Ashutosh Sharma: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు నా గురువుకు అంకితం..
- ఢిల్లీ ఒక వికెట్ తేడాతో లక్నోపై గెలుపు
- అశుతోష్ శర్మ (66 *), విప్రాజ్ నిగమ్ (39) అద్భుత ఇన్నింగ్స్
- తన ఇన్నింగ్స్ను గురువు శిఖర్ ధావన్కు అంకితం చేసిన అశుతోష్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో లక్నో సూపర్జెయింట్స్ను ఓడించింది. 209 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. ఢిల్లీ 65 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే.. అశుతోష్ శర్మ అజేయ ఇన్నింగ్స్తో అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. ఒక దశలో ఢిల్లీ ఓడుతుందని అందరు అనుకున్నారు. కానీ అశుతోష్ శర్మ (66 *), విప్రాజ్ నిగమ్ (39) కలిసి కీలక భాగస్వామ్యాన్ని అందించారు. అశుతోష్ 31 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 66 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
Read Also: Sugarcane Juice: చెరుకు రసం శరీరానికి నిజంగా మంచిదేనా?
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
ఈ మ్యాచ్ అనంతరం అశుతోష్ తన ఇన్నింగ్స్ను గురువు శిఖర్ ధావన్కు అంకితం చేశాడు. ధావన్ ముందు నుంచే అశుతోష్ టాలెంట్ను గుర్తించి అతనికి ప్రోత్సాహం ఇచ్చారు. అతని మద్దతు కారణంగానే తాను మెరుగైన ఆటగాడిగా ఎదిగానని అశుతోష్ చెప్పుకొచ్చాడు. అశుతోష్ డ్రెస్సింగ్ రూమ్కు చేరుకున్న వెంటనే మరో సర్ప్రైజ్ ఎదురైంది. తన గురువు శిఖర్ ధావన్ వీడియో కాల్ ద్వారా అశుతోష్ను అభినందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ సోషల్ మీడియా పేజీలో ‘లవ్ యూ పాజీ’ అంటూ ఈ వీడియోను షేర్ చేసింది. కాగా.. ధావన్ నుండి వచ్చిన అభినందనతో అశుతోష్కు మరింత ఉత్సాహాన్ని అందించింది.
Read Also: Robinhood: డేవిడ్ వార్నర్ కు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు
కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ విజయంతో ఐపీఎల్ 2025లో తమ గెలుపును మొదలుపెట్టింది. లక్నో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. ఢిల్లీ మిడిలార్డర్, టెయిలెండర్లు అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన థ్రిల్లింగ్ అనుభూతిని అందించింది. అశుతోష్ శర్మ తొలిసారి శిఖర్ ధావన్ను ఐపీఎల్ 2024 ప్రీ-సీజన్ క్యాంప్లో కలిశాడు. వీరిద్దరూ అప్పుడు పంజాబ్ కింగ్స్లో భాగంగా ఉన్నారు. అశుతోష్ టాలెంట్ చూసి ముగ్ధుడైన ధావన్.. అతనికి తన బ్యాట్ను బహుమతిగా ఇచ్చాడు. అశుతోష్ రంజీ ట్రోఫీ అరంగేట్రంలో గుజరాత్పై సెంచరీ చేసిన ఈ బ్యాట్తో ఇది అతనికి చిరస్మరణీయ బహుమతి. దేశవాళీ క్రికెట్లో అశుతోష్ శర్మ రైల్వేస్ తరఫున ఆడుతున్నాడు.
తాజావార్తలు
-
National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
-
LA 2028 Olympics: ఒలింపిక్స్లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
-
Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
-
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
-
Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!