Delhi Assembly Elections : ఐదు రోజుల్లో ఓటింగ్.. ఆప్కి భారీ ఎదురు దెబ్బ..
- ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) గట్టి ఎదురుదెబ్బ
- ముగ్గురు పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా
- ఓటింగ్కు ఐదు రోజుల ముందు ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటింగ్కు ఐదు రోజుల ముందు ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఎమ్మెల్యేల టిక్కెట్లను పార్టీ రద్దు చేయడంతో వారిలో అసంతృప్తి నెలకొంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలో నరేష్ యాదవ్ (మెహ్రౌలీ), రోహిత్ కుమార్ (త్రిలోక్పురి), రాజేష్ రిషి (జనక్పురి), మదన్ లాల్ (కస్తూర్బా నగర్), పవన్ శర్మ (ఆదర్శ్ నగర్), భావనా గౌడ్ (పాలెం). బీఎస్ జూన్ (బిజ్వాసన్) ఉన్నారు.
READ MORE: Chennai: ప్రియురాలిని, తండ్రిని చంపిన డాక్టర్.. 4 నెలల తర్వాత ఏం జరిగిందంటే..!
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
జనక్పురి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేష్ రిషి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేశారు. టికెట్ నిరాకరించడంతో ఆగ్రహించిన రాజేష్ రిషి అరవింద్ కేజ్రీవాల్కు రాజీనామా లేఖ పంపారు. లేఖలో పార్టీ ప్రాథమిక సూత్రాలను విడనాడి అవినీతిలో మునిగిపోయిందని ఆరోపించారు. సంతోష్ కోలీ త్యాగానికి అవమానం జరిగిందని రాశారు. సంతోష్ కోలీని చంపిన హంతకుడికి టికెట్ ఇవ్వడం పార్టీ కార్యకర్తలకు ద్రోహం చేయడమేనన్నారు. పార్టీలో ఆశ్రిత పక్షపాతం కూడా ఉందని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీని నియంత్రణ లేని ముఠాగా అభివర్ణిచారు. పార్టీ నాయకత్వం అవినీతి, బంధుప్రీతి, నియంతృత్వానికి పర్యాయపదంగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
READ MORE: Damodara Raja Narasimha: ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై మంత్రి కీలక ప్రకటన
పార్టీ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ మెహ్రౌలీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కూడా రాజీనామా చేశారు. నరేష్ యాదవ్కు పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత దానిని ఉపసంహరించుకుంది. ఖురాన్ను అవమానించిన కేసులో యాదవ్కు పంజాబ్ కోర్టు శిక్ష విధించింది. అయితే దీనిపై ఆయన హైకోర్టులో స్టే తీసుకున్నారు. నరేష్ యాదవ్కు టికెట్ ఇవ్వాలనే అంశాన్ని కాంగ్రెస్, ఏఐఎంఐఎం లేవనెత్తాయి.దీంతో టికెట్ నిరాకరించింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!