Hardik Pandya: గంభీర్కు గర్ల్ఫ్రెండ్ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మెగా ఫైనల్లో తలపడేందుకు టీమ్ ఇండియా శుక్రవారం (మార్చి 6) సాయంత్రం అహ్మదాబాద్ చేరుకుంది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై అద్భుత విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న భారత్, ఇప్పుడు కివీస్ను ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది. ముంబైలో జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను 7 పరుగుల తేడాతో ఓడించిన టీమ్ ఇండియా, శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా తమ వ్యక్తిగత కార్లలో వెళ్లగా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇతర ఆటగాళ్లు కలిసి హోటల్కు చేరుకున్నారు.
READ ALSO: Kitchen Vastu Tips: కిచెన్ లో ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులే..! శాస్త్రీయ కోణం కూడా ఉంది..
Also Read
- Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
- India vs Afghanistan: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్ గడ్డపై టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న ఆఫ్ఘనిస్థాన్.. పూర్తి షెడ్యూల్..
- Love Couple Attacked: ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులపై దాడి.. తాళిబొట్టు తెంచి..!
- Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్యా వీడియో..
ముంబై ఎయిర్పోర్ట్కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, తన గర్ల్ఫ్రెండ్ మాహికా శర్మను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు పరిచయం చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. మాహికా శర్మ ఈ వరల్డ్ కప్ టోర్నీ అంతటా హార్దిక్ వెంటే ఉంటూ టీమిండియాను ప్రోత్సహిస్తున్నారు. సెమీఫైనల్ మ్యాచ్లో హార్దిక్ కుమారుడు అగస్త్యతో కలిసి ఆమె మ్యాచ్ వీక్షించారు. మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న మ్యాచ్లో భారత్ గెలిస్తే పలు ప్రపంచ రికార్డులు బద్దలవుతాయి. టీమిండియా ఈ ఫైనల్ మ్యాచ్ గెలిస్తే, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా రెండుసార్లు టైటిల్ నెగ్గిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా తమ సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ను గెలవలేదు. భారత్ విజయం సాధిస్తే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా చరిత్రపుటల్లో శాశ్వత కీర్తిని సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడుతున్న మొదటి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్ జట్టుకు నాకౌట్ మ్యాచ్ల్లో అద్భుతమైన రికార్డు ఉంది. పెద్ద మ్యాచుల్లో ఎప్పుడైనా గట్టి పోటీనిచ్చి ఫలితాన్ని తారుమారు చేసే సామర్థ్యం కివీస్కు ఉందని క్రీడా విశ్లేషుకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, 1.30 లక్షల మంది ప్రేక్షకుల మధ్య హోమ్ గ్రౌండ్లో ఆడుతుండటం టీమిండియాకు అతిపెద్ద బలంగా చెబుతున్నారు.
READ ALSO: Sai Madhav Burra: ‘కథను మానభంగం చేశారు’.. ఓ లేటెస్ట్ మూవీపై సాయి మాధవ్ బుర్ర సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Ramayana Trailer: చివరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?
-
Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
-
India vs Afghanistan: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్ గడ్డపై టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న ఆఫ్ఘనిస్థాన్.. పూర్తి షెడ్యూల్..
-
Stock Market Crash: ఒకే ఒక్క నిర్ణయం.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్, భారీ నష్టాల్లో టాప్ 10 షేర్లు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!