Chennai: ప్రియురాలిని, తండ్రిని చంపిన డాక్టర్.. 4 నెలల తర్వాత ఏం జరిగిందంటే..!
- ప్రియురాలిని, తండ్రిని చంపిన డాక్టర్
- 4 నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘోరం
- తమిళనాడులోకి చెన్నైలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. విద్య ఉన్నవాడు.. విద్య లేని వాడు ఒకే రీతిగా నేరాలు చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే హంతకులుగా మారి భవిష్యత్ను పాడుచేసుకుంటున్నారు. తాజాగా చెన్నైలో ఓ వైద్యుడు చేసిన ఘోరం 4 నాలుగు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Economic Survey: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. ఈ కలను ట్రంప్ ఛిన్నాభిన్నం చేస్తాడా?
Also Read
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
ఆస్ట్రియాకు చెందిన హోమియోపతి వైద్యుడు శామ్యూల్ ఎబినేజర్ సంపత్(34), ప్రియురాలు సింథియా (37), ఆమె తండ్రి శామ్యూల్ శంకర్(78) ఒకే ఇంట్లో ఉంటున్నారు. శామ్యూల్ శంకర్ డియాలసిస్ పేషెంట్. శామ్యూల్ శంకర్ వైద్యం కోసం సింథియా చెన్నైలోని ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. సోషల్ మీడియా ద్వారా సింథియా.. సంపత్కు పరిచయం ఏర్పడింది. శామ్యూల్ శంకర్కు సంపత్ డయాలసిస్ చేస్తున్నాడు. హఠాత్తుగా కొద్దిరోజులకే శామ్యూల్ శంకర్ చనిపోయాడు. దీంతో సింథియా-సంపత్ మధ్య వివాదం తలెత్తింది. సరైన వైద్యం చేయకపోవడంతోనే తన తండ్రి చనిపోయాడంటూ సింథియా.. ప్రియుడు సంపత్తో గొడవపెట్టుకుంది. ఉద్దేశపూర్వకంగానే తన తండ్రిని చంపేశావంటూ ఘర్షణకు దిగింది. దీంతో కోపంలో సింథియాను సంపత్ తోసేశాడు. కిందపడగానే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు విడిచింది. అంతే ఏం చేయాలో తోయక.. అలా నాలుగు నెలల పాటు అపార్ట్మెంట్లోనే మృతదేహాలను ఉంచేశాడు. అతడు మాత్రం కంచీపురంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు. అయితే దుర్వాసన రాకుండా రసాయనాలు జల్లుతూ వచ్చాడు. దుర్వాసన ఎక్కువ కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకుని డోర్లు ఓపెన్ చేయగా రెండు కుళ్లిపోయిన మృతదేహాలు కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కాంచీపురంలో నిందితుడు సంపత్ను అరెస్ట్ చేశారు. హత్యలకు కారణంపై దర్యాప్తు కొనసాగిస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Damodara Raja Narasimha: ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై మంత్రి కీలక ప్రకటన
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్
-
S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్లో స్పెషల్గా కీర్తన..
-
LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం