Chennai: ప్రియురాలిని, తండ్రిని చంపిన డాక్టర్.. 4 నెలల తర్వాత ఏం జరిగిందంటే..!
- ప్రియురాలిని, తండ్రిని చంపిన డాక్టర్
- 4 నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘోరం
- తమిళనాడులోకి చెన్నైలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. విద్య ఉన్నవాడు.. విద్య లేని వాడు ఒకే రీతిగా నేరాలు చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే హంతకులుగా మారి భవిష్యత్ను పాడుచేసుకుంటున్నారు. తాజాగా చెన్నైలో ఓ వైద్యుడు చేసిన ఘోరం 4 నాలుగు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Economic Survey: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. ఈ కలను ట్రంప్ ఛిన్నాభిన్నం చేస్తాడా?
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ఆస్ట్రియాకు చెందిన హోమియోపతి వైద్యుడు శామ్యూల్ ఎబినేజర్ సంపత్(34), ప్రియురాలు సింథియా (37), ఆమె తండ్రి శామ్యూల్ శంకర్(78) ఒకే ఇంట్లో ఉంటున్నారు. శామ్యూల్ శంకర్ డియాలసిస్ పేషెంట్. శామ్యూల్ శంకర్ వైద్యం కోసం సింథియా చెన్నైలోని ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. సోషల్ మీడియా ద్వారా సింథియా.. సంపత్కు పరిచయం ఏర్పడింది. శామ్యూల్ శంకర్కు సంపత్ డయాలసిస్ చేస్తున్నాడు. హఠాత్తుగా కొద్దిరోజులకే శామ్యూల్ శంకర్ చనిపోయాడు. దీంతో సింథియా-సంపత్ మధ్య వివాదం తలెత్తింది. సరైన వైద్యం చేయకపోవడంతోనే తన తండ్రి చనిపోయాడంటూ సింథియా.. ప్రియుడు సంపత్తో గొడవపెట్టుకుంది. ఉద్దేశపూర్వకంగానే తన తండ్రిని చంపేశావంటూ ఘర్షణకు దిగింది. దీంతో కోపంలో సింథియాను సంపత్ తోసేశాడు. కిందపడగానే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు విడిచింది. అంతే ఏం చేయాలో తోయక.. అలా నాలుగు నెలల పాటు అపార్ట్మెంట్లోనే మృతదేహాలను ఉంచేశాడు. అతడు మాత్రం కంచీపురంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు. అయితే దుర్వాసన రాకుండా రసాయనాలు జల్లుతూ వచ్చాడు. దుర్వాసన ఎక్కువ కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకుని డోర్లు ఓపెన్ చేయగా రెండు కుళ్లిపోయిన మృతదేహాలు కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కాంచీపురంలో నిందితుడు సంపత్ను అరెస్ట్ చేశారు. హత్యలకు కారణంపై దర్యాప్తు కొనసాగిస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Damodara Raja Narasimha: ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై మంత్రి కీలక ప్రకటన
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!