MRO Killed: అర్ధరాత్రి తహసీల్దార్ దారుణహత్య.. ఇనుప రాడ్డులతో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MRO Killed: విశాఖలో అర్ధరాత్రి దుండగులు చెలరేగి పోయారు. విజయనగరం జిల్లా బంటుమిల్లి తహాసీల్దార్ రమణయ్యను ఇనుపరాడ్డులతో తలపై కొట్టి పరారయ్యారు దుండగులు. కొమ్మాదిలోని తహశీల్దార్ రమణయ్య నివశిస్తున్న అపార్ట్ మెంట్లోకి చొరబడి ఆయనపై దాడి చేశారు. వాచ్మెన్ గట్టిగా కేకలు వేయడంతో ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే తహసీల్దారును అపోలో హాస్పటల్కు తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: YSRCP: విజయవాడలో టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరిన మాజీ డిప్యూటీ మేయర్
Also Read
- Fuel Prices: తగ్గిన LPG ధరలు.. మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇదిగో..
- Ruchika Singh: "నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి".. ప్రధానిని దూషించిన విద్యార్థిని వీడియో విడుదల
- Jurala Project: ఉప్పొంగుతున్న కృష్ణమ్మ.. జూరాల ప్రాజెక్ట్ 29 గేట్లు ఎత్తివేత
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
తహసీల్దార్ రమణయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమణయ్య సొంత ఊరు శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దిమ్మిలాడ గ్రామం. విధుల్లో చేరి పదేళ్లు అవుతుంది. డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, కలెక్టరేట్లో ఏవోగా విధులు నిర్వహించారు. వజ్రపు కొత్తూరు, పద్మనాభం, విశాఖ రూరల్ చినగదిలి మండలాల్లో ఎమ్మార్వోగా రమణయ్య పనిచేశారు. ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల క్రితం విజయనగరం నగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయింది. మొదటి రోజు విధులకు హాజరై రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి రమణయ్య చేరుకున్నారు. రాత్రి సుమారు 10:15 గంటల సమయంలో ఫోన్ రావడంతో ఫ్లాట్ నుంచి తహసీల్దార్ కిందకు వచ్చారు. ఓ వ్యక్తితో పది నిమిషాల పాటు సీరియస్గా సంభాషణ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్తో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు రమణయ్య. రక్తపు మడుగులో పడి ఉన్న రమణయ్యను బంధువులు వెంటనే అపోలో హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో అత్యవసర చికిత్స పొందుతూ తహసీల్దార్ రమణయ్య మృతి చెందారు. కొమ్మాదిలో చరణ్ క్యాస్టాల్ అపార్ట్మెంట్ లో ఐదో ఫ్లోర్లో తహశీల్దార్ రమణయ్య నివాసం ఉంటున్నారు.
Read ALso: Students Died Abroad: విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థుల మరణం.. ఎక్కువగా కెనడాలోనే..
రూరల్ కార్యాలయంలో పని చేసినప్పుడు భూ వివాదాలలో కఠినంగా వ్యవహరించే అధికారిగా రమణయ్యకు గుర్తింపు వుంది. దీంతో దాడి వెనుక భూవివాదమే కారణం అయి వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దాడి కేసులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. సంఘటన స్థలాన్ని 1.30గంటల సమయంలో సీపీ రవిశంకర్ అయ్యన్నార్ చేరుకున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. విశాఖ జిల్లాలో ఈ తరహా ఘటన జరగడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. తహసీల్దార్ మృతితో విషాదఛాయలు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Jr NTR : ‘డ్రాగన్’ షూటింగ్కు బ్రేక్.. ఎన్టీఆర్ గాయం కారణంగా శ్రీలంక షెడ్యూల్ రద్దు
-
Bengaluru Murder: మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి.. ఇంట్లోనే వదిలేసి తాళం వేశాడు..బెంగళూరులో ప్రకంపనలు రేపుతోన్న వివాహిత మరణం!
-
MG Hector Plus Diesel: ఎంజీ హెక్టర్ కొత్త డీజిల్ వేరియంట్ విడుదల.. ధర, ఇంజిన్, ఫీచర్లు ఇవే
-
Fuel Prices: తగ్గిన LPG ధరలు.. మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇదిగో..
-
Ruchika Singh: “నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి”.. ప్రధానిని దూషించిన విద్యార్థిని వీడియో విడుదల
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!