Chennai: ప్రియురాలిని, తండ్రిని చంపిన డాక్టర్.. 4 నెలల తర్వాత ఏం జరిగిందంటే..!
- ప్రియురాలిని, తండ్రిని చంపిన డాక్టర్
- 4 నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘోరం
- తమిళనాడులోకి చెన్నైలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. విద్య ఉన్నవాడు.. విద్య లేని వాడు ఒకే రీతిగా నేరాలు చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే హంతకులుగా మారి భవిష్యత్ను పాడుచేసుకుంటున్నారు. తాజాగా చెన్నైలో ఓ వైద్యుడు చేసిన ఘోరం 4 నాలుగు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Economic Survey: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. ఈ కలను ట్రంప్ ఛిన్నాభిన్నం చేస్తాడా?
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
ఆస్ట్రియాకు చెందిన హోమియోపతి వైద్యుడు శామ్యూల్ ఎబినేజర్ సంపత్(34), ప్రియురాలు సింథియా (37), ఆమె తండ్రి శామ్యూల్ శంకర్(78) ఒకే ఇంట్లో ఉంటున్నారు. శామ్యూల్ శంకర్ డియాలసిస్ పేషెంట్. శామ్యూల్ శంకర్ వైద్యం కోసం సింథియా చెన్నైలోని ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. సోషల్ మీడియా ద్వారా సింథియా.. సంపత్కు పరిచయం ఏర్పడింది. శామ్యూల్ శంకర్కు సంపత్ డయాలసిస్ చేస్తున్నాడు. హఠాత్తుగా కొద్దిరోజులకే శామ్యూల్ శంకర్ చనిపోయాడు. దీంతో సింథియా-సంపత్ మధ్య వివాదం తలెత్తింది. సరైన వైద్యం చేయకపోవడంతోనే తన తండ్రి చనిపోయాడంటూ సింథియా.. ప్రియుడు సంపత్తో గొడవపెట్టుకుంది. ఉద్దేశపూర్వకంగానే తన తండ్రిని చంపేశావంటూ ఘర్షణకు దిగింది. దీంతో కోపంలో సింథియాను సంపత్ తోసేశాడు. కిందపడగానే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు విడిచింది. అంతే ఏం చేయాలో తోయక.. అలా నాలుగు నెలల పాటు అపార్ట్మెంట్లోనే మృతదేహాలను ఉంచేశాడు. అతడు మాత్రం కంచీపురంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు. అయితే దుర్వాసన రాకుండా రసాయనాలు జల్లుతూ వచ్చాడు. దుర్వాసన ఎక్కువ కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకుని డోర్లు ఓపెన్ చేయగా రెండు కుళ్లిపోయిన మృతదేహాలు కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కాంచీపురంలో నిందితుడు సంపత్ను అరెస్ట్ చేశారు. హత్యలకు కారణంపై దర్యాప్తు కొనసాగిస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Damodara Raja Narasimha: ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై మంత్రి కీలక ప్రకటన
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..