Hukumpet Tragedy:హుకుంపేటలో విషాదం… గోతిలోపడి బాలుడి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లూరి జిల్లా హుకుంపేటలో విషాదం నెలకొంది. నేషనల్ హైవే పనుల్లో భాగంగా తీసిన గోతిలో పడి బాలుడు మృతి చెందడంతో విషాదం నెలకొంది. ఇటీవల కురుస్తున్న వర్షాలు కారణంగా చెరువులా మారింది గొయ్యి…నిన్న సాయంత్రం ఈతకు వెళ్ళిన మజ్జి జ్ఞాన దీపక్ అనే కుర్రాడు గోతిలో పడి మరణించాడు. మజ్జి జ్ఞాన దీపక్ 5వతరగతి చదువుతున్నాడు. గోతి వద్ద చెప్పులు,బట్టలు ఆధారంగా మృత దేహాన్ని వెతికి తీశారు స్థానికులు. నిర్లక్ష్యంగా హైవే పనులు చేయడం కారణంగానే తమ పిల్లవాడు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
అనకాపల్లి దిబ్బ పాలెం గ్రామంలో విషాదం
అనకాపల్లి దిబ్బ పాలెం గ్రామంలో విషాదం ఏర్పడింది. డిగ్రీ విద్యార్థి ప్రాణాలు తీసింది ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్. క్రికెట్ బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చలేక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీసుకున్న అప్పు చెల్లించాలి అంటూ ఒత్తిడి తెచ్చాడు క్రికెట్ బుకీ…సుమారు రూ. లక్షా వరకు అప్పు చేశాడు మృతుడు మధు కుమార్ (20). ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు మధు కుమార్..ఈనెల 23వ తేదీన ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స కోసం విశాఖలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు మధుకుమార్. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also Read
ఇదిలా ఉంటే దిబ్బపాలెం గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన 20 సంవత్సరాల పెంటకోట మధు కేసులో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. క్రికెట్ బెట్టింగ్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి. తల్లి ఫిర్యాదుతో విచారణ ప్రారంభించారు అనకాపల్లి రూరల్ పోలీసులు.. విశాఖ కేజిహెచ్ మార్చురీలో యువకుడి మృతి దేహం ఉంచారు. మధు మృతదేహం ఇవాళ మధ్యాహ్నం స్వగ్రామం చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!