Common Wealth Games 2022: భారత్కు మరో స్వర్ణం.. ఫైనల్లో అదరగొట్టిన పీవీ సింధు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Common Wealth Games 2022: కామన్వెల్త్ క్రీడలు చివరి దశకు చేరుకున్నాయి. ఇవాళ్టితో ఆ క్రీడలు ముగియనుండగా.. భారత క్రీడాకారులు మాత్రం అదరగొడుతున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణం సాధించింది. కెనడాకు చెందిన మిచెల్ లీతో మహిళల సింగిల్స్లో గోల్డ్ మెడల్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. దీనితో పీవీ సింధు తన కెరీర్లో మొట్టమొదటి కామన్వెల్త్ మహిళల సింగిల్స్ స్వర్ణాన్ని అందుకుంది. ప్రత్యర్థి గట్టిగా పోటీ ఇచ్చినప్పటికీ.. సింధు మ్యాచ్లో ఆధిపత్యం ప్రదర్శించింది. మిచెల్ లీపై 21-15, 21-13 తేడాతో వరుసగా రెండు గేమ్లలో విజయం సాధించి ఫైనల్లో బంగారు పతకాన్ని పీవీ సింధు కైవసం చేసుకుంది.
పీవీ సింధుకు మ్యాచ్ ప్రారంభంలోనే శుభారంభం లభించింది. తొలి గేమ్లో 11-8తో ఆధిక్యంలో నిలిచింది. మిచెల్ లీ తన భారత ప్రత్యర్థికి గొప్ప పోటీని అందించింది. కానీ పీవీ సింధు చెలరేగిపోవడంతో వెనుకపడిపోయింది. ఫలితంగా తొలి గేమ్లో సింధు 21-15తో విజయం సాధించింది. మిచెల్లీ రెండో గేమ్ను చక్కగా ప్రారంభించినా.. కొద్దిసేపటికే సింధు మరోసారి సద్వినియోగం చేసుకుంది. కెనడియన్ తప్పులు చేస్తూనే ఉంది. ప్రతి వైఫల్యంతో సింధు ఆధిక్యాన్ని పెంచుకుంటూ వచ్చింది. రెండో గేమ్ ముగిసే సమయానికి సింధు 11-6తో ఆధిక్యంలో నిలిచింది. బ్యాడ్మింటన్లో భారతదేశానికి మొదటి కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకాన్ని అందించడానికిఆమెకు మరో పది పాయింట్లు అవసరం. అనంతరం సింధుకు గట్టి పోటీ ఇవ్వడంతో రెండో గేమ్లో ఉత్కంఠ నెలకొంది. చివరికి సింధు ఆధిక్యం 13-11కి తగ్గింది. అనంతరం పుంజుకున్న సింధు రెండో గేమ్లో పోరాడి చివరికి 21-13తో విజయం సాధించింది. ఈ విజయంతో ఆమె కామన్వెల్త్ గేమ్స్ 2022లో తన మొట్టమొదటి మహిళల సింగిల్స్ పతకాన్ని, బ్యాడ్మింటన్లో భారత్ మొట్టమొదటి స్వర్ణాన్ని కూడా సాధించినట్లు అయింది.
Also Read
- Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
- BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
- Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
Commonwealth Games 2022: నేటితో ముగియనున్న కామన్వెల్త్ క్రీడలు.. భారత్ షెడ్యూల్ ఇదే..
ఈ పతకంతో భారత ఖాతాలో 56 పతకాలు (19 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలు) ఉన్నాయి. మ్యాచ్ ప్రారంభం నుంచే అందరి దృష్టి పివి సింధుపైనే ఉంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ కూడా స్వర్ణ పతకంపై కన్నేశాడు. పురుషుల డబుల్స్ జోడీ చిరాగ్ శెట్టి, సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి కూడా ఫైనల్ ఆడనున్నారు. సాయంత్రం తర్వాత పురుషుల హాకీ జట్టు బంగారు పతక పోరులో ఆస్ట్రేలియాతో తలపడనుంది. టేబుల్ టెన్నిస్లో, ఆచంట శరత్ కమల్ కూడా పురుషుల సింగిల్స్ ఫైనల్ను ఆడనున్నాడు.
తాజావార్తలు
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
-
Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
-
Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!