Gambling: జూదంలో భార్యని పణంగా పెట్టిన భర్త.. స్నేహితుల లైంగిక వేధింపులు..
- జూదంలో భార్యని పణంగా పెట్టిన భర్త..
- లైంగిక వేధింపులకు స్నేహితులకు అనుమతి..
- యూపీలో దారుణ ఘటన..
- భర్త.. అతడి స్నేహితుల్ని శిక్షించాలన్న బాధితురాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gambling: జూదానికి బానిసైన ఓ వ్యక్తి ఏకంగా తన భార్యనే పణంగా పెట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. వ్యక్తి తన స్నేహితులతో జూదం ఆడుతూ భార్యతో పాటు ముగ్గురు చిన్న పిల్లల్ని కూడా పందెంకాశాడు. ఆమె పట్ల దారుణంగా వ్యవహరించాడు. భార్యపై స్నేహితులు లైంగిక వేధింపులకు అనుమతినిచ్చాడు. ఆమె తన తల్లి ఇంటికి వెళ్లి రావడానికి నిరాకరించడంతో సదరు వ్యక్తి, ఆమెని కొట్టడమే కాకుండా వేలు విరిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Kejriwal: లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..!
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
యూపీ రాంపూర్లోని షహబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న మహిళకి 2013లో నిందితుడితో వివాహం జరిగింది. ఈ ఘటన తర్వాత బాధిత మహిళ తన వేధింపుల గురించి చెప్పింది. తన అత్త, భర్త కట్నం కోసం వేధించేవారని, భర్త మద్యం, జూదానికి బానిసయ్యాడని సుమారు 7 ఎకరాల భూమిని పోగొట్టుకున్నట్లు చెప్పింది. అతని స్నేహితుల వద్ద తనను కూడా పణంగా పెట్టాడని చెప్పింది. ఈ వేధింపులు భరించలేదక 112 మహిళా హెల్ప్లైన్కి ఫోన్ చేశానని, పోలీసులు రావడంతో పారిపోయాడని చెప్పింది.
తనను లైంగికంగా వేధించడానికి కూడా తన భర్త, అతడి స్నేహితులకు అనుమతినిచ్చాడని చెప్పింది. తనకు నీళ్లు ఇవ్వకుండా, స్నేహితుల ముందే కొట్టినట్లు చెప్పింది. తాను తన తల్లి ఇంటికి వెళ్లి సెప్టెంబర్ 04న వచ్చానని, అతని స్నేహితులు, నావేలు విరిచి తనను ఇంటి నుంచి బటయకు లాగేందుకు యత్నించారని చెప్పింది. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, నా భర్త, అతడి స్నేహితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాంపూర్ ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా తెలిపారు. బాధిత మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టులో వెల్లడిస్తానని చెప్పింది.
తాజావార్తలు
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
-
Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!