CRIME: ప్రియురాలి సోదరుడితో కలిసి పెళ్ళాన్ని హతమార్చిన భర్త..
- జూన్ 19న ఓ మహిళ మృతదేహం స్వాధీనం చేసుకున్న పోలీసులు
- కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించగా వెలుగులోకి సంచలన విషయాలు
- ప్రియురాలి సోదరుడితో కలిసి భార్యను హత్య చేసినట్లు గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ రాష్ట్రం పాలి జిల్లాలోని బిలారా రాష్ట్ర రహదారిపై మాండ్లా గ్రామ సమీపంలో మూడు రోజుల క్రితం ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను హత్య చేసి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళ భర్త తన ప్రియురాలి సోదరుడితో కలిసి ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. హత్యా నేరం కింద మహిళ భర్త, అతని ప్రియురాలి సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు.
READ MORE: Alcohol and Foods: ఆల్కహాల్ తాగేటప్పుడు ఇవి తినండి.. రుచిని ఎప్పటికీ మరచిపోలేరు..
Also Read
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
పాలి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చునారామ్ జాట్ కథనం ప్రకారం.. జూన్ 19న మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. ఆమె ఉత్తరాఖండ్ నివాసి. ఆమె అత్తమామలు ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. మృతి చెందిన మహిళ భర్త అడ్వకేట్. అతడి పేరు విశాల్. విశాల్ తన మోహిత్ సోదరిని ప్రేమిస్తున్నాడు. దీన్ని విశాల్ భార్య వర్ష వ్యతిరేకించింది. విశాల్ ప్రియురాలు తనతోనే కలిసి ఉంటానని అతడిని బలవంతం పెట్టింది. మోహిత్ కూడా విశాల్ పై ఒత్తిడి తెచ్చాడు. దీంతో విశాల్ తన భార్యను తప్పించాలని ప్లాన్ చేశాడు. వర్షను తీసుకు వచ్చేందుకు రాజస్థాన్ వెళ్లాడు. మోహిత్ కూడా అతనితో ఉన్నాడు. వర్షాను జూన్ 19న తీసుకొస్తుండగా.. బిలారా రాష్ట్ర రహదారిపై విశాల్ కారున ఆపాడు. వర్ష ఛాతిలోకి రెండు బుల్లెట్లు కాల్చాడు. పక్కనే ఉన్న మోహిన్ పదునైన ఆయుధంతో వర్ష మెడపై దాడి చేశాడు.
READ MORE: Blackmail: సోషల్ మీడియాలో స్నేహం.. బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాదిన్నరగా యువతిపై అత్యాచారం
దీంతో వర్ష అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత నిందితుడు, అతని సహచరుడు మృతదేహాన్ని పాతిపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే పట్టుబడతామన్న భయంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయి ఉత్తరప్రదేశ్లోని మధురలోని వర్షనా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ విశాల్ తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు భార్త విశాల్, విశాల్ ప్రియురాలి సోదరుడు మోహిత్ ను హంతకులుగా తేల్చారు. వారిద్దరినీ ఉత్తర్ ప్రదేశ్లోని మధుర జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!