K. Laxman: రూ.2 లక్షలు రుణమాఫీ ఎందుకు చేయలేదు..? రేవంత్ రెడ్డికి లక్ష్మణ్ ప్రశ్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K. Laxman: రూ.2 లక్షలు రుణమాఫీ ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి అని సీఎంకు ఎంపీ రాజ్యసభ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. సంగారెడ్డి రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి ఉందన్నారు. రైతుల పడుతున్న గోస పై భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందన్నారు. అప్పు చేసి వ్యవసాయం చేస్తున్న రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు బేడీలు వేసి, ఈ రోజు పాతాళానికి చేరిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా రతులకు అలవి కానీ హామీలు ప్రకటించిందన్నారు. సోనియా గాంధీ మాట తప్పదు అని చెప్పారని తెలిపారు. మరి సోనియా గాంధీ ప్రకటించిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు.
Read also: Kishan Reddy: కాంగ్రెస్ హామీల అమలుకు నోట్లు ముద్రించే మిషన్ లు పెడతారేమో..!
Also Read
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
రాజస్తాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల అప్పు తీర్చలేక పోయిందని తెలిపారు. కానీ తెలంగాణా లో కాంగ్రెస్ నీ గెలిపిస్తే రైతు రుణ మాఫీ చేస్తా అని రాహుల్ గాంధీ అన్నాడని అన్నారు. రేవంత్ రెడ్డి నీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి రాహుల్ రాజస్తాన్ వెల్లాడా? అని ప్రశ్నించారు. రాజస్తాన్ లో రైతులు కాంగ్రెస్ కి బుద్ది చెప్పి ఓడించారన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద నరేంద్ర మోది రైతులకు అండగా నిలిచాడన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తెరిపించి రైతులకు సహాయం పడ్డది కూడా నరేంద్ర మోడీ నే అన్నారు. యూరియా, విత్తనాలపై కేంద్రం సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటుందన్నారు. అనవసరమైన ఉచితాలు ప్రకటించకుండా కేంద్రం సబ్సిడీ ఇస్తుందన్నారు. వ్యవసాయం చేసే రైతులకు, కవులు రైతులకు సబ్సిడీ అందించి వారికి న్యాయం చేస్తుంది కేంద్రం అని తెలిపారు.
Read also: Chaari 111: ఓటీటీలో ప్రత్యక్షమైన వెన్నెల కిషోర్ యాక్షన్ కామెడీ మూవీ..!
రైతులను జైలుకు పంపిన పాపానికి కెసిఆర్ ప్రభుత్వం కూలీ పోయిందన్నారు. ఎన్నికల ముందు బ్యాంక్ కు వెళ్లి 2 లక్షల లోన్ తీసుకోండి డిసెంబర్ 9 మాఫీ చేస్తా అని రేవంత్ చెప్పాడన్నారు. ఇప్పటి వరకు 2 లక్షలు రుణ మాఫీ ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి అని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ లను గెలిపిస్తే హామీలు అమలు అవుతాయని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుందన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టే కాంగ్రెస్ మాటలు నమ్మి అధికారాన్ని కల్పించారన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో సొంత ఎమ్మెల్యే లు తిరగబడుతున్నారని తెలిపారు. కర్ణాటకలో తాగు నీరు కూడా అందించలేని పరిస్థితిలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందన్నారు. రేవంత్ రెడ్డి నిన్ను తెలంగాణా ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు.
Read also: Danam Nagender: 10 నిమిషాల్లో 45 వేల టికెట్లు ఎలా అమ్ముడు పోతాయి..?
ఈ రోజు మళ్ళీ తుక్కుగుడలో హామీలు పేరుతో రాజకీయం చేస్తున్నారని తెలిపారు. రైతులు ఏడిస్తే రాష్ట్రానికి మంచిది కాదన్నారు. రైతులు బాగుంటేనే దేశం భాగుంటుంది..రైతులు బాగుంటే ప్రజలు బాగుంటారన్నారు. రైతులకు అండగా బీజేపీ పార్టీ ఉంటుందన్నారు. రైతులకు న్యాయం జరగాలని రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టామన్నారు. మళ్ళీ దేశంలో మోడీ నే ప్రధాని అవుతున్నాడని తెలిపారు. రైతులకు మోడీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఏ రైతు కూడా అత్మహాత్య చేసుకోవద్దనీ మనవి చేస్తున్నానని, రైతులకు ప్రకటించిన హామీలను నెరవేర్చాలని బిజెపి తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని ఎడల ఈ దీక్ష ఇంకా ముందుకు తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నామన్నారు.
Daggubati Purandeswari : రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..
తాజావార్తలు
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
-
Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!