Supreme Court: అక్కడి వారికి బ్యాడ్ న్యూస్.. గ్రీన్ క్రాకర్లకు సైతం రెడ్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court says No to Green crackers: దీపావళి వస్తుందంటే అందరూ ఎదురు చూసేది టపాసులు కాల్చడం కోసమే. చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు టపాసులు కాల్చి ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అయితే వీటి వల్ల భారీగా వాయుకాలుష్యం, ధ్వని కాలుష్యం కలుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశంలో వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న ఢిల్లీలో టపాసులు కాల్చడం పై ప్రభుత్వం నిషేధం విధించింది. దీనిపై కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రభుత్వం నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. గ్రీన్ క్రాకర్లకు సైతం సుప్రీం కోర్టు నో చెప్పింది. బేరియంతో ఫైర్ క్రాకర్ల తయారీ, వినియోగాన్ని అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సైతం తోసిపుచ్చింది. ఈ బాణాసంచా తయారీ, విక్రయ ప్రక్రియ గురించి కేంద్ర ప్రభుత్వం, బాణసంచా తయారీదారులు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. వాటి తయారీకి అనుమతి ఇవ్వాలని ఇరు వర్గాలు అభ్యర్థించాయి. దేశంలో చాలా చోట్లా బేరియంతో కూడిన బాణసంచాపై నిషేధం విధించిన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
Also Read: Perni Nani: చంద్రబాబు అవినీతికి ఆ నోటీసులే సాక్ష్యం..! కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఆయనదే..
Also Read
- AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
- Arjun Tendulkar విధ్వంసం.. ఆల్రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
- Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
- Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
2018 నాటి నిషేధాన్ని అధికారులు విధిగా అమలు చేయాలని జస్టిస్ బోపన్న, జస్టిస్ సుందరేష్ తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి హాజరై వాదనలు వినిపించారు. బేరియంను 2018 దీపావళి కోసం నిషేధించినట్టు వివరించారు. ఢిల్లీ-ఎన్సీఆర్ మినహా అన్ని చోట్లా గ్రీన్ కాకర్స్ కాల్చవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని.. బాణాసంచా కాల్చడం ముఖ్యం కాదని గతంలో కూడా కోర్టు పేర్కొంది. ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే ఢిల్లీ సర్కారు క్రాకర్లు కాలుస్తున్న వారిపై కేసులు పెడుతుంది. అయితే సుప్రీం కోర్టు ఇది సరైనది కాదని అభిప్రాయపడింది. కాలుస్తున్న వారిని కాకుండా వాటి తయారీ మూలాల్లోకి వెళ్లి సమస్యను పరిష్కరించాలని సూచించింది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటి వరకు టపాసులు కాలుస్తున్నారంటూ 2,616 మంది వ్యక్తులపై కేసులు పెట్టింది. రాజధాని నగరంలో పటాకుల విక్రయాలకు తాత్కాలిక లైసెన్సులు ఇవ్వొద్దని ఢిల్లీ పోలీసులను గత వారం సుప్రీంకోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
-
Vaibhav Sooryavanshi: అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన వైభవ్ సూర్యవంశీ!
-
Arjun Tendulkar విధ్వంసం.. ఆల్రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
-
LENIN : అఖిల్ ‘లెనిన్’ ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
ట్రెండింగ్
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!