Andhra Pradesh: వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అధికారుల బృందం పర్యటన
- తమ బాధలను విన్నవించుకున్న బాధితులు
Andhra Pradesh: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అధికారుల బృందం పర్యటించింది. చోడవరంలో దెబ్బతిన్న బొప్పాయి, అరటి, కంద పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. మద్దూరులో కేంద్ర బృందాన్ని కలిసి రైతులకు జరిగిన పంట నష్టాన్ని మాజీ మంత్రి వడ్డే శోభనదీశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, జిల్లా కలెక్టర్ బాలాజీ, ఆర్డీవో రాజు పాల్గొన్నారు.
Read Also: CM Chandrababu: ప్రతి కుటుంబానికి రూ.10 వేలు, హెక్టార్కు రూ.25 వేలు.. సీఎం చంద్రబాబు ప్రకటన
Also Read
బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో రైతులను ఆదుకోవాలని పంట నష్టం అంచనా వేయడం కోసం కేంద్ర బృందం పర్యటిస్తోందని తెలిపారు. వరదల వల్ల చాలా కాలనీల్లో ఇళ్లు కూడా నీట మునిగాయన్నారు. ఇంటిలోని సామాన్లు వారం రోజులు నీళ్లతో నాని పనికిరాకుండా పోయాయని కేంద్ర బృందానికి బాధితులు విన్నవించుకున్నారు. రైతు సమస్యలు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రి కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు పది రోజులు ఇంటికి కూడా వెళ్లకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయడంలో, వారికి ఆహారం అందుతుందా లేదా అని దగ్గరుండి పర్యవేక్షించారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. వరద తగ్గాక ప్రజలను సురక్షితంగా ఇళ్లకు పంపడం ఫైర్ ఇంజన్లతో బురదను శుభ్రం చేయడం అన్ని సమీక్షించి ఇంటికి వెళ్లారన్నారు. కేంద్ర బృందానికి ఇక్కడ జరిగిన నష్టం మొత్తం వివరించడం జరిగిందన్నారు. త్వరలోనే కేంద్రం నుంచి మంచి ప్రకటన వస్తుందని ఆశిస్తున్నామని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!