Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Myanmar Responsible For Manipur Violence

Manipur Violence: రాకెట్లు డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? .. మణిపూర్ హింసకు మయన్మార్ కారణమా?

Published Date :September 11, 2024 , 5:32 pm
By RAMAKRISHNA KENCHE
  • మణిపూర్ లో రాకెట్లు డ్రోన్లు వాడుతున్న మైతేయ్.. కుకీలు
  • రెండు నెలల తాత్కాలిక శాంతి తర్వాత అకస్మాత్తుగా ఈ దాడులు
  • అత్యాధునిక ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై ఆందోళన
  • మణిపూర్ హింసకు మయన్మార్ కారణమా?
Manipur Violence: రాకెట్లు డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? .. మణిపూర్ హింసకు మయన్మార్ కారణమా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మణిపూర్ హింసలో ఉపయోగించిన బాంబులు, తుపాకుల స్థానంలో ఇప్పుడు రాకెట్లు, డ్రోన్‌లు వచ్చాయి. రెండు నెలల తాత్కాలిక శాంతి తర్వాత అకస్మాత్తుగా ఈ దాడులు మొదలయ్యాయి. ఇది భద్రతా బలగాలతో పాటు కేంద్ర ఏజెన్సీలకు పెద్ద ప్రశ్నగా మారింది. మణిపూర్‌కు అత్యాధునిక ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై దర్యాప్తు సంస్థలు సమాధానాలు వెతికే పనిలో నిమగ్నమయ్యాయి. ఏడాదికిపైగా రెండు వర్గాల మధ్య హింసతో పోరాడుతున్న మణిపూర్ మళ్లీ ఉడికిపోతోంది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఇప్పటివరకు 9 మందికి పైగా మరణించారు. ఈ హింస మైతేయ్, కుకీ కమ్యూనిటీల మధ్య జరుగుతోంది. మెయిటీ కమ్యూనిటీకి గిరిజన హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు నిర్ణయానికి నిరసనగా ఈ హింస మొదలైంది. దీనికి నిరసనగా ఘర్షణలు జరిగాయి. అది సాయుధ పోరాటంగా మారింది. ఈ హింస మణిపూర్‌ని తగులబెడుతోంది. ఇప్పుడు నిరసనలు కాస్త.. రాకెట్, డ్రోన్ దాడుల వరకు చేరుకుంది.

READ MORE: Gambling: జూదంలో భార్యని పణంగా పెట్టిన భర్త.. స్నేహితుల లైంగిక వేధింపులు..

Also Read

  • Gayapadda Simham Exclusive: హ్యాపెనింగ్ హీరో ఎక్స్టెండెడ్ క్యామియో.. మరో సర్ప్రైజ్ కూడా!
  • Titanic-The Untold Story: చరిత్ర మరిచిన త్యాగం..! ఆమె మరణించింది..వాళ్లు బతికారు..! ఆ రోజు ఏం జరిగింది?
  • Tamanna Simhadri: తల్లి కాబోతున్న ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి: అసలు కుదురుతుందా?
  • 1857 UNTOLD STORY: చరిత్ర దాచిన పేరు..దళితుడు అని నీళ్లు కూడా ఇవ్వలేదు.. సీన్‌ కట్ చేస్తే బ్రిటీషర్లపై యుద్ధం!

సెప్టెంబర్‌లో హింస ఎలా చెలరేగింది?
సెప్టెంబర్ 2న మణిపూర్‌లో మళ్లీ హింస మొదలైంది. ఇంఫాల్ వెస్ట్‌లో బాంబు పేలుడులో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఇందులో తొలిసారిగా డ్రోన్ల వినియోగం కనిపించింది. ఇంతకుముందు, డ్రోన్‌లను భద్రతా దళాలు నిఘా కోసం మాత్రమే ఉపయోగించాయి. డ్రోన్ల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి సెప్టెంబర్ 13న తన నివేదికను సమర్పించనుంది. డీజీపీ నివేదిక ప్రకారం.. సహాయం కోసం కొంతమంది నిపుణులను కూడా నియమించారు. డ్రోన్ దాడిని ఎదుర్కోవడానికి సన్నాహాలు కూడా చేశారు. 6వ తేదీన విష్ణుపూర్‌లోని మణిపూర్‌ మాజీ సీఎం ఇంటిపై రాకెట్‌ దాడి జరగ్గా, దానికి కూకీ వర్గీయులే కారణమన్నారు. ఈ దాడిలో ఒకరు గాయపడ్డారు. దీని తరువాత.. సెప్టెంబర్ 7 న, జిరిబామ్‌లో జరిగిన హింసలో మైతేయ్, కుకీ వర్గాలకు చెందిన 6 మంది ప్రాణాలు కోల్పోయారు. దీని తరువాత, సెప్టెంబర్ 8 న, ఇంఫాల్ వెస్ట్‌లో మాజీ సైనికుడిని చంపేశారు. సెప్టెంబరు 8న, కాన్ కోప్టిలో సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి జరిగింది. ఈదాడిలో ఒకరు మరణించారు. దీని తర్వాత.. మణిపూర్‌లోని మైతేయ్ కమ్యూనిటీకి చెందిన ప్రజలు వేర్వేరు ర్యాలీలు చేపట్టారు.

READ MORE:Andhra Pradesh: వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

మణిపూర్ హింసలో మయన్మార్ ప్రమేయం ఉందా?
మణిపూర్ హింస వెనుక మయన్మార్ హస్తం ఉందా అనే ప్రశ్న నిరంతరం తలెత్తుతోంది. వాస్తవానికి.. మయన్మార్ -మణిపూర్ మధ్య దాదాపు ఒకటిన్నర వేల కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు నుంచి ప్రతిరోజూ భారత్ వైపు మిలిటెంట్ కార్యకలాపాలు జరుగుతుంటాయి. మణిపూర్‌లో హింసను ప్రేరేపించి ఇక్కడ ఆయుధాలు సరఫరా చేసే మయన్మార్‌కు చెందిన అనేక ఉగ్రవాద గ్రూపులు ఉన్నాయి. మణిపూర్‌ను భారత్ నుంచి వేరు చేయాలనేది ఈ ఉగ్రవాదుల ప్లాన్ అని భావిస్తున్నారు. ఈ విషయం బహిరంగం రహస్యం. ఈ హింస వెనుక బంగ్లాదేశ్‌కు చెందిన కొన్ని తీవ్రవాద సంస్థల హస్తం కూడా ఉందని భావిస్తున్నారు.

READ MORE: Uttar Pradesh: యూపీలో 513 మదర్సాల గుర్తింపు రద్దు..

మయన్మార్‌లో భారత్ సర్జికల్ స్ట్రైక్..
భారత్‌లో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదులు, తీవ్రవాద సంస్థలు భారత్‌లో నీచ కార్యకలాపాలకు పాల్పడి మయన్మార్‌లో తలదాచుకుంటున్నాయి. 2015లో భారత కమాండో బృందం మయన్మార్‌లోకి ప్రవేశించి భారీ సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఈ ఆపరేషన్‌లో 70 మంది ఆర్మీ సిబ్బంది మయన్మార్ అడవుల్లోకి వెళ్లి కేవలం 40 నిమిషాల వ్యవధిలో 38 మందికి పైగా నాగా ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. భారత సైనికులపై జరిగిన దాడిలో 18 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన తర్వాత ఈ సర్జికల్ స్ట్రైక్ జరిగింది. ఆ తర్వాతే మణిపూర్ మీదుగా మయన్మార్‌లోకి ప్రవేశించిన భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసింది.

READ MORE:Apple: ప్రతి ఆపిల్ ప్రోడక్ట్ ఫొటోల్లో 9:41 ఏఎమ్ సమయం.. దీని వెనుక అసలు కథ ఏంటి?

మయన్మార్ నుంచి డ్రోన్లు, రాకెట్లు వస్తున్నాయా?
మణిపూర్‌కు మయన్మార్ నుంచి ఆయుధ సరఫరాకు సుదీర్ఘ చరిత్ర ఉంది. గత సంవత్సరం, మయన్మార్ నుంచి మైతేయ్, కుకీ వర్గాలకు కూడా పెద్ద సంఖ్యలో ఆయుధాలు సరఫరా చేయబడ్డాయని అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. మణిపూర్‌లో హింసను ప్రేరేపించేందుకు మయన్మార్‌, బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాదులు మందుగుండు సామగ్రి, ఆయుధాలను సరఫరా చేస్తున్నారని గత ఏడాది అక్టోబర్‌ 1న జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఏ) వెల్లడించింది. మయన్మార్, బంగ్లాదేశ్‌లోని మిలిటెంట్ గ్రూపులు మణిపూర్ జాతి సమూహాల మధ్య చీలికను సృష్టించడం ద్వారా భారతదేశానికి వ్యతిరేకంగా ప్రాక్సీ యుద్ధం చేయాలని భావిస్తున్నట్లు దర్యాప్తు నివేదికలో పేర్కొంది.

READ MORE: Actor Jeeva: తమిళ హీరో జీవాకు ప్రమాదం.. ఇప్పుడు ఎలా ఉందంటే..

పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం .. 
భద్రతా బలగాలు కూడా నిరంతరాయంగా దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో, కాంగ్‌పోక్పి జిల్లాలో అనేక 12 అంగుళాల సింగిల్ బోర్ రైఫిల్స్, మోర్టార్లు, మోర్టార్ బారెల్స్, జిలాటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, రాకెట్లు, ఐదు రేడియో సెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇది కాకుండా,.. కాస్టింగ్ జిల్లా నుంచి ఎస్ఎల్ఆర్ రైఫిల్, 9 ఎంఎం సబ్ మిషన్ గన్, మోర్టార్, బాంబ్ పారా, ఇన్ఫ్సాన్ నుంచి డిటోనేటర్, ఏకే 47 గన్, సీఎమ్జీ కార్బైన్, స్నిపర్, హ్యాండ్ గ్రెనేడ్, పలు రైఫిల్‌లను విష్ణుపూర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. మణిపూర్‌లో జరుగుతున్న హింస వెనుక విదేశీ హస్తం ఉందనే విషయాన్ని ఖచ్చితంగా సూచించే అనేక ఆయుధాలు వీటిలో ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bangladesh
  • Cookie
  • LATEST TELUGU NEWS
  • Manipur
  • Manipur Violence

తాజావార్తలు

  • Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?

  • యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..

  • Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..

  • Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..

  • Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions