K. Laxman: రూ.2 లక్షలు రుణమాఫీ ఎందుకు చేయలేదు..? రేవంత్ రెడ్డికి లక్ష్మణ్ ప్రశ్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K. Laxman: రూ.2 లక్షలు రుణమాఫీ ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి అని సీఎంకు ఎంపీ రాజ్యసభ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. సంగారెడ్డి రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి ఉందన్నారు. రైతుల పడుతున్న గోస పై భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందన్నారు. అప్పు చేసి వ్యవసాయం చేస్తున్న రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు బేడీలు వేసి, ఈ రోజు పాతాళానికి చేరిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా రతులకు అలవి కానీ హామీలు ప్రకటించిందన్నారు. సోనియా గాంధీ మాట తప్పదు అని చెప్పారని తెలిపారు. మరి సోనియా గాంధీ ప్రకటించిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు.
Read also: Kishan Reddy: కాంగ్రెస్ హామీల అమలుకు నోట్లు ముద్రించే మిషన్ లు పెడతారేమో..!
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
రాజస్తాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల అప్పు తీర్చలేక పోయిందని తెలిపారు. కానీ తెలంగాణా లో కాంగ్రెస్ నీ గెలిపిస్తే రైతు రుణ మాఫీ చేస్తా అని రాహుల్ గాంధీ అన్నాడని అన్నారు. రేవంత్ రెడ్డి నీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి రాహుల్ రాజస్తాన్ వెల్లాడా? అని ప్రశ్నించారు. రాజస్తాన్ లో రైతులు కాంగ్రెస్ కి బుద్ది చెప్పి ఓడించారన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద నరేంద్ర మోది రైతులకు అండగా నిలిచాడన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తెరిపించి రైతులకు సహాయం పడ్డది కూడా నరేంద్ర మోడీ నే అన్నారు. యూరియా, విత్తనాలపై కేంద్రం సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటుందన్నారు. అనవసరమైన ఉచితాలు ప్రకటించకుండా కేంద్రం సబ్సిడీ ఇస్తుందన్నారు. వ్యవసాయం చేసే రైతులకు, కవులు రైతులకు సబ్సిడీ అందించి వారికి న్యాయం చేస్తుంది కేంద్రం అని తెలిపారు.
Read also: Chaari 111: ఓటీటీలో ప్రత్యక్షమైన వెన్నెల కిషోర్ యాక్షన్ కామెడీ మూవీ..!
రైతులను జైలుకు పంపిన పాపానికి కెసిఆర్ ప్రభుత్వం కూలీ పోయిందన్నారు. ఎన్నికల ముందు బ్యాంక్ కు వెళ్లి 2 లక్షల లోన్ తీసుకోండి డిసెంబర్ 9 మాఫీ చేస్తా అని రేవంత్ చెప్పాడన్నారు. ఇప్పటి వరకు 2 లక్షలు రుణ మాఫీ ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి అని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ లను గెలిపిస్తే హామీలు అమలు అవుతాయని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుందన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టే కాంగ్రెస్ మాటలు నమ్మి అధికారాన్ని కల్పించారన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో సొంత ఎమ్మెల్యే లు తిరగబడుతున్నారని తెలిపారు. కర్ణాటకలో తాగు నీరు కూడా అందించలేని పరిస్థితిలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందన్నారు. రేవంత్ రెడ్డి నిన్ను తెలంగాణా ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు.
Read also: Danam Nagender: 10 నిమిషాల్లో 45 వేల టికెట్లు ఎలా అమ్ముడు పోతాయి..?
ఈ రోజు మళ్ళీ తుక్కుగుడలో హామీలు పేరుతో రాజకీయం చేస్తున్నారని తెలిపారు. రైతులు ఏడిస్తే రాష్ట్రానికి మంచిది కాదన్నారు. రైతులు బాగుంటేనే దేశం భాగుంటుంది..రైతులు బాగుంటే ప్రజలు బాగుంటారన్నారు. రైతులకు అండగా బీజేపీ పార్టీ ఉంటుందన్నారు. రైతులకు న్యాయం జరగాలని రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టామన్నారు. మళ్ళీ దేశంలో మోడీ నే ప్రధాని అవుతున్నాడని తెలిపారు. రైతులకు మోడీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఏ రైతు కూడా అత్మహాత్య చేసుకోవద్దనీ మనవి చేస్తున్నానని, రైతులకు ప్రకటించిన హామీలను నెరవేర్చాలని బిజెపి తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని ఎడల ఈ దీక్ష ఇంకా ముందుకు తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నామన్నారు.
Daggubati Purandeswari : రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!