Thummala Nageswara Rao: ప్రతి రైతుకు రూ. 10, 000 ఇస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ నాయకులు మాటలు నేతీ బీరకాయలో నేతీ చెందంలాగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత పది సంవత్సరాలలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన అనేక సందర్భాలలో కేవలం ఎన్నికల సంవత్సరంలో ఎకరానికి 10 వేల పరిహారం ప్రకటించి హడావిడి చేసి కేవలం 150 కోట్లు మాత్రమే విడుదల చేసారు అని విమర్శించారు. ఆ తర్వాత 350 కోట్లకి ఉతర్వూలు జారీ చేసి పరిహారం అందించిన పాపాన పోలేదన్నారు. అదే విధంగా అదే నెలలో మరోసారి1,25,000 ఎకరాల పంట నష్టం సంబవించిన పట్టించుకున్న దాఖలాలు లేవు అని ఆయన ఆరోపించారు. గోదావరి వరదలు వచ్చిన సందర్భంగా 100కు 100 శాతం పంటలు నష్టపోయి ఇసుక మేటలు వేసిన సందర్భంలో అప్పటి ప్రభుత్వంలోని నాయకులు ఏ ఒక్కరూ పట్టించుకోలేదు.. రుణమాఫీ అమలు చేస్తామని గొప్పగా చెప్పుకున్న బీఆర్ఎస్ నాయకులు మొదటి విడత మాఫీని నాలుగు విడతలుగా ఇవ్వడంతో ఆ మొత్తం అసలుకు బదులు వడ్డీ జమైన సందర్భం ప్రతి ఒక్క రైతుకి అనుభవమే అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
Read Also: Warangal: వరంగల్లోని పలు ఆస్పత్రులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసులు..
Also Read
- IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
- DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
ఇక, 2018లో ప్రకటించిన రెండవ విడత రుణమాఫీ 19,600 కోట్ల రూపాయలకు గాను కేవలం 9500 కోట్ల రూపాయలను విడుదల చేసి మమ అనిపించి.. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ముసలి కన్నీళ్ళు పెడుతున్నారు అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అధికారంలో ఉండగా ఏనాడూ రైతు కష్టాలను పట్టించుకోని ప్రభుత్వం గొప్పలకి పోయి నీళ్ళు అవసరంలేని సందర్భాలలో కూడా కాలువలకు నీళ్ళు విడుదల చేసి నీరు వృథా చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ఎప్పటికీ రైతుల పక్షపాత ప్రభుత్వమే.. గత రెండు మూడు రోజుల నుంచి కురిసిన వర్షం వల్ల జరిగిన పంట నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం రైతులను కష్టకాలంలో ఆదుకునేందుకు ఎప్పుడు సిద్దంగా ఉంటుందన్నారు. ఎన్నికల కోసం లేదా రాజకీయాల కోసం ఉత్తుత్తి మాటలు ఉత్తుత్తి పథకాలు ప్రకటించదు.. అదే విధంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి, పంట నష్టంపై రైతు వారి సర్వే చేసి నివేదిక సమర్పించవల్సిందిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
-
RC 17 : కన్ఫ్యూజన్లో పడేసిన సుకుమార్
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
-
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
-
Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!