UPI New Feature: ‘యూపీఐ’ లో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టబోతున్న ఆర్బిఐ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు పదిమంది సెల్ ఫోన్ ఉపయోగిస్తే అందులో 8 మంది ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. దాంతో ప్రస్తుతం దేశంలో కూడా ఎన్నో సేవలను మొబైల్ ద్వారా క్షణాల్లో చేసుకుంటున్నాము. ఇక డబ్బులు ట్రాన్స్ఫర్ కోసం ఫోన్ పే, గూగుల్ పే, పేటియం లాంటి ఇంకా ఎన్నో యూపీఐ యాప్స్ వినియోగిస్తున్న సంగతి మనకు తెలిసిందే. యూపీఐ సేవలను విస్తృతంగా వాడుతున్న నేపథ్యంలో ప్రజల కోసం ఆర్బిఐ మరికొన్ని కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇందుకు సంబంధించి తాజాగా ఆర్బిఐ మరో కీలక నిర్ణయాన్ని తీసుకువస్తుంది. ఇందులో భాగంగానే యూపీఐ లో కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు ఆర్బిఐ గవర్నర్ శశికాంత్ దాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొన్ని కష్టాలకు చెక్ పదనునట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also read: K. Laxman: రూ.2 లక్షలు రుణమాఫీ ఎందుకు చేయలేదు..? రేవంత్ రెడ్డికి లక్ష్మణ్ ప్రశ్న..
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కస్టమర్లకు కోసం ఎప్పటికప్పుడు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం విధితమే. ఇకపోతే తాజాగా జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగానే కొత్త ఫీచర్ ని తీసుకురాబోతున్నట్లు తెలిపారు. అసలు కొత్త ఫీచర్ ఏంటన్న విషయానికి వస్తే.. డిపాజిట్ సమయంలో మిషన్ లో క్యాష్ డిపాజిట్ చేసేందుకు నేరుగా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు కేవలం యూపీఐ ద్వారా క్యాష్ విత్ డ్రాకు మాత్రమే అవకాశం ఉండగా.. త్వరలో డిపాజిట్ కూడా యూపీఐ ద్వారా సేవలను అందుకోవచ్చు. విత్ డ్రాకు సంబంధించి యూపీఐ విధానం వల్ల మంచి స్పందన రావడంతో ఇప్పుడు ఈ కొత్త ఫీచర్ ని తీసుకురాబోతున్నట్లుగా తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం కేవలం డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే క్యాష్ డిపాజిట్ చేసే అవకాశం ఉండగా ఇక ఈ సేవ వినియోగంలోకి వచ్చాక యూపీఐ ద్వారా కూడా క్యాష్ ను మిషన్లలో డిపాజిట్ చేసుకోవచ్చు.
Also read: Top Headlines @1PM : టాప్ న్యూస్
ఈ కొత్త సేవలకు సంబంధించి అతి త్వరలోనే పూర్తి మార్గదర్శకాలను విడుదల చేస్తామని ఆర్బిఐ గవర్నర్ తెలిపారు. ఈ కొత్త సేవలను తీసుకురావడం ద్వారా కష్టమర్లకు బ్యాంకింగ్ సేవలు పొందడం మరింత సులువుగా అవుతుందని బ్యాంకుల్లో క్యూ లైన్ లలో వేచి ఉండాల్సిన కష్టాలకు చెక్ పాడుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చూడాలి మరి ఈ కొత్త ఆప్షన్ బ్యాంకు కస్టమర్లకు ఎలా ఉపయోగపడుతుంది., ఎలాంటి స్పందన వస్తుంది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!