Ind vs Wi : విండీస్ టూర్ లో 10 మ్యాచ్ లకు ప్లాన్ చేస్తున్న టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిడీస్ గడ్డపై ఈ ఏడాది జులై-ఆగస్టులో టీమిండియా పర్యటించబోతోంది. ఈ మేరకు ఇప్పటికే వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం చేసుకున్న భారత్ క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ ).. అదనంగా మరో రెండు టీ20లని కూడా సిరీస్ లో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చ్ 31 నుంచి మే 28 వరకు ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్ లు జరుగనున్నాయి. ఆ తర్వాత జూన్ 7 నుంచి 11 వరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
Also Read : Telangana Congress: కాంగ్రెస్ పార్టీలోకి సంజయ్.. డీఎస్ క్లారిటీ..
Also Read
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత జూన్ నెలలో శ్రీలంక, అఫ్ఘానిస్థాన్ తో వన్డే సిరీస్ లను టీమిండియా ఆడనుంది. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు బీసీసీఐ ప్లాన్ చేసింది. వాస్తవానికి ఇప్పటికే రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు భారత్, వెస్టిండీస్ మధ్య జరిగేలా బీసీసీఐ విండీస్ బోర్డు ఒప్పందం చేసుకున్నాయి. అయితే తాజాగా మరో రెండు టీ20 లని కూడా ఈ సిరీస్ లో యాడ్ చేయాలని బీసీసీ ప్లాన్ చేస్తోంది. వెస్టిండీస్ టూర్ ముగిసిన వెంటనే ఆగస్టులోనే ఐర్లాండ్ పర్యటనకి భారత జట్టు వెళ్లనుంది. అక్కడ మూడు టీ20లని టీమిండియా ఆడనుంది.
Also Read : Parole for Marriage: పెళ్లి కోసం పెరోల్.. వివాహం అయిన 4 గంటలకే మళ్లీ జైలుకి..
అలాగే సెప్టెంబర్ లో పాకిస్థాన్ వేదికగా జరుగనున్న ఆసియా కప్-2023 టోర్నీ ప్రారంభంకానుంది. ఆ టోర్నీలో ఆడేందుకు పాక్ గడ్డపైకి భారత జట్టు వెళ్లాల్సి ఉంది. కానీ.. టీమిండియాను అక్కడికి పంపించేందుకు భారత ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తోంది. దాంతో ఆసియా కప్ లో భారత ఆడే మ్యాచ్ లను మరో దేశంలో ( అటు భారత్, ఇటు పాకిస్థాన్ కాకుండా ) నిర్వహించేందుకు ఏసీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్తాన్ గడ్డ మీద జరిగే ఆసియాకప్ టోర్నీలో భారత్ అడుగుపెట్టకుండానే దుబాయ్ లో ఆడేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!