లో జరిగిన పరిణామాలను బానిస సంకెళ్లను తెంచుకోవడంగా అభివర్ణించారు ఇమ్రాన్.. ఇతరుల సంస్కృతిని ఆకళింపు చేసుకోవడంపై స్పందిస్తూ.. ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ను ఓ మీడియంగా తీసుకోవడంపై…
ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్ల వశం అయిపోయింది.. ఎవరూ ఊహించని రేతిలో వేగంగా కాబూల్ను హస్తగతం చేసుకున్నారు తాలిబన్లు.. అయితే, ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఆఫ్ఘన్తో స్నేహనికి సిద్ధం అంటోంది డ్రాగన్ కంట్రీ.. ఆఫ్ఘనిస్థాన్లో జరుగుతున్న తాజా పరిణామాలపై స్పందించిన చైనా.. ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్ ఫైటర్లతో స్నేహ సంబంధాలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.. ఇక, ఆఫ్ఘన్ పొరుగు దేశమైన రష్యా మాత్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశంలో…
ఎప్పుడైతే అమెరికా సేనలు తప్పుకుంటున్నట్టు ప్రకటించాయో అప్పటి నుంచి తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. వారాల వ్యవధిలోనే తాలిబన్లు ఆ దేశం మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. ఆదివారం రోజున తాలిబన్లు కాబూల్ శివారు ప్రాంతానికి చేరుకోగా, సోమవారం నాడు కాబూల్లోకి వచ్చారు. అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన తరువాత తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. యుద్ధం ముగిసిందని, ఆఫ్ఘన్ ప్రజలకు, ముజాహిదీన్లకు మంచిరోజులు వచ్చాయని అంతర్జాతీయ మీడియాతో తెలిపారు. శాంతియుతమైన పాలన అందిస్తామని చెప్పిన తాలిబన్ నేతలు, త్వరలోనే…
కాబూల్ లో ప్రస్తుతం పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నారు. వేగంగా అధికార మార్పిడి జరుగుతున్నది. అధికారంలోకి వచ్చిన తరువాత శాంతిని, అభివృద్దిని తీసుకొస్తామని తాలిబన్లు చెబుతున్నప్పటికీ ఎవరికి నమ్మకం కుదరడం లేదు. ఎందుకంటే, 1994 లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు పాలనలోకి వచ్చిన సమయంలో కూడా ఇదే విధమైన హామీ ఇచ్చారు. కానీ, ఆ వెంటనే అరాచకాలు సృష్టించారు. వారి నాలుగేళ్ల పాలనలో ఆఫ్ఘన్ వాసులు ఘోరంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు కూడా…
ఇప్పుడు ప్రపంచం దృష్టి మొత్తం ఆఫ్ఘనిస్తాన్, దానిని ఆక్రమించుకున్న తాలిబన్లపైనే ఉన్నది. 2001 నుంచి 2021 వరకు ఆఫ్ఘనిస్తాన్కు అండగా నాటో దళాలు, అమెరికా దళాలు రక్షణ కల్పిస్తూ వచ్చాయి. ఆఫ్ఘన్ సైన్యానికి అధునాతన ఆయుధాలతో పాటుగా, ఎలా పోరాటం చేయాలనే ట్రైనింగ్ను ఇచ్చారు. కానీ, అవేమి తాలిబన్ల ముందు పనిచేయలేకపోయాయి. 20 ఏళ్లతో ఆఫ్ఘన్లో జరిగిన అభివృద్ధి ఇప్పుడు ఏమౌతుందో అని భయపడుతున్నారు. 2001 నుంచి 2021 వరకు తాలిబన్లు పెద్దగా ప్రభావం చూపించకపోయినా, ఉనికిని…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనికులు వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. కాబూల్లోకి తాలిబన్లు చొచ్చుకొస్తున్నారని వార్తలు అందటంతో వేలాది మంది పౌరులు దేశాన్ని వదలి వెళ్లేందుకు సిద్దమయ్యాయి. వేలాది మంది పౌరులు ఎయిర్ పోర్టుకు చేరుకొని విమానాలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారికి కంట్రోల్ చేసేందుకు ఆమెరికా ఆర్మీ గాల్లోకి కాల్పులు జరిపింది. ద దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. ఇక ఇదిలా ఉంటే,…
తాలిబన్లు కాబూల్లోకి చొచ్చుకొస్తుండటంతో అన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసివేస్తున్నాయి. తమ ఉద్యోగులు, సిబ్బందిని స్వదేశానికి తరలించేందుకు పెద్ద ఎత్తున విమానాలను సిద్దం చేశారు. ఆర్మీ హెలికాప్టర్లు, విమానాలు అన్నింటిని స్వదేశానికి తరలించేందుకు కాబూల్ ఎయిర్పోర్టులో ఉన్నాయి. అయితే, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తొలుత వారి దేశానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. బ్రిటన్ తమ వారిని తరలించిన తరువాతే మిగతావారిని తరలిస్తామని చెబుతుండటంతో ఆఫ్ఘన్లు ఆందోళన చెందుతున్నారు. ఏ నిమిషంలో ఏమి జరుగుతుందో…
ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో తిరిగి ఆ దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అని ప్రపంచం మొత్తం అందోళన చెందుతున్నది. ఆఫ్ఘనిస్తాన్ చిన్నదేశమే అయినప్పటికి భారత్కు మిత్రదేశం. ఆ దేశంలో భారత్ కోట్లాది రూపాయలను పెట్టుబడిగా పెట్టి జాతీయ ప్రాజెక్టులు, రహదారులు నిర్మించింది. ఇప్పుడు తాలిబన్ల చేతిలోకి ఆఫ్ఘన్ పాలన వెళ్లడంతో దాని ప్రభావం అనేక వస్తువులపై పడే అవకాశం ఉన్నది. ఇండియా నుంచి అనేక వస్తువులను దిగుమతి చేసుకునే ఆఫ్ఘనిస్తాన్, ఇకపై ఇండియా నుంచి ఆ వస్తువులను…
2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ టవర్స్పై అల్ఖైదా ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడిలో వరల్డ్ ట్రేడ్ టవర్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు జూనియర్ బుష్ ఆఫ్ఘనిస్తాన్లోని అల్ఖైదా నాయకుడు లాడెన్ ఉన్నాడని, అతడిని తమకు అప్పటించాలని అమెరికా కోరింది. కానీ, అందుకు అప్పటి తాలిబన్ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో ఆఫ్ఘన్లోని తాలిబన్ సేనలపై అమెరికా సైనికులు దాడులు చేశారు. తాలిబన్లను తరిమికొట్టి ఆ దేశంలో ప్రజాస్యామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పారు. అప్పటి…