Delhi Classroom Scam: సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియాలకు ఏసీబీ సమన్లు
- సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియాలకు ఏసీబీ సమన్లు
- ఢిల్లీ తరగతి గదుల కుంభకోణం కేసులో నోటీసులు
ఢిల్లీ తరగతి గదుల కుంభకోణం కేసులో మాజీమంత్రులు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లకు ఏసీబీ సమన్లు జారీ చేసింది. రూ.2,000 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. జూన్ 6న హాజరుకావాలని సత్యేంద్ర జైన్కు, జూన్ 9న హాజరుకావాలని మనీష్ సిసోడియాకు సమన్లలో ఏసీబీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Meghalaya: టూరిస్ట్ రాజాది హత్యగా తేల్చిన పోలీసులు.. భార్య సోనమ్ ఆచూకీ కోసం గాలింపు
Also Read
ఈ ప్రాజెక్ట్ను అప్పటి ఆప్ ప్రభుత్వం 34 మంది కాంట్రాక్టర్లకు అప్పగించింది. వీరిలో ఎక్కువ మంది ఆప్తో అనుబంధంగా ఉన్నవారే ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ అధికార ప్రతినిధి హరీష్ ఖురానా, బీజేపీ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా, బీజేపీ మీడియా రిలేషన్స్ విభాగం నుంచి నీలకాంత్ బక్షి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఏసీబీ ఈ చర్య తీసుకుంది. సెమీ-పర్మనెంట్ తరగతి గదుల నిర్మాణంలో ఖర్చులు పెరగడం, అవకతవకలు జరిగాయని ఫిర్యాదులో ఆరోపించారు. రూ.2,000 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: IPL 2025 Awards: ఐపీఎల్ విజేత ప్రైజ్మనీ ఎంతో తెలుసా.. అవార్డ్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు ఒక అంచనా. ప్రాజెక్ట్ చేపట్టాక తరగతి గది నిర్మాణం అమాంతంగా పెరిగిపోయింది. మార్కెట్ రేటు కంటే అదనంగా పెరిగిపోయినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రూ.2,892 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 12,748 తరగతి గదులను నిర్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టెండర్ల ప్రకారం ఒక్కో తరగతి గదికి రూ.24.86 లక్షలు ఖర్చయింది. ఇది అంచనా వేసిన మార్కెట్ రేటు రూ.5 లక్షల కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ అయినట్లుగా ఆరోపించింది. ఈ ప్రాజెక్టును 34 మంది కాంట్రాక్టర్లకు అప్పగించారని, వీరిలో ఎక్కువ మంది ఆప్తో ముడిపడి ఉన్నారని చౌహాన్ తెలిపారు.
2015-16 సమావేశాల్లో ఖర్చు ఫైనాన్స్ కమిటీ (EFC) ఈ ప్రాజెక్టును కఠినమైన షరతుతో ఆమోదించిందని ఏసీబీ చీఫ్ మధుర్ వర్మ మీడియాకు తెలిపారు. జూన్ 2016 నాటికి మంజూరు చేయబడిన ఖర్చులోనే దీనిని పూర్తి చేయాలని.. భవిష్యత్తులో ఎటువంటి పెరుగుదలకు అవకాశం లేదన్నారు. అయితే దర్యాప్తులో ఆర్థిక ప్రణాళిక ఉల్లంఘన జరిగినట్లు తెలిసిందన్నారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని.. ఆప్ నాయకులు త్వరలో హాజరుకానున్న తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.
తాజావార్తలు
-
FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
-
Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
-
Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
-
Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
-
Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!