CM Chandrababu Tanuku Tour: నేడు తణుకులో సీఎం పర్యటన
- నేడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీఎం పర్యటన..
- స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివ్స కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Tanuku Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించనున్నారు.. తణుకులో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివ్స’ కార్యక్రమంలో పాల్గొంటారు.. ఆ తర్వాత ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం-పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి’ అనే థీమ్తో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులతో సమావేశం కానున్నారు.. మరోవైపు.. నియోజకవర్గానికి చెందిన సుమారు రెండు వేల మంది ప్రజలతో ప్రజా వేదిక నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు… ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు.. అనంతరం నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య శ్రేణులతో భేటీకానున్న సీఎం.. కీలక సూచనలు చేయనున్నారు.. జిల్లా అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు..
Read Also: WPL 2025 Final: నేడే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఫైనల్
Also Read
- CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
- AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
- Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ఇక, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పర్యటన కోసం.. ఉదయం 7.30 గంటలకు ఉండవల్లిలో తన ఇంటి నుంచి హెలికాఫ్టర్లో బయల్దేరి.. ఉదయం 8 గంటలకు తణుకు ఎస్ఎం వీఎం పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకుంటారు సీఎం చంద్రబాబు.. ఉదయం 8.10 నుంచి 8. 20 వరకు జిల్లాలోని నాయకులు, ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతారు. 8.21 నుంచి 8.30 వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలతో సమావేశం అవుతారు. అనంతరం హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 8.35కి పట్టణంలోని ఎన్టీఆర్ పార్కుకు చేరుకుని, 9 గంటల వరకు పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడతారు. 9.05కి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సభాస్థలికి చేరుకుని 10.05 గంటల వరకు ప్రజావేదిక నిర్వహిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 10. 10కి జూబ్లీ రోడ్లోని నూలివారి లేఅవుట్ కి చేరుకుని, 11 గంటల వరకు పార్టీ నాయకులతో, ప్రజాప్రతినిధులతో, 11 నుంచి 12 గంటల వరకు జిల్లా అధికారులతో సమావేశమ వుతారు. ఇక, 12.05కి పాలిటెక్నిక్ కళాశాలలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.10కి హెలికాఫ్టర్లో జిల్లా నుండి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?