ఆఫ్ఘనిస్తాన్లో అంతర్యుద్ధం జరుగుతున్నది. ఎలాగైనా పంజ్షీర్ ప్రావిన్స్ను అక్రమించుకోవాలని తాలిబన్లు చూస్తున్నారు. తాలిబన్లకు పంజ్షీర్ మాత్రమే కాకుండా, వారి చెర నుంచి ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని విడిపించాలని పంజ్షీర్ దళం పోరాటం చేస్తున్నది. పంజ్షీర్ ప్రావిన్స్లో మొత్తం 8 జిల్లాలు ఉన్నాయి. ఈ ఎనిమిది జిల్లాలలో పెద్ద ఎత్తున తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నది. అయితే, తాము పంజ్షీర్లోని 4 జిల్లాలను ఆక్రమించుకున్నామని, పంజ్షీర్ రాజధాని బజారక్ లోని గవర్నర్ కార్యాలయంలోకి కూడా ప్రవేశించామని తాలిబన్లు చెబుతుంటే, పంజ్షీర్…
ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఆగస్టు 15 వ తేదీన తాలిబన్లు కాబూల్ను ఆక్రమించుకున్నారు. తాలిబన్లు కాబూల్ ను ఎలా ఆక్రమించుకున్నారు అనే విషయంపై ఆ దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ కీలక సమాచారం అందించారు. ఆగస్టు 15 వ తేదీన పోలీస్ చీఫ్ తనకు ఫోన్ చేశారని, జైల్లో యుద్ధఖైదీలు తిరుగుబాటు చేస్తున్నారని, అణిచివేతకు సహాయం కావాలని కోరారని, అయితే, రక్షణ మంత్రి, హోమ్ మంత్రికి ఫోన్ చేసినా లాభం లేకపోయిందని,…
అప్ఘనిస్థాన్ లో తాలిబన్లకు, షంజ్ షేర్ యోధులకు మధ్య భీకరపోరు నడుస్తున్న సంగతి అందరికీ తెల్సిందే. విజయమో.. వీరమరణామో అన్న రీతిలో షంజ్ షేర్ సైన్యం తాలిబన్లపై విరుచుకుపడుతోంది. తమ మాతృభూమిని తాలిబన్లకు దక్కనిచ్చేది లేదని ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్, పంజ్షీర్ నాయకుడు మసూద్ ప్రకటించారు. నార్తర్న్ అలయెన్స్ పేరిట ఏర్పడిన గ్రూప్ ఆఫ్ఘన్ తాలిబన్ల వశం కాకుండా పోరాడుతోంది. అయితే దీనికి విరుద్దంగా తాలిబన్లు మాత్రం తాము పంజ్ షేర్ ను స్వాధీనం చేసుకున్నట్లు…
ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం కొనసాగుతూనే ఉంది.. ఓవైపు పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాలిబన్లు ప్లాన్ చేస్తుండగా.. మరోవైపు.. పంజ్షీర్లో తాలిబన్లకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది… అయితే, ఆఫ్ఘన్ అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తానే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ కూడా ఆఫ్ఘన్ను వీడారు.. అధ్యక్షుడు లేని సమయంలో నిబంధనల ప్రకారం తానే తాత్కాలిక అధ్యక్షుడిని అని ప్రకటించుకుని పంజ్షీర్ వెళ్లిన ఆయన.. తాలిబన్లపై పోరాటానికి పంజ్షీర్ ప్రజలు, అక్కడి ప్రజలు, ఆప్ఘన్ సైన్యం…
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పరిపాలన మొదలైంది. ఈరోజు నుంచి ఆ దేశంలో తాలిబన్ల పరిపాలన మొదలైంది. అయితే, ఆఫ్ఘనిస్తాన్ మొత్తం వారి ఆధీనంలోకి వెళ్లినప్పటికీ, పంజ్షీర్ ప్రావిన్స్ మాత్రం వారికి దక్కలేదు. ఆ ప్రాంతం కోసం పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. అయితే, తాలిబన్లను పంజ్షీర్ దళాలు ఎదుర్కొంటున్నాయి. పంజ్షీర్ను తమ ఆధీనంలోకి తీసుకున్నామని తాలిబన్లు చెబుతూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. దీనిపై పంజ్షీర్ నేతలు స్పందిచారు. పంజ్షీర్ తమ ఆధీనంలోనే ఉందని, పరిస్థితులు కఠినంగా ఉన్నాయనీ,…
అప్ఘన్లో రోజురోజుకు అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాలిబన్ల దెబ్బకు జడిసిన ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పలాయనం చిత్తగించాడు. దీంతో ఆ దేశంలో తాలిబన్లకు హద్దు అదుపు లేకుండా పోయింది. అక్కడి ప్రజలకు తాలిబన్ల పాలన ఇష్టం లేనప్పటికీ వారికి వారే గత్యంతరంలేని పరిస్థితులు తలెత్తాయి. ఈ పరిస్థితులను ఆసరాగా తీసుకున్న తాలిబన్లు ఆఫ్ఘన్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు. ఈక్రమంలోనే తాలిబన్లు తమ ప్రభుత్వ ఏజెండాను ప్రకటించారు. తమకు సంబంధించి మిత్రులెవరో..…
ప్రపంచం చూపు మొత్తం ఇప్పుడు షంజ్ షీర్ పైనే ఉంది. అప్ఘన్ తాజా మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తాలిబన్లతో పోరాడాలేక దేశం విడిపోడి పారిపోయిన సంగతి తెల్సిందే. ఈక్రమంలోనే అప్ఘన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకొని తామే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాలిబన్ల పాలనను ఒప్పుకునేది లేదంటూ అక్కడి ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసనలు వస్తున్నాయి. ముఖ్యంగా సింహాలగడ్డగా పేరొందిన షంజ్ షీర్ ప్రాంతవాసులు తాలిబన్లతో గట్టిగా పోరాడుతున్నారు. ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా…
కొన్ని వారాలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం కుదురుకోవటం పక్కా. అమెరికా , నాటో దళాలకు చెందిన ఆఖరు సైనికుడూ ఆఫ్గన్ని వీడాడు. ఇక వారికి ఎదురు లేదు. అయితే ఇది అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడే తెలియదు. కానీ మన విషయం చూసుకుంటే కాశ్మీర్లో తాలిబాన్ల ప్రభావం ఉంటుందా అన్నది ప్రశ్న. కశ్మీర్ లోయకు తాలిబాన్లను మళ్లిస్తారా…లేదా అన్నది మరో పెద్ద క్వశ్చన్ మార్క్. ఒక వేళ అదే జరిగితే ఇప్పటికే…
తాలిబన్లు అంటేనే చేతిలో గన్తో దర్శనమిస్తారు.. ఇక, వాళ్లకు కోపం వచ్చినా.. ఆనందం వచ్చినా.. గన్నులనే వాడేస్తారు.. ఆప్ఘన్ను రాజధాని కాబూల్ సహా అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లకు పంజ్షేర్ మాత్రం కొరకరాని కొయ్యగా మారింది.. అక్కడ యుద్ధం ఓవైపు.. చర్చలు మరోవైపు సాగుతున్నాయి.. అయితే, త్వరలోనే ఆఫ్ఘనిస్థాన్లో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోన్న తాలిబన్లు.. పంజ్షేర్ కూడా తమ వశమైందని శుక్రవారం రోజు ఓ ప్రకటన చేశారు.. దీంతో.. తాలిబన్లు అంతా ఆనందోత్సాహాలతో…