Ranji Trophy 2026 Final: జమ్మూకాశ్మీర్ సంచలనం.. 67 ఏళ్ల తర్వాత మొదటిసారి రంజీ ట్రోఫీ కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranji Trophy 2026 Final: హుబ్లీ వేదికగా జరిగిన రంజీ ట్రోఫీ 2026 ఫైనల్ పోరులో జమ్మూ అండ్ కాశ్మీర్ జట్టు కర్ణాటకపై చారిత్రాత్మక ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మెగా టోర్నీలో జమ్మూకాశ్మీర్ జట్టు 67 ఏళ్ల తర్వాత మొదటి రంజీ ట్రోఫీ టైటిల్ను కైవసం చేసుకుంది. శుభమ్ పుండిర్ తన సెంచరీతో మొదటి ఇన్నింగ్స్లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఆ తర్వాత ఔకిబ్ నబీ ఐదు వికెట్లు తీయడం J&K 291 పరుగుల ఆధిక్యాన్ని సాధించడంలో సహాయపడింది. ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు జరిగిన ఈ నిర్ణయాత్మక పోరులో జమ్మూకాశ్మీర్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి సత్తా చాటింది. మొదటి ఇన్నింగ్స్లో జే అండ్ కే ఏకంగా 584 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ జట్టులో శుభమ్ పుండిర్ 121 పరుగులతో అద్భుత సెంచరీ బాదగా, యావర్ హసన్ (88), సాహిల్ లోత్రా (72), కెప్టెన్ పరాస్ డోగ్రా (70), కన్హయ్య వాధావన్ (70) అర్ధసెంచరీలతో కీలక పాత్ర పోషించారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లతో రాణించినప్పటికీ, మిగితా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు.
READ ALSO: Tomato Market price: తెలుగు రాష్ట్రాల్లో అమాంతం పడిపోయిన టమాటా ధరలు
Also Read
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక జట్టు జమ్మూకాశ్మీర్ బౌలర్ల ధాటికి తలవంచింది. కేవలం 293 పరుగులకే కర్ణాటక జట్టు కుప్పకూలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 160 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా, ఇతర స్టార్ ఆటగాళ్లు కె.ఎల్. రాహుల్ (13), దేవదత్ పడిక్కల్ (11), కరుణ్ నాయర్ (0) విఫలమయ్యారు. జమ్మూకాశ్మీర్ బౌలర్లలో ఆకిబ్ నబీ 5 వికెట్లతో కర్ణాటక బ్యాటింగ్ వెన్నువిరిచాడు. దీనితో జమ్మూకాశ్మీర్కు 291 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్లో కూడా జమ్మూకాశ్మీర్ నిలకడగా ఆడి 4 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఓపెనర్ ఖమ్రాన్ ఇక్బాల్ 160 పరుగులతో అజేయంగా నిలిచి కర్ణాటక బౌలర్లను విసిగించాడు. మొదటి ఇన్నింగ్స్లో సెంచరీతో జట్టు భారీ స్కోరుకు పునాది వేసిన శుభమ్ పుండిర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. హుబ్లీ మైదానంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ జమ్మూ కాశ్మీర్ క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.
READ ALSO: Israel-Iran War: యూఏఈ, కువైట్, బహ్రైయిన్, జోర్డాన్లపై ఇరాన్ క్షిపణి దాడులు..
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?