పంజ్షీర్లో ఎగిరిన తాలిబన్ల జెండా.. కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దొంగదెబ్బ.. వెన్నుపోటు. పాకిస్థాన్కు వెన్నతో పెట్టిన విద్య. తాలిబన్లతో ఎలాంటి సంబంధం లేదని పైకి చెబుతూనే వాళ్ల తరఫున యుద్ధం చేసేందుకు ఉగ్రవాదులను పంపింది పాక్. పంజ్ షీర్ సింహాలను నేరుగా ఢీకొట్టలేని తాలిబన్లు.. కుట్రలమారి పాకిస్థాన్ అండ తీసుకున్నారు. యుద్ధంలో తామే గెలిచా మని పంజ్ షీర్లో జెండా ఎగరేశారు. పంజ్ షీర్ గవర్నర్ బంగ్లా దగ్గర తాలిబన్ నేతలు ప్రశాంతంగా కనిపిస్తున్నా.. దాని కొండ ప్రాంతంలోని లోయల్లో మాత్రం భీకర యుద్ధం నడుస్తోది. పచ్చటి ప్రకృతి సౌందర్యాలపై రక్తం చిల్లిపడుతోంది. బాంబు దాడుల్లో… తుపాకీ బుల్లెట్ల వర్షంలో మనుషుల దేహాలు ముక్కలైపోతూనే ఉన్నాయి. గడిచిన వారం రోజుల నుంచి తాలిబన్లతో పంజ్ షీర్ యోధులు భీకరంగా పోరాడుతున్నారు.
ప్రపంచ దేశాలు మొండి చేయి ఇవ్వండంతో పంజ్షీర్లోని ఉత్తరాది తిరుగుబాటు దళాలు తాలిబన్లతో పోరాడి అలసిపోతున్నాయి. పద్మవ్యూహం లాంటి పంజ్ షీర్లోకి వెళ్లేందుకు గడిచిన రెండు వారాలుగా తీవ్రంగా ప్రయత్నించిన తాలిబన్లు.. ఎట్టకేలకు చేరుకోగలిగారు. భారీ భారీ బలగాల తోపాటు మందుగుండు సామాగ్రిని వెంట తీసుకెళ్లారు. తాలిబన్ల ఎంట్రీతోనే పంజ్ షీర్లో ఉన్న బలగాలు కొండ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. కొండల్లోని ఉత్తరాది బలగాలు.. కొండ కింది భాగం నుంచి తాలిబన్లు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. పంజ్ షీర్ యోధులు కొండ ప్రాంతంలోకి వెళ్లడంతోనే తాలిబన్ లీడర్లు పంజ్ షీర్లో ప్రత్యక్షమయ్యారు. గవర్నర్ కోటపైన తాలిబన్ల జెండాను ఎగురువేసి పంజ్ షీర్ తమ ఆధీనంలోకి వచ్చిందని ప్రకటించేశారు. ఇటు ఆప్ఘనిస్థాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ఇంటిని బాంబులతో పేల్చేశారు. పంజ్ షీర్ బలగాలకు నాయకుడిగా ఉన్న అహ్మద్ మసౌద్ కూడా ఇప్పుడు కొండ ప్రాంతంలోకి వెళ్లిపోయారు. అయితే, ఓ ఆడియోల రిలీజ్ చేశారు పంజ్షీర్ నేత అహమ్మద్ మస్సౌద్.. 19 నిమిషాల పాటు ఉన్న ఆ సుదీర్ఘ ఆడియోలో.. తాలిబన్లపై దేశమంతా తిరగబడాలని పిలుపునిచ్చారు.. తమ దళాలపై మిలిటెంట్లు దాడి చేశారని, మతపెద్దల సూచనలను కూడా తాలిబన్లు పట్టించుకోలేదన్న ఆయన.. తాలిబన్ల దాడుల్లో తన స్వంత కుటుంబీకులు కూడా మరణించినట్లు తెలిపారు. ఇక, తాలిబన్లకు గుర్తింపు తెచ్చిపెట్టిన ప్రపంచ దేశాలను తప్పుబట్టిన మస్సౌద్.. సైన్యాన్ని, రాజకీయ విశ్వాసాన్ని తాలిబన్లకు కల్పిస్తున్న దేశాలపై మండిపడ్డాడు.. అయితే, పంజ్షీర్లో తమ దళాలు ఇంకా బలంగా ఉన్నాయని, తాలిబన్లతో పోరాడుతూనే ఉన్నాయని స్పష్టం చేశారు.
Also Read
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
- PM Modi: కాశీ-రోమ్ శాశ్వతనగరాలు.. సంబంధాలు కూడా అంతే గొప్పవన్న మోడీ
- Iran Warning: ఇప్పటిదాకా పూర్తి శక్తిని ఉపయోగించలేదు.. ఈసారి వేరే లెవల్లో ఉంటుంది.. ఇరాన్ తాజా వార్నింగ్
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!