BCCI Chief Selector: శాలరీ తక్కువని.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవిని వద్దనుకున్న భారత దిగ్గజం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Here is Reason Why Virender Sehwag Won’t Apply For India Chief Selector Post: బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ నాలుగు నెలల కింద రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యల చేయడంతో చీఫ్ సెలక్టర్ పదవి నుంచి బీసీసీఐ అతడిని తప్పించింది. భారత ప్లేయర్స్ పూర్తిస్థాయి ఫిట్నెస్ లేనప్పటికీ ఇంజక్షన్స్ వేసుకుని బరిలోకి దిగుతారని ఓ జాతీయ మీడియా నిర్వహించిన ప్రత్యేక స్టింగ్ ఆపరేషన్లో తెలిపారు. అంతేకాదు సౌరవ్ గంగూలీ-విరాట్ కోహ్లీ వివాదం, జస్ప్రీత్ బుమ్రా గాయంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో బీసీసీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
చేతన్ శర్మ తప్పుకోవడంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ తాత్కాలిక చైర్మన్గా శివ్ సుందర్ దాస్ వ్యవహరిస్తున్నారు. శరత్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా డిప్యూటీలుగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం చీఫ్ సెలక్టర్గా ఎవరిని నియమిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. చీఫ్ సెలక్టర్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే వీరూ ఆ పదవిపై ఆసక్తి చూడడపం లేదట. అందుకు ప్రధాన కారణం శాలరీ. ఈ కారణం చేతనే మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా చీఫ్ సెలక్టర్ పదవిపై ఆసక్తిగా లేదట. ఈ మేరకు ఓ బీసీసీఐ అధికారి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.
Also Read
- India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్గా జట్టు పగ్గాలు.!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
Also Read: IND vs WI: శుభ్మన్ గిల్కు షాక్.. సీఎస్కే స్టార్ ఓపెనర్కు భారత జట్టులో చోటు!
టీమిండియా చీఫ్ సెలక్టర్ పదవి కాలం ఐదేళ్లు. ఈ పదవిలో ఉన్న వ్యక్తికి ఏడాదికి రూ. కోటి జీతం అందుతుంది. సెలక్షన్ కమిటీలోని మిగతా నలుగురు సభ్యులకు 90 లక్షలు ఉంటుందని సమాచారం. అయితే తమకున్ను క్రేజ్ దృష్ట్యా వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ వంటి స్టార్లు ఎండార్స్మెంట్లు, కామెంట్రీ రూపంలో ఇంతకంటే ఎక్కువే సంపాదించే అవకాశం ఉంది. అందులకే భారత జట్టులోని స్టార్లుగా వెలుగొందిన ప్లేయర్స్ ఈ పదవిపై ఆసక్తిగా లేరట.
‘సీఓఏ నియామక సమయంలో వీరేంద్ర సెహ్వాగ్ను హెడ్ కోచ్ పదవికి అప్లై చేయమనే ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ వీరూ పట్టించుకోలేదు. అప్పుడు మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లేకు అవకాశం వచ్చింది. పదవులు ఆర్థికంగానూ మనకు దోహదం చేస్తేనే.. ఎవరైనా ఇంట్రెస్ట్ చూపుతారు. ఆపై నార్త్ జోన్ నుంచి సెలక్టర్గా సెహ్వాగ్ వచ్చే ఛాన్స్ ఉన్నా.. అదీ జరుగలేదు. సెలక్టర్కు 4-5 కోట్ల రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్య కాదు. జీతం తక్కువ అన్న కారణంగానే భారత జట్టు స్టార్ ఆటగాళ్లు సెలక్షన్ కమిటీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పుకోచ్చారు.
Also Read: Today Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ పడిపోయిన బంగారం ధర! లేటెస్ట్ రేట్లు ఇవే
తాజావార్తలు
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!