Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Kaleshwaram Commission 2

Off The Record : కాళేశ్వరం రిపోర్ట్పై బీఆర్ఎస్ నేతల్లో గుబులు..!

Published Date :August 1, 2025 , 8:39 pm
By Gogikar Sai Krishna
Off The Record : కాళేశ్వరం రిపోర్ట్పై బీఆర్ఎస్ నేతల్లో గుబులు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాళేశ్వరంపై పీసీ ఘోష్‌ కమిషన్‌ రిపోర్టుతో బీఆర్ఎస్‌ నేతల్లో టెన్షన్‌ మొదలైందా ? కేబినెట్‌ సమష్టిగా తీసుకున్న నిర్ణయం అని చెబుతున్నా…లోలోపల నేతలు భయపడుతున్నారా ? ప్రాజెక్టును ఎందుకు వేగంగా పూర్తి చేశారో చెప్పేందుకు గులాబీ నేతలు రెడీ అవుతున్నారా ? అధినేత నుంచి కింది స్థాయి నేత వరకు…కాళేశ్వరం రిపోర్టుపై గుబులు పడుతున్నారా ?

తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్‌లో పిల్లర్లు దెబ్బతినడం…సుందిళ్ల బ్యారేజీలో సీపేజ్ సమస్యలు రావడాన్ని కాంగ్రెస్‌ సర్కార్‌ సీరియస్‌గా తీసుకుంది. వీటిపై విచారణకు ప్రభుత్వం…2024 మార్చి 14న పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ఉన్న అధికారులతో పాటు రాజకీయ నాయకులను ఓపెన్ కోర్టులో విచారణ జరిపింది. మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావులను కమిషన్ విచారించింది. విచారణలో వాళ్ళు చెప్పిన అంశాలను అఫిడవిట్ రూపంలో తీసుకుంది. తమకు కావలసిన విషయాలు రాబట్టడానికి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసింది కమిషన్. రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది పీసీ ఘోష్‌ కమిషన్‌. దీంతో బీఆర్ఎస్‌ పార్టీలో టెన్షన్‌ మొదలైంది. కమిషన్ ముందు హాజరైన హరీశ్‌రావుతో పాటు కేసిఆర్…అప్పటి ప్రభుత్వం సమిష్టిగా తీసుకున్న నిర్ణయం ప్రకారమే కాళేశ్వరం నిర్మాణం జరిగిందని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పీసీ కమిషన్‌…ఫీల్డ్‌లోకి వెళ్లి పరిస్థితులను తెలుసుకుంది. దీంతో రిపోర్టులో ఏం రాశారన్నది ఉత్కంఠ రేపుతోంది. కేబినెట్‌ నిర్ణయమే ప్రకారం ప్రాజెక్టు నిర్మించారని చెబుతున్నప్పటికీ…నివేదికలో ఏం రాశారోనని బీఆర్ఎస్‌ నేతలు భయపడుతున్నారట. ప్రస్తుతానికి సీల్డ్ కవర్లో పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందచేసింది కమిషన్. ఆ నివేదికలో అసలు ఏముందనేది ఎవరికి తెలియని పరిస్థితి. ప్రభుత్వ పెద్దలు కంటే బిఆర్ఎస్ నేతల్లో ఆ రిపోర్టుపై గుబులు రేపుతోందట. సీల్డ్ కవర్లో ఇచ్చిన నివేదికలో ఏం చెప్పారు.. కాళేశ్వరం కుంగిన ఘటనలో ఎవరిని బాధ్యులు చేశారు ? అనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. గతంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిషన్లు…విచారణ జరిపిన తర్వాత ఆ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి ? ఎవరి మీద వేటు వేశాయి అనే అంశాలు చర్చించుకుంటున్నారు బిఆర్ఎస్ నేతలు.

Also Read

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
  • Off The Record : తెలంగాణ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్న సొంత కేడర్
  • Off The Record : టీడీపీ అధిష్టానం మీద వత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారా?

కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఎలా ఉన్నా సరే…ప్రాజెక్టుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకోవాలని చూస్తోంది బిఆర్ఎస్. ఆ ప్రాజెక్టు వల్ల జరుగుతున్న లాభాలను ప్రజలకు వివరించాలని ప్లాన్ చేస్తోంది. కమిషన్ ముందు విచారణకు వెళ్లి వచ్చిన హరీశ్‌రావు…కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు ప్రజెంటేషన్ రూపంలోనే సమాధానాలు ఇచ్చారు. నీటి లభ్యత, రైతులకు జరుగుతున్న మేలును వివరించారు. ప్రాజెక్టును అంత తొందరగా ఎందుకు నిర్మించారో…ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకోవాలని పార్టీ భావిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు…ఈ రిపోర్టు బయట పెడితే తమకు ఏమైనా నెగిటివ్ జరిగే ప్రమాదం ఉందా అని బీఆర్ఎస్‌ ఆరా తీస్తోంది. అందుకే రిపోర్టులో ఎలా ఉన్నా ప్రచారం మాత్రం పాజిటివ్ గా చేసుకోవాలని బీఆర్ఎస్‌ ప్లాన్‌ చేసుకుంటోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kaleshwaram commission
  • NTV Telugu
  • off the record
  • pc gosh commission

తాజావార్తలు

  • OnePlus Realme Merger: విలీనం కానున్న వన్‌ప్లస్, రియల్‌మీ..!?

  • Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!

  • Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..

  • West Bengal: బెంగాల్‌లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..

  • Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions