Chennai: ప్రియురాలిని, తండ్రిని చంపిన డాక్టర్.. 4 నెలల తర్వాత ఏం జరిగిందంటే..!
- ప్రియురాలిని, తండ్రిని చంపిన డాక్టర్
- 4 నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘోరం
- తమిళనాడులోకి చెన్నైలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. విద్య ఉన్నవాడు.. విద్య లేని వాడు ఒకే రీతిగా నేరాలు చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే హంతకులుగా మారి భవిష్యత్ను పాడుచేసుకుంటున్నారు. తాజాగా చెన్నైలో ఓ వైద్యుడు చేసిన ఘోరం 4 నాలుగు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Economic Survey: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. ఈ కలను ట్రంప్ ఛిన్నాభిన్నం చేస్తాడా?
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ఆస్ట్రియాకు చెందిన హోమియోపతి వైద్యుడు శామ్యూల్ ఎబినేజర్ సంపత్(34), ప్రియురాలు సింథియా (37), ఆమె తండ్రి శామ్యూల్ శంకర్(78) ఒకే ఇంట్లో ఉంటున్నారు. శామ్యూల్ శంకర్ డియాలసిస్ పేషెంట్. శామ్యూల్ శంకర్ వైద్యం కోసం సింథియా చెన్నైలోని ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. సోషల్ మీడియా ద్వారా సింథియా.. సంపత్కు పరిచయం ఏర్పడింది. శామ్యూల్ శంకర్కు సంపత్ డయాలసిస్ చేస్తున్నాడు. హఠాత్తుగా కొద్దిరోజులకే శామ్యూల్ శంకర్ చనిపోయాడు. దీంతో సింథియా-సంపత్ మధ్య వివాదం తలెత్తింది. సరైన వైద్యం చేయకపోవడంతోనే తన తండ్రి చనిపోయాడంటూ సింథియా.. ప్రియుడు సంపత్తో గొడవపెట్టుకుంది. ఉద్దేశపూర్వకంగానే తన తండ్రిని చంపేశావంటూ ఘర్షణకు దిగింది. దీంతో కోపంలో సింథియాను సంపత్ తోసేశాడు. కిందపడగానే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు విడిచింది. అంతే ఏం చేయాలో తోయక.. అలా నాలుగు నెలల పాటు అపార్ట్మెంట్లోనే మృతదేహాలను ఉంచేశాడు. అతడు మాత్రం కంచీపురంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు. అయితే దుర్వాసన రాకుండా రసాయనాలు జల్లుతూ వచ్చాడు. దుర్వాసన ఎక్కువ కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకుని డోర్లు ఓపెన్ చేయగా రెండు కుళ్లిపోయిన మృతదేహాలు కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కాంచీపురంలో నిందితుడు సంపత్ను అరెస్ట్ చేశారు. హత్యలకు కారణంపై దర్యాప్తు కొనసాగిస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Damodara Raja Narasimha: ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై మంత్రి కీలక ప్రకటన
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!