Delhi: ఢిల్లీ కొత్త మేయర్గా బీజేపీకి చెందిన రాజా ఇక్బాల్ సింగ్ ఎన్నికయ్యారు. బీజేపీ నాయకుడు తన కాంగ్రెస్ ప్రత్యర్థిపై విజయం సాధించారు. ఇదిలా ఉంటే, ఈ ఎన్నికను బహిష్కరించాలని ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి అరిబా ఖాన్ తన పేరును విత్ డ్రా చేసుకున్న తర్వాత డిప్యూటీ మేయర్గా బీజేపీకి చెందిన జై భగవాన్ యాదవ్ ఎన్నికయ్యారు.
రెండేళ్ల తర్వాత, ఢిల్లీ నగర పీఠం మళ్లీ బీజేపీ వశమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత, తాజాగా మేయర్ ఎన్నికల్లో కూడా కాషాయ రెపరెపలాడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు గానూ బీజేపీ 48 సీట్లను గెలుచుకుంది. ఆప్ కేవలం 22 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడినట్లు అయింది.
Read Also: VBIT: విబీఐటి కళాశాలలో వార్డెన్ వికృత చేష్టలు.. విద్యార్థినుల అసభ్యకర ఫొటోలు తీసి..
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత బలం 238 మంది. కొంత మంది కౌన్సిలర్ల ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికైన తర్వాత 12 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 2022 నుంచి చూస్తే బీజేపీ బలం 104 నుంచి 117కి కౌన్సిలర్లకు పెరిగింది. ఆప్ బలం 134 నుంచి 113కి తగ్గింది.
మేయర్ ఎన్నిక కోసం ఎలక్టోరల్ కాలేజీలో ఈ 238 మంది కౌన్సిలర్లు, 10 మంది ఎంపీలు (లోక్సభ నుండి ఏడుగురు మరియు రాజ్యసభ నుండి ముగ్గురు),14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు – వీరిలో బీజేపీ నుండి 11 మంది, ఆప్ నుండి 3 మందిని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా నామినేట్ చేశారు.