T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ ఆడుతుందా.? లేదా? అనే విషయంపై పాకిస్తాన్ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తోంది. భద్రతా సాకులు చూపుతూ, అనవసర రాద్ధాంతం చేసిన బంగ్లాదేశ్, ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ వేదికను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని ఐసీసీపై ఒత్తిడి తెచ్చింది.
Ajinkya Rahane: టీ20 వరల్డ్ కప్ వివాదాలు ఇంకా ముగియడం లేదు. భద్రతా కారణాల వల్ల తాము భారత్లో ఆడమని చెప్పిన బంగ్లాదేశ్, చివరకు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక, బంగ్లాదేశ్కు సంఘీభావంగా మేము కూడా టోర్నీని బహిష్కరించే ఆలోచన చేస్తామని చెప్పిన పాకిస్తాన్, ఇంకా టోర్నీ ఆడుతుందా లేదా అనే క్లారిటీ ఇవ్వలేదు.
T20 World Cup Controversy: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ మరోసారి క్రికెట్ను రాజకీయాలతో ముడిపెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లాభాల కోసమే తరచూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న నఖ్వీ, తాజాగా టీ20 వరల్డ్కప్ 2026 నుంచి పాకిస్తాన్ తప్పుకునే అవకాశం ఉందనే సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ ఆడుతుందా.? లేదా.? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు, ఈ విషయంపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(PCB) చీఫ్ మొహ్సీన్ నఖ్వీ సోమవారం భేటీ అయ్యారు.
Pakistan T20 World Cup: టోర్నమెంట్ ఏమైనా, వేదిక ఏదైనా అందులో ఇండియా – పాకిస్థాన్ తలపడుతున్నాయంటే అది హై ఓల్టేజ్ మ్యాచ్ అవుతుంది. క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న T20 ప్రపంచ కప్లో పాకిస్థాన్ ఎంట్రీ ఇస్తుందా లేదా అనే చర్చపై ఈరోజు ముగింపు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్తో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఒక…
T20 World Cup: బంగ్లాదేశ్కు ఐసీసీ(ICC) షాక్ ఇచ్చింది. భద్రతా కారణాలు చూపుతూ భారత్లో టీ20 వరల్డ్ కప్-2026(T20 World Cup 2026) ఆడేందుకు నిరాకరించినందుకు టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్ నుంచి తమ వేదికను శ్రీలంకకు మార్చాలని, లేదంటే టోర్నీలో పాల్గొనమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీసీ) చెప్పింది.
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. పాకిస్థాన్ 191 పరుగుల భారీ తేడాతో ఆ జట్టును ఓడించింది. టీమిండియా టోర్నీలో ఎప్పుడూ ఆధిక్యంలో ఉండటంతో ఈ ఓటమిని భారత్ ఊహించలేదు. ఇదే టోర్నమెంట్లో గ్రూప్ దశ మ్యాచ్లో భారత్ పాకిస్థాన్ను ఓడించింది. ఫైనల్లో టీమ్ ఇండియా రిపీట్ చేయలేకపోయింది. ప్రైజింగ్ వేడుకలో, భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే ఆసియా క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్…
Asia Cup 2025: ఆసియా కప్ 2025 విజేత ట్రోఫీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ట్రోఫీని ఒకటి లేదా రెండు రోజుల్లో ముంబైలోని తన ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నట్లు సమాచారం. ఇలా రాని పక్షంలో నవంబర్ 4న భారత బోర్డు ఈ సమస్యను ICC (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) వద్ద లేవనెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దుబాయ్లో జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను ఐదు వికెట్ల…
భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ట్రోఫీ కాంట్రవర్సరీ రోజురోజుకూ పెరుగుతుందే తప్ప.. సమస్యకు పులిస్టాప్ పడడం లేదు. అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఇటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తగ్గేదేలే అంటుండడంతో సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్, పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీనే. నఖ్వీ నాటకాల కారణంగా ఫైనల్ ముగిసి దాదాపు…
ఆసియా కప్ 2025 ట్రోఫీ కాంట్రవర్సరీపై తెలుగు ఆటగాడు, టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ స్పందించాడు. సెప్టెంబర్ 28న పాకిస్థాన్తో ఫైనల్ అనంతరం తాము గంటసేపు మైదానంలోనే గడిపాము అని, గ్రౌండ్లో ట్రోఫీ ఎక్కడా కనిపించలేదని చెప్పాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ చేతిలో ట్రోఫీ లేదని చెప్పాడు. అందుకే ట్రోఫీ అందుకొన్నట్లుగా తాము క్రియేట్ చేశాం అని తిలక్ తెలిపాడు. ఫైనల్లో భారత్ గెలిచినా.. నఖ్వీ ఇప్పటివరకు ట్రోఫీ…