Ashutosh Sharma: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు నా గురువుకు అంకితం..
- ఢిల్లీ ఒక వికెట్ తేడాతో లక్నోపై గెలుపు
- అశుతోష్ శర్మ (66 *), విప్రాజ్ నిగమ్ (39) అద్భుత ఇన్నింగ్స్
- తన ఇన్నింగ్స్ను గురువు శిఖర్ ధావన్కు అంకితం చేసిన అశుతోష్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో లక్నో సూపర్జెయింట్స్ను ఓడించింది. 209 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. ఢిల్లీ 65 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే.. అశుతోష్ శర్మ అజేయ ఇన్నింగ్స్తో అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. ఒక దశలో ఢిల్లీ ఓడుతుందని అందరు అనుకున్నారు. కానీ అశుతోష్ శర్మ (66 *), విప్రాజ్ నిగమ్ (39) కలిసి కీలక భాగస్వామ్యాన్ని అందించారు. అశుతోష్ 31 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 66 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
Read Also: Sugarcane Juice: చెరుకు రసం శరీరానికి నిజంగా మంచిదేనా?
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
- RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
- Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్కు సూర్యకుమార్ యాదవ్ గుడ్బై?.. ఇదే ప్రూఫ్!
ఈ మ్యాచ్ అనంతరం అశుతోష్ తన ఇన్నింగ్స్ను గురువు శిఖర్ ధావన్కు అంకితం చేశాడు. ధావన్ ముందు నుంచే అశుతోష్ టాలెంట్ను గుర్తించి అతనికి ప్రోత్సాహం ఇచ్చారు. అతని మద్దతు కారణంగానే తాను మెరుగైన ఆటగాడిగా ఎదిగానని అశుతోష్ చెప్పుకొచ్చాడు. అశుతోష్ డ్రెస్సింగ్ రూమ్కు చేరుకున్న వెంటనే మరో సర్ప్రైజ్ ఎదురైంది. తన గురువు శిఖర్ ధావన్ వీడియో కాల్ ద్వారా అశుతోష్ను అభినందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ సోషల్ మీడియా పేజీలో ‘లవ్ యూ పాజీ’ అంటూ ఈ వీడియోను షేర్ చేసింది. కాగా.. ధావన్ నుండి వచ్చిన అభినందనతో అశుతోష్కు మరింత ఉత్సాహాన్ని అందించింది.
Read Also: Robinhood: డేవిడ్ వార్నర్ కు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు
కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ విజయంతో ఐపీఎల్ 2025లో తమ గెలుపును మొదలుపెట్టింది. లక్నో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. ఢిల్లీ మిడిలార్డర్, టెయిలెండర్లు అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన థ్రిల్లింగ్ అనుభూతిని అందించింది. అశుతోష్ శర్మ తొలిసారి శిఖర్ ధావన్ను ఐపీఎల్ 2024 ప్రీ-సీజన్ క్యాంప్లో కలిశాడు. వీరిద్దరూ అప్పుడు పంజాబ్ కింగ్స్లో భాగంగా ఉన్నారు. అశుతోష్ టాలెంట్ చూసి ముగ్ధుడైన ధావన్.. అతనికి తన బ్యాట్ను బహుమతిగా ఇచ్చాడు. అశుతోష్ రంజీ ట్రోఫీ అరంగేట్రంలో గుజరాత్పై సెంచరీ చేసిన ఈ బ్యాట్తో ఇది అతనికి చిరస్మరణీయ బహుమతి. దేశవాళీ క్రికెట్లో అశుతోష్ శర్మ రైల్వేస్ తరఫున ఆడుతున్నాడు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!