Off The Record: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. కానీ… ఈ ఏడాదిలో గతంలో ఎన్నడూలేని పరిస్థితి కనిపిస్తోందని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు సెక్రటేరియెట్కు వచ్చే విజిటర్స్తో పాటు… సొంత పార్టీ కార్యకర్తలు, సిన్సియర్ అని పేరున్న కొందరు అధికారులు సైతం ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారట. కొంత మంది మంత్రుల దగ్గర పని చేసే ఓఎస్డీలు, పీఎస్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నది వాళ్ళందరి కంప్లయింట్. విచ్చలవిడి వసూళ్ళు, ఎవర్నీ లెక్కచేయకపోవడం, అంతా మా ఇష్టం అన్నట్టుగా వ్యవహరించడం లాంటి రకరకాల అవలక్షణాలతో మంత్రుల పేషీలను భ్రష్టుపట్టిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. సదరు ఓఎస్డీలు, పీఎస్లు కొన్ని సందర్భాల్లో మంత్రులను సైతం పక్కదారి పట్టిస్తున్నారన్న ప్రచారం ఉంది. గవర్నమెంట్కు బాగా ఆదాయం తెచ్చిపెట్టే ఒక ప్రధాన శాఖ గురించి అయితే… అసలు మాట్లాడుకో కూడదన్నట్టుగా ఉందట వ్యవహారం. సదరు మంత్రి గారికి ఒక ప్రైవేట్ అసిస్టెంట్ ఉన్నారట. ఓ హోటల్ కేంద్రంగా ఆయనే సెటిల్ మెంట్స్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Samantha : మాకు సినిమా చూపించడానికి అమ్మ చాలా కష్టపడింది
అన్ని చోట్ల కాకున్నా… ఎక్కడ ఎక్కువ ఆదాయం ఉంటుందో ఆ శాఖల్లో ఈ రకమైన పరిస్థితి ఉందట. భూ లావాదేవీలు కావచ్చు, సెటిల్ మెంట్స్ కావచ్చు… ఏవైనాసరే…. ఈ మంత్రి గారి ప్రైవేట్ సిబ్బంది, ఓఎస్డీ చక్కబెట్టేస్తున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక ఇంకో శాఖలో అయితే…. ఓఎస్డీదే ఇష్టారాజ్యంగా నడుస్తోందని అంటున్నారు. మంత్రికంటే ఎక్కువగా ఆయనే అంతా తానై నడిపించేస్తున్నట్టు సమాచారం. ఆ మంత్రి దగ్గర కీలక శాఖలున్నాయి. అయినాసరే…. మూల విరాట్కు ముసుగు కప్పేసి… ఉత్సవ విగ్రహమే మొత్తం నడిపించేస్తోందని అంటున్నారు. ఇక్కడ పెత్తనం మొత్తం ఓఎస్డీదేనట. ఇదే శాఖలో పని చేయడానికి గతంలో ఒకరికి డూప్లికేట్ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇప్పించిన ఘనత ఈ పేషీ అధికారులది. కొంత మంది మంత్రులు రెప్రెజెంటేషన్ లెటర్స్ కూడా ఇవ్వట్లేదట. అందుకు బదులు వారి ఓఎస్డీలే తమ పేరుతో వివిధ శాఖల అధికారులకు రికమండ్ చేస్తూ లెటర్లు ఇస్తున్నట్టు సమాచారం. దీంతో.. టీడీపీ హయాంలో గతంలో ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఇదేంటోనని మాట్లాడుకుంటున్నాయి అధికార వర్గాలు. కనీసం ఆరేడుగురు మంత్రుల ఓఎస్డీల పరిస్థితి అత్యుత భయంకరంగా ఉందన్నది ఇంటర్నల్ టాక్. ఒక్కో సందర్భంలో వాళ్ళు తమ మంత్రులను కూడా డామినేట్ చేస్తున్నట్టు సమాచారం. అలాంటి వాళ్ళలో ఉత్తరాంధ్ర మంత్రులు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Samantha : మాకు సినిమా చూపించడానికి అమ్మ చాలా కష్టపడింది
ఇక రాయలసీమకు చెందిన ఒక మంత్రి ప్రైవేట్గా మనుషులను పెట్టుకుని మరీ వ్యవహారాలు చక్కబెడుతున్నట్టు సమాచారం. ఆదాయం వచ్చే ఆ శాఖలో రకరకాల మార్గాల్లో సెటిల్మెంట్స్ జరిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. వీటన్నిటికీ మించి కొన్ని సందర్భాల్లో ఒక శాఖ మంత్రి ఇచ్చిన లెటర్ను మరో మంత్రి పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తున్నారట. సీఎం ఎంత చెప్పినా కొంత మంది మంత్రులు మారడం లేదని, కాస్త సాఫ్ట్ మినిస్టర్స్ ఉన్న చోట్ల ఓఎస్డీలు, పీఎస్లదే ఇష్టారాజ్యమైపోయిందని మాట్లాడుకుంటున్నారు ఏపీ సచివాలయంలో. అలా ఇష్టారాజ్యంగా ఉంటున్న అధికారుల లిస్ట్ ప్రభుత్వం దగ్గర ఉందని, వాళ్ళని మారుస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నా… కార్యాచరణ మాత్రం లేదు. మొత్తంగా టీడీపీ హయాంలో ఇలాంటి పరిస్థితులు మాత్రం ఇదే ఫస్ట్ టైం అని చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. ముఖ్యమంత్రి దీనికి ఎలా చెక్ పెడతారో చూడాలి మరి.