ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీరును ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో భర్త మనీష్ గుప్తాను పక్కనే కూర్చోబెట్టుకోవడంపై విమర్శలు గుప్పించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ధ్వజమెత్తారు.
పంజాబ్లో ఓ ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ పఠాన్మజ్రా వీరంగం సృష్టించారు. అత్యాచారం ఆరోపణలపై మంగళవారం ఉదయం కర్నాల్లో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తుండగా ఎమ్మెల్యే, అతని సహాయకులు పోలీసులు కాల్పులు జరిపారు.
దేశ రాజధాని ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. బుధవారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి రహదారులన్నీ చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధికారిక నివాసం దేశ రాజధానిలోని రాజ్ నివాస్ మార్గ్లో కేటాయించబడింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక... ఇన్ని రోజులకు అధికారిక నివాసం కేటాయించబడింది. ప్రస్తుతం సొంత నియోజకవర్గం షాలిమార్ బాగ్లో తన ఇంట్లో నివాసం ఉంటున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి అతిషి నియోజకవర్గమైన కల్కాజీలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. గోవింద్పురి జుగ్గి క్లస్టర్లో ఉన్న 1,200కు పైగా అక్రమ గుడిసెలను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూల్చివేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ఎట్టకేలకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారిక నివాసాన్ని కేటాయించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అనంతరం రేఖా గుప్తాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది.
ఢిల్లీ తరగతి గదుల కుంభకోణం కేసులో మాజీమంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లకు ఏసీబీ సమన్లు జారీ చేసింది. రూ.2,000 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. జూన్ 6న హాజరుకావాలని సత్యేంద్ర జైన్కు, జూన్ 9న హాజరుకావాలని మనీష్ సిసోడియాకు సమన్లలో ఏసీబీ పేర్కొంది.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే తాజాగా మరో ఝలక్ తగిలింది. 13 మంది ఢిల్లీ కౌన్సిలర్లు ఆప్కు రాజీనామా చేశారు. తిరుగుబాటు కౌన్సిలర్లంతా కొత్త పార్టీకి శ్రీకారం చుట్టారు. ముఖేష్ గోయెల్ నాయకత్వంలో ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ పేరు ప్రకటించారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ కాల్పుల విరమణ ప్రకటించాయి. భారత్ కాల్పుల విరమణ ప్రకటించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. కాల్పుల విరమణ నిర్ణయం తీసుకోవడం తమకు ఆశ్చర్యం కలిగించిందని ఆప్ ఆరోపించింది.