Ashutosh Sharma: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు నా గురువుకు అంకితం..
- ఢిల్లీ ఒక వికెట్ తేడాతో లక్నోపై గెలుపు
- అశుతోష్ శర్మ (66 *), విప్రాజ్ నిగమ్ (39) అద్భుత ఇన్నింగ్స్
- తన ఇన్నింగ్స్ను గురువు శిఖర్ ధావన్కు అంకితం చేసిన అశుతోష్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో లక్నో సూపర్జెయింట్స్ను ఓడించింది. 209 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. ఢిల్లీ 65 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే.. అశుతోష్ శర్మ అజేయ ఇన్నింగ్స్తో అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. ఒక దశలో ఢిల్లీ ఓడుతుందని అందరు అనుకున్నారు. కానీ అశుతోష్ శర్మ (66 *), విప్రాజ్ నిగమ్ (39) కలిసి కీలక భాగస్వామ్యాన్ని అందించారు. అశుతోష్ 31 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 66 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
Read Also: Sugarcane Juice: చెరుకు రసం శరీరానికి నిజంగా మంచిదేనా?
Also Read
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
- ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
- T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
ఈ మ్యాచ్ అనంతరం అశుతోష్ తన ఇన్నింగ్స్ను గురువు శిఖర్ ధావన్కు అంకితం చేశాడు. ధావన్ ముందు నుంచే అశుతోష్ టాలెంట్ను గుర్తించి అతనికి ప్రోత్సాహం ఇచ్చారు. అతని మద్దతు కారణంగానే తాను మెరుగైన ఆటగాడిగా ఎదిగానని అశుతోష్ చెప్పుకొచ్చాడు. అశుతోష్ డ్రెస్సింగ్ రూమ్కు చేరుకున్న వెంటనే మరో సర్ప్రైజ్ ఎదురైంది. తన గురువు శిఖర్ ధావన్ వీడియో కాల్ ద్వారా అశుతోష్ను అభినందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ సోషల్ మీడియా పేజీలో ‘లవ్ యూ పాజీ’ అంటూ ఈ వీడియోను షేర్ చేసింది. కాగా.. ధావన్ నుండి వచ్చిన అభినందనతో అశుతోష్కు మరింత ఉత్సాహాన్ని అందించింది.
Read Also: Robinhood: డేవిడ్ వార్నర్ కు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు
కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ విజయంతో ఐపీఎల్ 2025లో తమ గెలుపును మొదలుపెట్టింది. లక్నో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. ఢిల్లీ మిడిలార్డర్, టెయిలెండర్లు అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన థ్రిల్లింగ్ అనుభూతిని అందించింది. అశుతోష్ శర్మ తొలిసారి శిఖర్ ధావన్ను ఐపీఎల్ 2024 ప్రీ-సీజన్ క్యాంప్లో కలిశాడు. వీరిద్దరూ అప్పుడు పంజాబ్ కింగ్స్లో భాగంగా ఉన్నారు. అశుతోష్ టాలెంట్ చూసి ముగ్ధుడైన ధావన్.. అతనికి తన బ్యాట్ను బహుమతిగా ఇచ్చాడు. అశుతోష్ రంజీ ట్రోఫీ అరంగేట్రంలో గుజరాత్పై సెంచరీ చేసిన ఈ బ్యాట్తో ఇది అతనికి చిరస్మరణీయ బహుమతి. దేశవాళీ క్రికెట్లో అశుతోష్ శర్మ రైల్వేస్ తరఫున ఆడుతున్నాడు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..