Champions Trophy: భారత్ ఆడే మ్యాచ్లన్నీ అక్కడే.. నేడే షెడ్యూల్ విడుదల!
- ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో పంతం నెగ్గించుకున్న బీసీసీఐ..
- నేడు ట్రోఫీకి సంబంధించిన ప్రకటనను పీసీబీ చీఫ్ వెల్లడిస్తారని తెలిపిన ఐసీసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో బీసీసీఐ మాటే నెగ్గింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి పట్టుబట్టినట్లుగానే హైబ్రిడ్ మోడల్తో ఛాపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీతో ఈ రోజు (డిసెంబర్ 14) స్వయంగా ప్రకటన వెల్లడించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే, పీసీబీ చీఫ్ ఇవాళ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ కు సంబంధించి ప్రకటన చేస్తారని అంతర్జాతీయ క్రికెట్ మండలి వర్గాలు తెలిపాయి.
Read Also: Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి విజయ్ దేవరకొండ
Also Read
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
- Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
- Shahrukh Khan: చరిత్ర సృష్టించిన 'షారుఖ్' నైట్ రైడర్స్.. సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు!
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
కాగా, ఐసీసీ చైర్మన్ జై షా బ్రిస్బేన్ నుంచి వర్చువల్గా ఈ సమావేశంలో పాల్గొని అధికారికంగా ప్రకటన చేస్తారని సమాచారం. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో నిర్వహించనున్నారు. ఈ ఒక్క టోర్నీయే కాదు.. ఇకపై అన్ని ఐసీసీ టోర్నీలకు చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే మ్యాచ్లు అన్ని కూడా హైబ్రిడ్ మోడల్ లోనే నిర్వహించనున్నారు. అంటే వచ్చే ఏడాది భారత్లో జరిగే ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్లో ఆడేందుకు పాకిస్తాన్ ఇక్కడకు రాదు అన్నమాట. అయితే, భారత్ లాగే పాకిస్థాన్ మ్యాచ్ల్ని కూడా తటస్థ వేదికపై నిర్వహిస్తామని ఇంటర్ నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పేర్కొనింది. అదే విధంగా.. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే పురుషుల టీ20 ప్రపంచకప్ కూడా హైబ్రిడ్ మోడలోనే జరగనుంది.
తాజావార్తలు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!