Madhu Yashki: తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ( శుక్రవారం ) ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది అని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ అన్నారు. ఈనెల 6న గాంధీ ఐడియాలోజీ సెంటర్ లో కూడా మీటింగ్ ఉంటుంది అని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగల సినిమా చూపిస్తామన్నాడు. కేసీఆర్, నరేంద్ర మోడీ తెరవెనుక తెరముందు ఎట్లా అనేది చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీని ఐదేళ్లుగా మాఫీ చేయకుండా ఇప్పుడు చేస్తామని ప్రకటించారు.. ఐదేళ్ల మిత్తి మాఫీ అయ్యింది అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Rains Alert: తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షం
Also Read
పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తామని మధుయాష్కీగౌడ్ తెలిపారు. తెలంగాణాలో దోపిడీ జరుగుతోంది.. అన్ని వర్గాలను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి మోసం చేస్తున్నారు.. తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారు.. రేపు రాష్ట్రానికి ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ రానున్నారు అని మధుయాష్కీ అన్నారు. పార్లమెంట్ అడ్వైజరీ సభ్యులు కూడా వస్తారని తెలియజేశాడు.
Read Also: Heaviest Animal: ప్రపంచంలోనే అత్యంత బరువైన జంతువు.. ఎంతుంటుందో తెలిస్తే షాకవుతారు..!
సత్యమేవ జయతే.. రాహుల్ విషయంలో సత్యం గెలిచింది అని ప్రచార కమిటీ ఛైర్మన్ తెలిపారు. సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం సంతోషకరం.. రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం అణిచివేయాలని చూసింది.. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ.. ఇలా కుట్రలు చేసి కాదు.. కేంద్ర విచారణ సంస్థలను ఉసిగొల్పి కాంగ్రెస్ నేతలను, సానుభూతి పరులను వేధిస్తున్నారు అని మధుయాష్కి విమర్శించారు. మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ పార్లమెంట్లో ఎందుకు మాట్లాడం లేదు అని అడిగారు.
Read Also: Tamannaah Bhatia: భోళా శంకర్, వేదాళం రీమేకే కానీ అంతా మార్చేశారు.. అసలు విషయం చెప్పేసిన తమన్నా
బీఆర్ఎస్ ఎన్నికల హామీలపై జనాల్లోకి తీసుకెళ్తామని పీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు అని ఆయన విమర్శించారు. వారిని ఏవిధంగా కాపాడుకోవాలి అనే దానిపై చర్చ చేశామని ఆయన అన్నారు. కాంగ్రెస్ సానుభూతి పరులను కూడా కాపాడుకుంటామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కష్టపడి పని చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్లు పొంగులేటి తెలిపారు.
తాజావార్తలు
-
BCCI Meeting: సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీపై కీలక నిర్ణయం?.. బీసీసీఐ సమావేశంలో హాట్ టాపిక్!
-
Sreeleela: శ్రీలీల – తిలక్ వర్మ రిలేషన్షిప్పై షాకింగ్ ట్విస్ట్..!
-
Kumar Sangakkara: “వైభవ్తో క్రికెట్ ముచ్చట్లు పెట్టను”.. బుడ్డోడి సీక్రెట్ లీక్ చేసిన రాజస్థాన్ హెడ్ కోచ్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..