ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలన మొదలైంది. అరాచకాలు సృష్టించిన తాలిబన్లు మరోసారి అధికారంలోకి రావడంతో లక్షలాది మంది ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ను వదిలి వెళ్లిపోయారు. 1996 నుంచి 2001 వరకు ఆ దేశంలో తాలిబన్ల పాలన సాగింది. ఆ సమయంలో ఎలాంటి అరాచకాలు జరిగాయో చెప్పాల్సిన అవసరం లేదు. మహిళల హక్కులను కాలరాశారు. షరియా చట్టాల పేరుతో మహిళలను హింసించారు. ఐదేళ్లపాటు హత్యాకాండ సాగింది. అయితే, 20 ఏళ్ల తరువాత మరోసారి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను కైవసం చేసుకోవడంతో మరోసారి ప్రతి…
పిల్లికి చెలగాటం ..ఎలుకకు ప్రాణ సంకటం. ఆఫ్గన్ మహిళల పరిస్థితి అలాగే ఉంది. ముఖ్యంగా మహిళా క్రికెటర్లు. తాలిబాన్లు చంపుతారన్న భయంతో టీమ్ టీమే అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కాబుల్లో తాలిబాన్లు ఇప్పటికే మహిళా క్రికెటర్ల కోసం వేట మొదలుపెట్టారు. క్రికిటర్లే కాదు ఇప్పుడు దేశంలో ఏ క్రీడాకారిణికి రక్షణ లేదు. కాబూల్లో పరిస్థితి దారుణంగా ఉంది. క్రికెట్ జట్టు సభ్యులంతా నిస్సహాయస్థితిలో ఉన్నారు. గత నెల మధ్యలో తాలిబాన్లు కాబూల్ని అక్రమించుకున్నప్పటి నుంచి వారికి క్రీడాకారిణిలు టార్గెట్…
మేమింతే.. మారేదే లేదు.. తాలిబాన్లు కుండ బద్దలు కొట్టారు . ఆఫ్గనిస్తాన్లో షరియా పాలనే సాగుతుందని తేల్చేశారు. అఫ్గానిస్తాన్ ఇకపై అధికారికంగా ‘‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్’’అవుతుంది. తాలిబాన్ల విధానాలు ఎలా వుండబోతున్నాయని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాజా ప్రకటనతో దానికి తెరపడింది. ఇక, ముందు ముందు వాళ్లు ఏం చేస్తారో చూడాల్సివుంది. ఆఫ్గనిస్తాన్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. దాంతో మళ్లీ ఆక్కడ తాలిబాన్ శకం మొదలైనట్టయింది. ఇకపై తాలిబన్ సుప్రీం లీడర్ మౌల్వీ హిబైతుల్లా…
ఆఫ్ఘనిస్థాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు.. ఇక, మహిళలపై క్రమంగా ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు తాలిబన్లు.. తాజాగా అమ్మాయిలు, మహిళలు ఎలాంటి క్రీడలు ఆడకూదంటూ ఆంక్షలు విధించింది తాలిబన్ సర్కార్.. ఆఫ్ఘన్ మహిళలు క్రికెట్ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది.. వారు ఎలాంటి ఆటలు ఆడేందుకు అనుమతి లేదని పేర్కొంది. అమ్మాయిలకు క్రీడలు అవసరం లేదు.. క్రీడలతో బాడీ ఎక్స్పోజింగ్ అవుతుందని వ్యాఖ్యానించారు తాలిబన్ కల్చరల్ కమిషన్ డిప్యూటీ హెడ్…
ప్రపంచానికి హానికరంగా మారిన ఉగ్రవాదులను ఎదురించే దమ్ము అగ్రరాజ్యాలకు సైతం లేదని అప్ఘన్ సంఘటన నిరూపించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ప్రసంగాలతో దంచికొట్టే దేశాలన్నీ ఇప్పుడు ఏం అయ్యాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయుధ సంపత్తిలో మేటిగా ఉన్న చైనా, అమెరికా లాంటి దేశాలు తాలిబన్ లాంటి ఉగ్రవాద సంస్థలకు కొమ్ము కాస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరికీ వారు సొంత ప్రయోజనాలతో తాలిబన్లకు పరోక్షంగా మద్దతు ఇస్తుండటం ప్రస్తుత అప్ఘన్ దుస్థితికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఈ పరిణామాలన్నీ…
దొంగదెబ్బ.. వెన్నుపోటు. పాకిస్థాన్కు వెన్నతో పెట్టిన విద్య. తాలిబన్లతో ఎలాంటి సంబంధం లేదని పైకి చెబుతూనే వాళ్ల తరఫున యుద్ధం చేసేందుకు ఉగ్రవాదులను పంపింది పాక్. పంజ్ షీర్ సింహాలను నేరుగా ఢీకొట్టలేని తాలిబన్లు.. కుట్రలమారి పాకిస్థాన్ అండ తీసుకున్నారు. యుద్ధంలో తామే గెలిచా మని పంజ్ షీర్లో జెండా ఎగరేశారు. పంజ్ షీర్ గవర్నర్ బంగ్లా దగ్గర తాలిబన్ నేతలు ప్రశాంతంగా కనిపిస్తున్నా.. దాని కొండ ప్రాంతంలోని లోయల్లో మాత్రం భీకర యుద్ధం నడుస్తోది. పచ్చటి…
అఫ్గానిస్థాన్ లో చోటు చేసుకుంటున్న తాజా పరిస్థితులను సమీక్షించేందుకు మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించారు. ఆఫ్ఘన్ లో ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబన్లు పూర్తిగా సిద్ధమైపోయారు. ఈ నేపథ్యంలోనే మోడీ ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. గతవారం కూడా భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చే ఆపరేషన్ సందర్భంలోనూ మోడీ సమీక్ష నిర్వహించారు. తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆఫ్ఘనిస్థాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పౌరులపై ఆంక్షలు, విభేదించిన వారిపై కఠిన…
ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ను స్వాధీనం చేసుకున్నా తాలిబన్లకు పంజ్షీర్లో ఇంకా ప్రతిఘటన ఎదురవుతున్నట్టే తెలుస్తోంది.. అయితే, పంజ్షీర్ పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించారు.. తాలిబన్లకు మద్దతుగా పాకిస్థాన్ రంగంలోకి దిగింది.. పాక్ సీహెచ్ -4 డ్రోన్ పంజ్షిర్లో ఒక వాహనంపై రెండు క్షిపణులను ప్రయోగించింది. ప్రతిఘటన ప్రతినిధి ఫహీం దష్టి, మరో ఐదుగురు యోధులు మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి.. ఆదివారం జరిగిన దాడుల్లో అహ్మద్ మసూద్ సన్నిహితుడు, పంజ్షీర్ దళాల చీఫ్ సలేహ్ మొహమ్మద్ దజారీ…
ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం అమలులో ఉన్నది. అయితే, కొన్ని దేశాల్లో మాత్రం నియతృత్వ పాలన, సైనిక పాలన, ఉగ్రవాద పాలన సాగుతున్నది. అస్థిరతకు మారుపేరుగా చెప్పుకునే ఆఫ్రికాలోని అనేక దేశాల్లో స్థానిక ప్రభుత్వాలకు, ఉగ్రవాదులకు మధ్య తీవ్రమైన పోరు జరుగుతున్నది. సహజవనరులు ఉన్నప్పటికీ వాటిపై ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో సామాన్యప్రజలు సమిధులౌవుతున్నారు. ఆఫ్రికాలోని బుర్కినోఫాసో, ఉగాండా, రువాండా, నైజీరియా, కాంగో, సోమాలియా తదితర దేశాల్లో ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఎప్పుడు ఏ…