Virat Kohli: విరాట్ కోహ్లీని భారత జట్టుకి ఎంపిక చేసి.. నా పదవిని కోల్పోయా! మాజీ చీఫ్ సెలెక్టర్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dilip Vengsarkar revealed How He chose Virat Kohli over S Badrinath: ‘విరాట్ కోహ్లీ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరం ఆటగాళ్లలో అత్యుత్తమ క్రికెటర్. 25 వేలకు పైగా రన్స్, 75 సెంచరీలతో ప్రపంచ క్రికెట్ను ఏలుతున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి పేరు కేవలం కోహ్లీకి మాత్రమే సాధ్యం అయింది. ఇప్పటికే ఎన్నో రికార్డ్స బద్దలు కొట్టిన విరాట్.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే ఇలాంటి ఆటగాడి కారణంగా ఒకరి సీటు కిందకే ఎసరొచ్చిందట. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదివినే కోల్పోయాడట. ఆయన మరెవరో కాదు భారత మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్సర్కార్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.
తాజాగా ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిలీప్ వెంగ్సర్కార్ మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ సారథ్యంలో 2008 అండర్ 19 ప్రపంచకప్ భారత్ గెలిచింది. తర్వాత కోహ్లీని భారత్ ఏ తరఫున ఆస్ట్రేలియా పర్యటనకు పంపాము. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నీ జరిగింది. చీఫ్ సెలెక్టర్ పదవిలో ఉన్న నేను ఆ మ్యాచ్లు చూసేందుకు వెళ్లా. బలమైన న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ సెంచరీ (123) చేశాడు. ఆ సమయంలో భారత జట్టులో ఓ ఖాళీ ఉంది. దానికి కోహ్లీ సరైనోడని భావించి.. శ్రీలంక పర్యటన వెళ్లిన భారత వన్డే జట్టులోకి అతడిని తీసుకున్నా’ అని తెలిపారు.
Also Read
- Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
- BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
- Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
Also Read: BCCI Chief Selector: శాలరీ తక్కువని.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవిని వద్దనుకున్న భారత దిగ్గజం!
‘మీ నిర్ణయం మాకు ఓకే కానీ.. చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ ఎన్ శ్రీనివాసన్కు నచ్చదని బీసీసీఐ సెలెక్టర్లు నాతో అన్నారు. తమిళనాడుకు చెందిన ఎస్ బద్రీనాథ్ను శ్రీనివాసన్ ఆడించాలనుకుంటున్నారని తెలిపారు. విరాట్ కోహ్లీ కారణంగా ఎంఎస్ ధోనీ, శ్రీనివాసన్ ఆగ్రహానికి గురవుతారని చెప్పారు. కోచ్ గ్యారీ కిర్స్టన్ కూడా ఒప్పుకోడన్నారు. నేను అవేమి పట్టించుకోఉండా కోహ్లీని ఎంపిక చేశా. కోహ్లీని తీసుకుంటే.. బద్రీనాథ్కు చోటు దక్కదని తెలిసినా ఆ నిర్ణయం తీసుకున్నా. అప్పుడు శ్రీనివాసన్ జట్టు చెన్నైకి బద్రీనాథ్ ఆడుతున్నాడు’ అని దిలీప్ వెంగ్సర్కార్ పేర్కొన్నారు.
‘బద్రీనాథ్ను ఎందుకు తీసుకోలేదు అని మరుసటి రోజు శ్రీనివాసన్ అడిగారు. ఎమర్జింగ్ టూర్లో విరాట్ కోహ్లీ బాగా ఆడాడని చెప్పా. తమిళనాడు తరఫున బద్రీనాథ్ 800 పరుగులు చేశాడని శ్రీనివాసన్ అన్నారు. త్వరలోనే బద్రీనాథ్ కూడా జట్టులోకి వస్తాడని బదులిచ్చా. సచిన్ టెండూల్కర్ గాయంతో దూరం కాగా.. బద్రీనాథ్కు అవకాశం దక్కింది. కానీ అతడు విఫలమయ్యాడు. ఈ విషయాలను కృష్ణమాచారి శ్రీకాంత్ ద్వారా అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ శరద్ పవార్ వద్దకు శ్రీనివాసన్ తీసుకెళ్లారు. నేను ఇంటికి వచ్చేసా’ అని వెంగ్సర్కార్ తన కెరీర్ గురించి చెప్పకొచ్చారు.
Also Read: Today Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ పడిపోయిన బంగారం ధర! లేటెస్ట్ రేట్లు ఇవే
తాజావార్తలు
-
Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
-
Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
-
Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!