Uttar Pradesh: యూపీలో 513 మదర్సాల గుర్తింపు రద్దు..
- యూపీలో 513 మదర్సాల గుర్తింపు రద్దు..
- సిఫారసు చేసిన బోర్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్లో యోగి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో నమోదు చేయడంలో విఫలమైన 513 మదర్సాల గుర్తింపుని రద్దు చేయబోగోంది. యూపీలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లేని మదర్సాలపై సర్వేకి ఆదేశించి దాదాపు రెండేళ్ల తర్వాత, ఉత్తర్ ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ మంగళవారం జరిగిన సమావేశంలో 513 మదర్సాల అనుబంధాన్ని తొలగించాలని సిఫారసు చేసింది. వీటిలో చాలా మదర్సాలు బోర్డుకు సంబంధించిన పోర్టల్లో వివరాలను నమోదు చేయడంతో విఫలమయ్యాయి. మిగతావి వివిధ కారణాల వల్ల డిస్-అఫిలియేషన్ని కోరుకుంటున్నాయి.
యూపీ వ్యాప్తంగా దాదాపుగా 25,000 మదర్సాలు ఉన్నాయి. వీటిలో 16500 మదర్సాలు ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్కు అనుబంధంగా ఉన్నాయి. మదర్సా బోర్డు ఛైర్మన్ ఇఫ్తికార్ అహ్మద్ జావేద్ ఈ అంశంపై మాట్లాడారు. ‘‘ మంగళవారం జరిగిన సమావేశంలో మొదటి ప్రతిపాదన 2018 నుంచి 2024 వరకు మార్క్షీట్లను అప్లోడ్ చేయడం. పాత మార్క్ షీట్లను కూడా పోర్టల్లో అప్లోడ్ చేయాలి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కొత్త మదర్సాల అఫిలియేషన్ ఇవ్వడంపై చర్చ జరిగింది. అఫిలియేషన్ కోసం కొత్తగా దరఖాస్తులు పోర్టల్ ద్వారా ఆమోదించబడుతాయి’’ అని అన్నారు.
Also Read
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Read Also: JK Encounter: ఉదంపూర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
వివిధ జిల్లా లనుంచి స్వీకరించిన సుమారు 513 మదర్సాల సరెండర్ మరియు గుర్తింపు రద్దు ప్రతిపాదనల్ని బోర్డు ఆమోదించిన తర్వాత 2016 నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు రిజిస్ట్రార్కి అధికారం ఇవ్వబడింది. వివిధ జిల్లా నుంచి స్వయంగా బోర్డు నుంచి డిస్-అఫిలియేషన్ కోరుతూ దరఖాస్తులు వచ్చాయి. వీటికి కారణాలు తెలుసుకోవడంతో పాటు, నిబంధనల ప్రకారం వాటి రద్దు జరుగుతుంది.
యుపి మదర్సా బోర్డు ప్రతిపాదనపై ముస్లిం మత గురువు మరియు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగి మహాలీ స్పందిస్తూ, “డి-అఫిలియేషన్ అంటే మదర్సాలకు రహదారి ముగింపు అని కాదు. అనేక ఇతర మదర్సాల మాదిరిగా సొసైటీ లేదా ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్థను కొనసాగించే అవకాశం వారికి ఇప్పటికీ ఉంటుంది. అలాగే, వారు ఇతర బోర్డులు లేదా నద్వతుల్ ఉలమా వంటి సంస్థల నుండి అఫిలియేషన్ తీసుకోవచ్చు.’’ అని చెప్పారు.
- Tags
- UP news
- Uttar Pradesh
తాజావార్తలు
-
Veera Bhadrudu : ‘వీర భద్రుడు’కు అసలు పరీక్ష ఇదే..
-
Axar Patel: మిచెల్ స్టార్క్తో చర్చ.. ఆసక్తికర సమాధానం చెప్పిన అక్షర్ పటేల్!
-
PEDDI Trailer: ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్టింగ్కు టైం ఫిక్స్.. మెగా మాస్ జాతర ఏ టైంకి షురూ అవుతుందో తెలుసా?
-
Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
-
Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..