Sanjay Singh: “ఉద్యమం కాంగ్రెస్ స్క్రిప్ట్.. దేశద్రోహం కేసు నమోదు చేయాలి”..వినేష్-బజరంగ్ పై రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు ఫైర్
- కాంగ్రెస్లో చేరిన రెజ్లర్లు వినేష్ ఫోగట్..బజరంగ్ పునియా
- స్పందించిన భారత రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు సంజయ్ సింగ్
- ఈ ఉద్యమం కాంగ్రెస్ స్క్రిప్ట్ అని ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెజ్లర్లు వినేష్ ఫోగట్ మరియు బజరంగ్ పునియా కాంగ్రెస్లో చేరారు. వినేష్ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాంగ్రెస్లో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తామన్న ప్రకటన వెలువడిన తర్వాత ఇప్పుడు రగడ కూడా జోరందుకుంది. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద ఆటగాళ్ల ఆందోళనపై భారత రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు సంజయ్ సింగ్ ప్రశ్నలు సంధించారు. ఈ మొత్తం ఉద్యమ స్క్రిప్ట్ కాంగ్రెస్ కార్యాలయంలోనే రచించబడిందన్నారు. భారత రెజ్లింగ్ సురక్షితంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేసినందుకే కాంగ్రెస్ దీన్ని ప్రారంభించిందని సంజయ్ సింగ్ అన్నారు. రెజ్లింగ్కు పెరుగుతున్న ఆదరణ కాంగ్రెస్కు జీర్ణించుకోలేకపోయిందని ఆరోపించారు. అందుకే, కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో కుట్ర పన్నిందన్నారు.
READ MORE: Minister Nimmala Ramanaidu: ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన పడవల వెనుక కుట్ర కోణం..!
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
సంజయ్ సింగ్ ఇంకా మాట్లాడుతూ.. “ఈ ఉద్యమంలో అత్యంత దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. దీపేంద్ర హుడా, భూపేంద్ర హుడా కూతుళ్లను ఉద్యమంలోకి లాగారు. కూతుళ్లను ఉపయోగించడం ఒక ఉద్యమానికి ఊతమిచ్చింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఎలాంటి ఆరోపణ వచ్చినా.. ఆయన ఎలాంటి వాడో భారతదేశ ప్రజలకు అవగాహన ఉంది. అలాంటి వ్యక్తిపై వేధింపుల వంటి ఆరోపణ చేయడం సరికాదు. ఎందుకంటే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రాజకీయ జీవితం కళాశాలలో మహిళల భద్రత సమస్యతో ప్రారంభమైంది. కొంతమంది అమ్మాయిలను రౌడీల నుంచి రక్షించారు. కళాశాల మొత్తం ఆయనను మహిళా సంరక్షకుడిలా చూసింది. ఉద్యమమంతా పక్కా ప్రణాళికతో సాగిందని మొదటి రోజు నుంచి చెబుతున్నాం. ఆ విషయాలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం ఉద్యమం వెనుక దీపేంద్ర, భూపేంద్ర హుడా మరియు కాంగ్రెస్ ఉన్నారు. ఈ రోజు ఇది రుజువు చేయబడింది. ” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE: Donald Trump: “భారత్కి అనుకూలం”.. అమెరికా హిందూ సంస్థ మద్దతు డొనాల్డ్ ట్రంప్కే..
‘ఉద్యమంపై విచారణ జరపాలి’
వినేష్ ఫోగట్ పతకానికి అర్హురాలు కాదని బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ చేసిన ప్రకటనపై.. భారత రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు మాట్లాడారు. “ఈ పతకం ఏ ఒక్కరి చెందినది కాదు. పూర్తి దేశానికి చెందినది. ఆమె పతకానికి అర్హురాలు కాదు. ఒలింపిక్స్లో భారతీయ రెజ్లింగ్ పతకాలు కోల్పోవడానికి వినేష్ ఫోగట్ బాధ్యురాలు. మొత్తం ఉద్యమంపై దర్యాప్తు జరిపి, ఈ ముగ్గురిపై కూడా దేశద్రోహం నేరం కింద విచారణ జరిపించాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే రెజ్లింగ్లో 5 నుంచి 6 పతకాలు వచ్చేవి. వీరి వల్లే ఆ పతకాలు చేజారాయి.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!