Pakistan Name In Indian Jersey: భారత జట్టు జెర్సీలపై పాకిస్థాన్ పేరు..
- రేపటి నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025..
- కొత్త జెర్సీలో సందడి చేసిన టీమిండియా ప్లేయర్స్ రోహిత్, కోహ్లీ, గిల్, షమీ..
- టీమిండియా జెర్సీలపై పాకిస్థాన్ పేరు ఉండటంపై క్రికెట్ అభిమానుల ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Name In Indian Jersey: రేపటి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు రెడీ అవుతుంది. తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో ఈనెల 20వ తేదీన దుబాయ్ వేదికగా పోటీ పడబోతుంది. ఈ నేపథ్యంలో కొత్త జెర్సీలో టీమిండియా ప్లేయర్స్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో తాజాగా పంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్, రిషభ్ పంత్, మహమ్మద్ షమీ తదితరులు నూతన జెర్సీలతో తాము మెగా సమరానికి సిద్ధమంటూ ఫొటోలకు పోజులిచ్చారు.
Read Also: Jacqueline : సినిమాలు లేక స్పెషల్ సాంగ్స్ తో నెట్టుకొస్తున్నహాట్ బ్యూటీ
Also Read
- GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
- Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
- Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
- Team India: ఇండియా-A జట్టులోకి మరో ఆల్రౌండర్ .. హర్ష్ దూబే అవుట్..
ఇక, ఈ జెర్సీలపై టోర్నమెంట్ కి ఆతిథ్యం ఇచ్చే పాకిస్థాన్ ఉంది. అయితే, టీమిండియా జెర్సీలపై పాక్ పేరును తొలగించాలంటూ గతంలో పలువురు క్రికెట్ అభిమానులు డిమాండ్ చేసినప్పటికీ.. బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. టోర్నీ సమయంలో క్రికెట్ బోర్డు, భారత జట్టు.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆదేశాలకు కట్టుబడి ఉంటుందని తేల్చి చెప్పారు. ఆ ఆదేశాలను ఉల్లంఘించాలని మేము అనుకోవడం లేదన్నారు. పేరు తొలగించాలని తమకు ఎలాంటి డిమాండ్ రాలేదన్నారు. టీమిండియా జెర్సీలపై ఉండే ట్రోఫీకి సంబంధించిన లోగోపై తమ దేశం పేరు ఉండేందుకు ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్కు హక్కు ఉందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు.
Read Also: Gold Rates: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి.. మరింత పైపైకి బంగారం ధరలు
కాగా, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తండ్రి మరణించడంతో దుబాయ్ నుంచి స్వదేశానికి పయనమైనట్లు తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఈ నెల 15న దుబాయ్ చేరుకున్న భారత జట్టు బృందంలో మోర్కెల్ కూడా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన పలు ట్రైనింగ్ సెషన్లలోనూ ఆయన పాల్గొన్నారు. అయితే, సోమవారం నాడు మాత్రం ప్రాక్టీస్ సెషన్కు రాలేదు. అనివార్య కారణాలతో మోర్కెల్ జట్టును వీడినట్లు ఆ తర్వాత వార్తలు వచ్చాయి. అతడు ఎప్పుడు తిరిగి వచ్చే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
These pics from today 📸
How good 🤌🏻#TeamIndia | #ChampionsTrophy pic.twitter.com/yM50ArMIj5— BCCI (@BCCI) February 17, 2025
Some Peoples Were Speculating That Pakistan's Name will Not be on India's Jersey?
Where are they Now, What's This?
I'm an Indian, Supporting India. But what's the need of establishing wrong narrative and spreading hate?#INDvsPAK #ChampionsTrophy #ChampionsTrophy2025 #Pakistan pic.twitter.com/N3RqgxqSw5— Unexpected Experts (@UnxpctedExperts) February 18, 2025
తాజావార్తలు
-
New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
-
China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
-
Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!