Blackmail: సోషల్ మీడియాలో స్నేహం.. బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాదిన్నరగా యువతిపై అత్యాచారం
- సోషల్ మీడియాలో స్నేహం
- బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాదిన్నరగా యువతిపై అత్యాచారం
- మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో ఘటన
- అత్యాచారం దాడి సహా పలు సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో 20 ఏళ్ల యువతిపై ఏడాదిన్నరగా అత్యాచారం చేసిన ఉదంతం వెలుగు చూసింది. అంతేకాకుండా.. అత్యాచారం వీడియో తీసినట్లు బాధితురాలు చెబుతోంది. నిందితుడు తనకు సోషల్ మీడియాలో పరిచయమయ్యాడని తెలిపింది. ఈ క్రమంలో తనను బెదిరించి అనేకసార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపిస్తుంది. అతని వేధింపుల వల్ల ఏడాదిన్నరలో మూడు ఇళ్లను మార్చింది. అయితే నిందితుడిపై ఆగడాలు తట్టుకోలేక హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు పెట్టింది. అత్యాచారం, దాడి సహా పలు సెక్షన్ల కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
యువతి తెలిపిన వివరాల ప్రకారం.. తాను బామోరి నుండి వచ్చి ఇక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపింది. తన నాన్న మానసిక అనారోగ్యంతో ఉన్నారని.. అతను మంచం మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నాడని పేర్కొంది. తమ్ముడు చదువుకుంటున్నాడు.. ఇంటి ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని వాపోయింది. ఈ క్రమంలో.. రెండున్నరేళ్ల క్రితం గుణ వచ్చినట్లు పోలీసులకు చెప్పింది. తాను చేసే ఉద్యోగం డబ్బులతో ఇంటికి పంపించేదాన్ని అని తెలిపింది. అయితే.. 2022 సంవత్సరంలో తాను ఇన్స్టాగ్రామ్లో ఒక యువకుడితో స్నేహం చేశానని.. తన పేరు భయ్యూ అని చెప్పింది.
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
Read Also: Anushka Shetty: అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి.. సూడోబుల్బార్ ఎఫెక్ట్ ఏంటో తెలుసా?
క్రమంగా యువతి అతనితో మాట్లాడటం ప్రారంభించింది. అంతేకాకుండా.. తరచుగా కలుసుకునేవాళ్లమని యువతి చెప్పింది. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు చాలా ఉన్నాయని.. అయితే ఒకరోజు తాను ఓ గదిలో అద్దెకు ఉంటున్నానని తెలిసి.. అక్కడికి వచ్చాడని తెలిపింది. ఈ క్రమంలో.. తనపై బలవంతంగా అత్యాచారం చేశాడని, అంతేకాకుండా.. వీడియో కూడా తీశాడని చెప్పింది. ఇక అప్పటి నుంచి తనపై చిత్రహింసలు మొదలయ్యాయని.. తన ఫోటో-వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు పేర్కొంది.
అంతేకాకుండా.. నిందితుడు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చేవాడని చెప్పింది. అందుకోసం.. మత మార్పిడి ఒత్తిడి చేయడం కూడా ప్రారంభించాడని తెలిపింది. నిందితుడు ఫోన్ చేసి చిత్రహింసలు పెట్టేవాడని, ఈ క్రమంలో రెండుసార్లు రూమ్ మారినట్లు యువతి చెప్పింది. గత ఏడాదిన్నరగా నిందితుడు అర్షద్ తనను చాలా చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో.. యువతి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కొత్వాలి పోలీస్స్టేషన్ ఇన్ఛార్జ్ అనూప్ భార్గవ తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!