Sanjay Singh: “ఉద్యమం కాంగ్రెస్ స్క్రిప్ట్.. దేశద్రోహం కేసు నమోదు చేయాలి”..వినేష్-బజరంగ్ పై రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు ఫైర్
- కాంగ్రెస్లో చేరిన రెజ్లర్లు వినేష్ ఫోగట్..బజరంగ్ పునియా
- స్పందించిన భారత రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు సంజయ్ సింగ్
- ఈ ఉద్యమం కాంగ్రెస్ స్క్రిప్ట్ అని ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెజ్లర్లు వినేష్ ఫోగట్ మరియు బజరంగ్ పునియా కాంగ్రెస్లో చేరారు. వినేష్ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాంగ్రెస్లో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తామన్న ప్రకటన వెలువడిన తర్వాత ఇప్పుడు రగడ కూడా జోరందుకుంది. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద ఆటగాళ్ల ఆందోళనపై భారత రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు సంజయ్ సింగ్ ప్రశ్నలు సంధించారు. ఈ మొత్తం ఉద్యమ స్క్రిప్ట్ కాంగ్రెస్ కార్యాలయంలోనే రచించబడిందన్నారు. భారత రెజ్లింగ్ సురక్షితంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేసినందుకే కాంగ్రెస్ దీన్ని ప్రారంభించిందని సంజయ్ సింగ్ అన్నారు. రెజ్లింగ్కు పెరుగుతున్న ఆదరణ కాంగ్రెస్కు జీర్ణించుకోలేకపోయిందని ఆరోపించారు. అందుకే, కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో కుట్ర పన్నిందన్నారు.
READ MORE: Minister Nimmala Ramanaidu: ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన పడవల వెనుక కుట్ర కోణం..!
Also Read
- Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
సంజయ్ సింగ్ ఇంకా మాట్లాడుతూ.. “ఈ ఉద్యమంలో అత్యంత దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. దీపేంద్ర హుడా, భూపేంద్ర హుడా కూతుళ్లను ఉద్యమంలోకి లాగారు. కూతుళ్లను ఉపయోగించడం ఒక ఉద్యమానికి ఊతమిచ్చింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఎలాంటి ఆరోపణ వచ్చినా.. ఆయన ఎలాంటి వాడో భారతదేశ ప్రజలకు అవగాహన ఉంది. అలాంటి వ్యక్తిపై వేధింపుల వంటి ఆరోపణ చేయడం సరికాదు. ఎందుకంటే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రాజకీయ జీవితం కళాశాలలో మహిళల భద్రత సమస్యతో ప్రారంభమైంది. కొంతమంది అమ్మాయిలను రౌడీల నుంచి రక్షించారు. కళాశాల మొత్తం ఆయనను మహిళా సంరక్షకుడిలా చూసింది. ఉద్యమమంతా పక్కా ప్రణాళికతో సాగిందని మొదటి రోజు నుంచి చెబుతున్నాం. ఆ విషయాలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం ఉద్యమం వెనుక దీపేంద్ర, భూపేంద్ర హుడా మరియు కాంగ్రెస్ ఉన్నారు. ఈ రోజు ఇది రుజువు చేయబడింది. ” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE: Donald Trump: “భారత్కి అనుకూలం”.. అమెరికా హిందూ సంస్థ మద్దతు డొనాల్డ్ ట్రంప్కే..
‘ఉద్యమంపై విచారణ జరపాలి’
వినేష్ ఫోగట్ పతకానికి అర్హురాలు కాదని బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ చేసిన ప్రకటనపై.. భారత రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు మాట్లాడారు. “ఈ పతకం ఏ ఒక్కరి చెందినది కాదు. పూర్తి దేశానికి చెందినది. ఆమె పతకానికి అర్హురాలు కాదు. ఒలింపిక్స్లో భారతీయ రెజ్లింగ్ పతకాలు కోల్పోవడానికి వినేష్ ఫోగట్ బాధ్యురాలు. మొత్తం ఉద్యమంపై దర్యాప్తు జరిపి, ఈ ముగ్గురిపై కూడా దేశద్రోహం నేరం కింద విచారణ జరిపించాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే రెజ్లింగ్లో 5 నుంచి 6 పతకాలు వచ్చేవి. వీరి వల్లే ఆ పతకాలు చేజారాయి.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
-
Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
-
Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
-
Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!