కోవిడ్ కట్టడిలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరులకు కొత్త ఆంక్షలు విధించింది. రెడ్ లిస్ట్ పేరుతో రూపొందించిన జాబితాలోని దేశాలకు వెళ్లిన వారికి భారీ జరిమానాలు సహా విదేశాలకు వెళ్లకుండా మూడేళ్లపాటు నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. నిషేధిత దేశాలకు వెళ్లడం.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడమేనని అక్కడి సర్కారు స్పష్టం చేసింది. అయితే, ఆ జాబితాలో భారత్ తో పాటు యూఏఈ, లిబియా, సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాన్, టర్కీ, అర్మేనియా, ఇథియోపియా, సొమాలియా, కాంగో,…
నవ్వడం ఒక వరమైతే, నవ్వించడం గొప్ప వరం. పదిమందిని నవ్విస్తున్న వ్యక్తికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖలో పనిచేస్తున్న నాజర్ మహ్మద్ అనే వ్యక్తి కమెడియన్గా మారిపోయారు. అఫ్ఘనిస్తాన్లో ఖంసా జ్వాన్గా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పదిమందికి నవ్వులు పంచుతున్న నాజర్ మహ్మద్ను తాలీబన్లు కిడ్నాప్ చేసి దారుణంగా గొంతుకోసి హత్యచేశారు. ఇస్లామ్ ప్రకారం నవ్వించడం నేరం అని అందుకే నాజర్ను హత్యచేశారని అంటున్నారు. కాందహార్ ప్రావిన్స్లోని…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో, అమెరికా దళాలు తప్పుకోవడంతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. అమాయక ప్రజలపై దాడులు చేస్తున్నారు. ఆఫ్ఘన్ ఆర్మిని చెదరగోడుతూ అనేక ప్రాంతాలను స్వాదీనంలోకి తీసుకుంటున్నారు. ఇక పాక్ ఇప్పటికే తాలీబన్లకు మద్దతు ఇస్తున్నది. దీంతో వారు మరింతగా రెచ్చిపోతున్నారు. మరోవైపు పాక్ ట్రోలర్లు ట్వట్టర్లో ఆఫ్ఘనిస్తాన్ను ట్రోల్ చేస్తున్నారు. మంగళవారం రోజున బక్రీద్ సందర్భంగా అధ్యక్షభవనంలో సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ ప్రార్ధనల్లో అధ్యక్షుడితో పాటు ఉపాద్యక్షుడు అమ్రుల్లా సలే కూడా పాల్గోన్నారు. ప్రార్ధనలు జరిగే…
భారత్ ఆస్తులను లక్ష్యంగా చేసుకొని పాక్ కొత్త ఎత్తులు వేస్తున్నది. ఆఫ్ఘనిస్తాన్లో తాలీబన్లు ఆక్రమించుకున్న ప్రాంతాల్లోని భారత్ కు సంబందించిన ఆస్తులను ధ్వంసం చేసేందుకు తాలీబన్ ఉగ్రవాదులతో చేతులు కలిపింది. పాక్ చెందిన 10వేల మంది సాయుధులు ఆఫ్ఘన్లోకి అడుగుపెట్టారు. వీరు భారత్ సహకారంతో నిర్మించిన ప్రాజెక్టులు, భవనాలు, రోడ్లను ధ్వంసం చేయబోతున్నారు. ఆఫ్ఘన్ పుననిర్మాణంలో భాగంగా భారత్ ఆ దేశంలో 300 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ కొత్త పార్లమెంట్ భవనంతో పాటుగా అనేక…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో బలగాలు తప్పుకుంటున్నాయి. నాటో, అమెరికా బలగాలు తప్పుకోవడంతో ఆ దేశంలో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్లోని అనేక ప్రాంతాలను తాలిబన్ ఉగ్రవాదులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ప్రతిరోజు అక్కడ హింసలు చెలరేగుతున్నాయి. ఉగ్రవాదుల దౌర్జన్యాలకు అమాయకమైన ప్రజలు బలి అవుతున్నారు. అమెరికా, నాటో బలగాలు తప్పుకోవడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ విమర్శించారు. అమెరికా, నాటో బలగాలు ఆఫ్ఘన్ నుంచి తప్పుకోవడం మంచి నిర్ణయం కాదని, బలగాల ఉపసంహరణ తరువాత…
ఆఫ్ఘన్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘన్లోని అనేక ప్రాంతాలను తమ స్వాదీనంలోకి తీసుకున్న తాలిబన్లు కాందహార్ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆఫ్ఘన్లో ఉన్న 210 చైనీయులను చైనా గతవారం వెనక్కి తీసుకెళ్లింది. ఆఫ్ఘన్ అంతర్గత ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేసిన నేసథ్యంలో తాలిబన్లు కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా దేశం ఆఫ్ఘనిస్తాన్కు మిత్రదేశంగా భావిస్తున్నామని, షిన్జీయాంగ్ ప్రావిన్స్లో వేర్పాటువాద ఉఘర్ ముస్లీంలకు తాము మద్ధతు ఇవ్వబోమని తాలిబన్లు చైనాకు హామీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో…
అఫ్ఘన్ నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడంతో మళ్లీ ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. దాదాపు రెండు దశాబ్ధాలపాటు ఆఫ్ఘన్లో అమెరికా బలగాలు మోహరించి ఉగ్రవాదుల కార్యకలాపాలను అణిచివేశాయి. ఎప్పుడైతే ఆ దేశం నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడం మొదలు పెట్టిందో అప్పటి నుంచే తాలిబన్లు ఆఫ్ఘన్లోని కీలక ప్రాంతాలను స్వాదీనం చేసుకోవడం మొదలుపెట్టారు. దక్షిణ ప్రాంతాలపై ఇప్పటికే పట్టుబిగించిన తాలిబన్లు, ఆ ప్రాంతంలో కీలకమైన కాందహార్ ను ఆదీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. Read:…