Uttar Pradesh: యూపీలో 513 మదర్సాల గుర్తింపు రద్దు..
- యూపీలో 513 మదర్సాల గుర్తింపు రద్దు..
- సిఫారసు చేసిన బోర్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్లో యోగి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో నమోదు చేయడంలో విఫలమైన 513 మదర్సాల గుర్తింపుని రద్దు చేయబోగోంది. యూపీలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లేని మదర్సాలపై సర్వేకి ఆదేశించి దాదాపు రెండేళ్ల తర్వాత, ఉత్తర్ ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ మంగళవారం జరిగిన సమావేశంలో 513 మదర్సాల అనుబంధాన్ని తొలగించాలని సిఫారసు చేసింది. వీటిలో చాలా మదర్సాలు బోర్డుకు సంబంధించిన పోర్టల్లో వివరాలను నమోదు చేయడంతో విఫలమయ్యాయి. మిగతావి వివిధ కారణాల వల్ల డిస్-అఫిలియేషన్ని కోరుకుంటున్నాయి.
యూపీ వ్యాప్తంగా దాదాపుగా 25,000 మదర్సాలు ఉన్నాయి. వీటిలో 16500 మదర్సాలు ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్కు అనుబంధంగా ఉన్నాయి. మదర్సా బోర్డు ఛైర్మన్ ఇఫ్తికార్ అహ్మద్ జావేద్ ఈ అంశంపై మాట్లాడారు. ‘‘ మంగళవారం జరిగిన సమావేశంలో మొదటి ప్రతిపాదన 2018 నుంచి 2024 వరకు మార్క్షీట్లను అప్లోడ్ చేయడం. పాత మార్క్ షీట్లను కూడా పోర్టల్లో అప్లోడ్ చేయాలి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కొత్త మదర్సాల అఫిలియేషన్ ఇవ్వడంపై చర్చ జరిగింది. అఫిలియేషన్ కోసం కొత్తగా దరఖాస్తులు పోర్టల్ ద్వారా ఆమోదించబడుతాయి’’ అని అన్నారు.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
Read Also: JK Encounter: ఉదంపూర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
వివిధ జిల్లా లనుంచి స్వీకరించిన సుమారు 513 మదర్సాల సరెండర్ మరియు గుర్తింపు రద్దు ప్రతిపాదనల్ని బోర్డు ఆమోదించిన తర్వాత 2016 నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు రిజిస్ట్రార్కి అధికారం ఇవ్వబడింది. వివిధ జిల్లా నుంచి స్వయంగా బోర్డు నుంచి డిస్-అఫిలియేషన్ కోరుతూ దరఖాస్తులు వచ్చాయి. వీటికి కారణాలు తెలుసుకోవడంతో పాటు, నిబంధనల ప్రకారం వాటి రద్దు జరుగుతుంది.
యుపి మదర్సా బోర్డు ప్రతిపాదనపై ముస్లిం మత గురువు మరియు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగి మహాలీ స్పందిస్తూ, “డి-అఫిలియేషన్ అంటే మదర్సాలకు రహదారి ముగింపు అని కాదు. అనేక ఇతర మదర్సాల మాదిరిగా సొసైటీ లేదా ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్థను కొనసాగించే అవకాశం వారికి ఇప్పటికీ ఉంటుంది. అలాగే, వారు ఇతర బోర్డులు లేదా నద్వతుల్ ఉలమా వంటి సంస్థల నుండి అఫిలియేషన్ తీసుకోవచ్చు.’’ అని చెప్పారు.
- Tags
- UP news
- Uttar Pradesh
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!