WPL 2025: డిసెంబర్ 15న డబ్ల్యూపీఎల్ వేలం.. వేదిక ఎక్కడంటే?
- డబ్ల్యూపీఎల్ 2025 వేలంకి ముహూర్తం ఖరారు
- ఒక్క బదిలీ మాత్రమే
- గుజరాత్ వద్ద అత్యధిక పర్స్ వాల్యూ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 వేలంకి ముహూర్తం ఖరారైంది. బెంగళూరులో డిసెంబరు 15న మినీ వేలం నిర్వహించనున్నారు. ప్రతి ఫ్రాంచైజీకి రూ.15 కోట్ల బడ్జెట్ కేటాయించారు. గత సీజన్ రూ.13.5 కోట్లు ఉండగా.. ఈసారి 1.5 కోట్లు పెరిగింది. ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేసినందున గుజరాత్ జెయింట్స్ వద్ద అత్యధికంగా రూ.4.4 కోట్లు ఉన్నాయి. ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.3.25 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.2.5 కోట్లు ఉన్నాయి.
ఈసారి వేలంలో హీథర్ నైట్, లీ తహుహు, నాడిన్ డి క్లెర్క్, స్నేహ్ రాణా, డియాండ్ర డాటిన్, లారెన్ బెల్, పూనమ్ యాదవ్, వేద కృష్ణమూర్తి ఉన్నారు. వేలానికి ముందు ఫ్రాంచైజీల మధ్య జరిగే బదిలీల గడువు ముగియగా.. ఒక్క బదిలీ మాత్రమే జరిగింది. యూపీ వారియర్స్ నుంచి ఒక్క డ్యానీ వ్యాట్ (ఇంగ్లండ్)ను ఆర్సీబీ తీసుకుంది.
Also Read
గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ టీమ్స్ డబ్ల్యూపీఎల్ 2025లో తలపడనున్నాయి. గతేడాది ఆర్సీబీ కప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ రన్నరప్గా నిలిచింది. ఐపీఎల్ 2025 ముందు డబ్ల్యూపీఎల్ 2025 జరగనుంది. ఇటీవలే ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
-
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!