Off The Record: కూటమి సర్కార్లో పదవుల చిచ్చు..? బీజేపీ లీడర్స్ రగిలిపోతున్నారా..?
- పదవుల విషయంలో ఏపీ బీజేపీ లీడర్స్ రగిలిపోతున్నారా?..
- ఫైవ్ పర్సంట్ వాటాదారుగా చూడవద్దన్న డిమాండ్..
- కేంద్ర సాయాన్ని, తమ సహకారాన్ని మర్చిపోవద్దని వ్యాఖ్యలు..
- గెలిపించగలం, పడగొట్టగలం అంటూ కామెంట్స్..
- నామినేటెడ్ పదవుల్ని నామ మాత్రంగా ఇస్తున్నారన్న అసంతృప్తి..
- కేంద్ర సంబంధాలను దృష్టిలో ఉంచుకోవాలని విన్నపం..
- వ్యాఖ్యల వెనక వేరే వ్యూహం ఉందా?..
- స్థానిక ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడానికేనా?..
- ఏపీ బీజేపీ ఆలోచనా సరళి మారుతోందన్న విశ్లేషణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఏపీ బీజేపీ వైఖరి మారుతోందా అంటే…. లేటెస్ట్ వాయిస్ వింటుంటే అలాగే అనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరీ ముఖ్యంగా… పదవుల విషయంలో వాళ్లు తీవ్రంగా రగిలిపోతున్నట్టు కనిపిస్తోందని, రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడి పదవీ స్వీకార కార్యక్రమం వేదికగా ఆ అసంతృప్తి బయటపడిందని చెప్పుకుంటున్నారు. ఎంతసేపూ…. తమను ఫైవ్ పర్సంట్ వాటాదారుగానే చూస్తున్నారని, ఆ కోణం మారి ప్రాధాన్యం పెంచాలన్నదే ఏపీ కాషాయ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది. రాష్ట్రంలో బలాబలాలు, వాటాల సంగతి పక్కన పెడితే…. కేంద్రం నుంచి అందుతున్న సాయాన్ని, తమ కేంద్ర పార్టీ పెద్దలు అందిస్తున్న సహకారాన్ని మర్చిపోకూడదంటూ గుర్తు చేస్తున్నారట. ఆ అసహనమే… తాజా మీటింగ్లో బయటపడి ఉండవచ్చంటున్నారు పరిశీలకులు. అసలు మేమే లేకపోతే ఏపీలో కూటమి ఉందా అనడం, మేం గెలిపించగలం, పడగొట్టగలం అంటూ కామెంట్స్ చేయడం చుట్టూనే తాజా చర్చ నడుస్తోంది.
Read Also: Crime: ఆ ప్రాంతంలో అందరూ రౌడీలే.. ఒకరు చిన్న రౌడీ.. మరొకరు పెద్ద రౌడీ
Also Read
పదవుల విషయంలో మాకేంటి అన్న వైఖరే… ఆ అసహనానికి కారణమై ఉండవచ్చంటున్నారు. ఇప్పటి వరకు దశల వారీగా ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో… తమకు తీవ్ర అన్యాయం జరిగినట్టు ఫీలవుతున్నారట ఏపీ బీజేపీ లీడర్స్. ఎంతసేపూ… 5శాతం భాగస్వామిగా చూస్తూ… నామ మాత్రపు పదవులు ఇస్తూ… ఇచ్చేశాంగా అంటున్నారని, మిగతా విషయాలను కూడా పట్టించుకోవాలన్నది వాళ్ల డిమాండ్ అట. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ స్థాయిలో నిధులు, సహకారం అందుతున్నాయంటే… ఇక్కడున్న సంబంధాలే కారణం అని, ఆ విషయాన్ని పట్టించుకోకుండా మీ వాటా ఇంతేనని అమడం కరెక్ట్ కాదన్నది బీజేపీ లీడర్స్ కంప్లయింట్. తొలి విడతలో 47 మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ పదవులు ఇస్తే… అందులో బీజేపీకి రెండు దక్కాయి. సెకండ్ లిస్ట్లో 38ఇస్తే… అందులో కాషాయ పార్టీ వాటా ఒక్కటంటే ఒక్కటే. ఇక ఈసారి ఆ ఒక్కటి కూడా ఉంటుందా, ఉండదా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట ఆ పార్టీ నేతల్లో. తాము కూడా కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నామని, మా కార్యకర్తల్ని అస్సలు పట్టించుకోకపోవడం ఏం ధర్మమని ప్రశ్నిస్తున్నారట కాషాయ నేతలు. దీంతో ఈ వ్యాఖ్యల ద్వారా ఏపీ బీజేపీ నేతలు కూటమి పెద్దన్నను బెదిరిస్తున్నారా? లేక సీరియస్ వ్యాఖ్యల ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో.
Read Also: YS Jagan: వైఎస్ జగన్ను కలిసిన వైద్య విద్యార్థులు.. ఆందోళనకు మద్దతు తెలిపిన మాజీ సీఎం..
తాజాగా పార్టీ వేదిక మీది నుంచి బహిరంగంగా ప్రశ్నించడంతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందట. మరోవైపు ఈ వ్యాఖ్యల ప్రభావం కూటమి కట్టుబాట్ల మీద ఎంతవరకు ఉంటుందన్న చర్చ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో కూటమి సర్కార్లో మా వాటా ఏంటని బీజేపీ నేతలు బహిరంగంగా ప్రశ్నించడం వెనక వేరే వ్యూహం కూడా ఉండి ఉండవచ్చంటున్నారు విశ్లేషకులు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరీ హీనంగా చూడకుండా…. గౌరవప్రదమైన సీట్లు దక్కించుకునే దిశగా ఇలాంటి వత్తిళ్ళు పెంచుతుండవచ్చంటున్నారు. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, సుజనా చౌదరి తో పాటు, ఎంపీలు సి.ఎం.రమేష్, శ్రీనివాసవర్మ చేసిన కామెంట్స్ ప్రభావం గట్టిగానే ఉండవచ్చంటున్నారు. రాష్ట్ర మంత్రి కూటమి విజయం పై మాట్లాడినా, కొత్త అధ్యక్షుడు కూటమి ధర్మాన్ని పాటిస్తామని చెప్పినా… పదవుల విషయమై ఇతర నాయకుల ఆలోచనలో వచ్చిన మార్పును పరిగణనలోకి తీసుకోవాలని, ఇది అంత త్వరగా మాసిపోయేది కాదని అంటున్నారు. మరోవైపు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం కల్పించాలని ఏపీ బీజేపీలో డిమాండ్ పెరుగుతోంది. మొత్తం మీద షేర్ పేరుతో… నామ మాత్రంగా పదవులు ఇచ్చి తొక్కేయకుండా తగిన గుర్తింపు ఇవ్వాలన్నది ఆంధ్రప్రదేశ్ కాషాయ నేతల మనోగతంగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!