Economic Survey: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. ఈ కలను ట్రంప్ ఛిన్నాభిన్నం చేస్తాడా?
- ఆర్థిక సర్వే 2025ను ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి
- 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని కల
- భారత్పై ట్రంప్ ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో ఆర్థిక సర్వే 2025ను సమర్పించారు. దీని ప్రకారం.. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే.. రాబోయే ఒకటి లేదా రెండు దశాబ్దాలకు ఏటా సగటున 8% జీడీపీ వృద్ధిని సాధించాలి. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు భారత్ కృషి చేస్తోంది. అయితే ప్రపంచ పర్యావరణం, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు భారతదేశ వృద్ధిని ప్రభావితం చేయగలవని ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి 6.3 నుంచి 6.8 శాతంగా ఉంటుందని అంచనా.
READ MORE: Tamil Nadu Doctor Rape Case: మహిళా డాక్టర్పై సామూహిక అత్యాచారం.. నలుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష..
Also Read
- RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
- Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
- Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
అయితే రాబోయే సంవత్సరాల్లో భారతదేశ వృద్ధి పథాన్ని రూపొందించడంలో ప్రపంచ రాజకీయ, ఆర్థిక వాతావరణం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యం ఓ ముఖ్యమైన అంశం. ముఖ్యంగా అమెరికాతో వాణిజ్య సంబంధం మెరుగ్గా ఉండాలి. కానీ.. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో నుంచి వచ్చే వస్తువులపై 25% సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. చైనా వస్తువులపై 60% సుంకం విధిస్తానని కూడా హెచ్చరించారు. అంతే కాదు.. సొంత కరెన్సీని సృష్టించేందుకు ప్రయత్నిస్తే 100 శాతం పన్ను విధిస్తామని బ్రిక్స్ దేశాలను అమెరికా అధ్యక్షుడు బెదిరించారు.
READ MORE: Fatima Sana Sheikh: అవకాశాల కోసం హైదరాబాద్ వస్తే ప**వాలన్నారు.. దంగల్ నటి సంచలనం!
అమెరికా భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారత్ సహా ఇతర దేశాలపై భారీగా సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన నేపథ్యంలో మోడీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అమెరికా వాణిజ్య విధానంలో మార్పులు వస్తే ఏం చేయాలన్న దానిపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ అంతర్గత సమావేశాలు నిర్వహించింది. ట్రంప్ ప్రకటనతో భారత ఎగుమతులపై ప్రభావం పడనుందని నిపుణులు తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 120 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు ఒక వేళ ట్రంప్ భారత్
పై సుంకాలు విధిస్తే.. 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న భారత్ కల నీరుగారుతుంది!
తాజావార్తలు
-
Box Office : సెప్టెంబర్లో సినిమా జాతర.. గెలిచేది ఎవరు.?
-
NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!